మండలంలోని కేశవాపురం గ్రామం వద్ద ఇన్నోవా బోల్తా పడింది. ఈ ఘటనలో బాలాజీ(45) అనే వ్యక్తి మృతిచెందారు.
వైఎస్సార్ జిల్లా( చిన్నమండెం):మండలంలోని కేశవాపురం గ్రామం వద్ద ఇన్నోవా బోల్తా పడింది. ఈ ఘటనలో బాలాజీ(45) అనే వ్యక్తి మృతిచెందారు. ఇన్నోవాలో ఉన్న మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదసమయంలో ఇన్నోవా యజమానే డ్రైవింగ్ చేస్తున్నాడు. రామాపురం మండలంలో అమ్మవారికి బోనాలు సమర్పించటానికి బెంగుళూరు నుంచి వస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.