
నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. పెనుమాక, ఎర్రబాలెం మీదుగా రైతులను పలకరించుకుంటూ వెళ్లి బేతపూడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడే మీడియాతోనూ మాట్లాడతారని అభిమాన సంఘం నేతలు చెప్పారు.