రాజమండ్రి నారాయణ కాలేజీ ఫస్ట్ఇయర్ విద్యార్థి పెద్దపాటి రాజేశ్వరరావు(17) శుక్రవారం సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజమండ్రి క్రైం: రాజమండ్రి నారాయణ కాలేజీ ఫస్ట్ఇయర్ విద్యార్థి పెద్దపాటి రాజేశ్వరరావు(17) శుక్రవారం సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అధ్యాపకులు మందలించడంతో రాజేశ్వరరావు గత కొంతకాలంగా కాలేజీకి వెళ్లడం లేదు. గైర్హాజరుపై విద్యార్థి తండ్రికి అధ్యాపకులు సమాచారమందించారు. దీంతో భద్రాచలంలోని బంధువుల ఇంటిలో ఉన్న రాజేశ్వరరావును తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం కాలేజీకి వెళ్లాలని తండ్రి కోరగా, రాజేశ్వరరావు అందుకు నిరాకరించాడు.
తండ్రిలేని సమయంలో రాజేశ్వరరావు ఇంటిలోని సైనైడ్ మింగి కుప్పకూలిపోయాడు. కాగా, విద్యార్థి మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారమై అధ్యాపకులు మందలించడంతో రాజేశ్వరరావు కాలేజీకి రావట్లేదని సహ విద్యార్థులు చెబుతున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం కాలేజీలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయని, ఒక వర్గం తప్పుపట్టడంతోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని కొందరు అంటున్నారు.