చెత్త వేశాడని ఇలా చేస్తారా..!


సబ్బవరం: సమాజంలో ఆస్తి కోసమో, డబ్బు కోసమో, పాత కక్ష్యలతో, మరే ఇతర కారణాల వల్ల మనిషిని హత్య చేయటం చూశాం. కానీ చెత్త వేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని పొరుగుంటివారు హత్య చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా సబ్బవరం  మండలంలోని రావులమ్మపాలెంలో చోటుచేసుకుంది. లాలం శ్రీనివాసులు(40) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం రావులపాలెం వచ్చి కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటికి పక్కన ఉన్న గదిలో లంక అప్పలనాయుడు కుటుంబం ఉంటోంది. 

 

ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య చెత్త విషయంలో గురువారం రాత్రి గొడవ జరిగింది. తమ ఇంటి ముందు చెత్త వేశాడని అప్పలనాయుడు, అతని కుటుంబ సభ్యులు కలిసి శ్రీనివాస్పై రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

                  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top