జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు: మాజీ ఎంపీ | Sakshi
Sakshi News home page

జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు: మాజీ ఎంపీ

Published Fri, Sep 27 2013 12:18 PM

New party formed in next january, says Ex MP Chitturi Ravindra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజమండ్రి మాజీ లోక్సభ సభ్యుడు చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో విభజనకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీంద్ర ప్రసంగిస్తూ...   కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ముద్దాయి కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి సమైక్య ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు. ఆ సెమైక్య సెగ ఢిల్లీని తాకుతుందని చిట్టూరి రవీంద్ర తెలిపారు.

Advertisement
Advertisement