విమానాశ్రయంలో జేసీ వీరంగం | MP JC Diwakar Reddy Fires on Gannavaram Airport Authority Officers | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో జేసీ వీరంగం

Oct 29 2016 4:44 AM | Updated on Sep 13 2018 5:22 PM

విమానాశ్రయంలో జేసీ వీరంగం - Sakshi

విమానాశ్రయంలో జేసీ వీరంగం

గన్నవరం విమానాశ్రయంలో జేసీ దివాకర్‌రెడ్డి ఎయిర్ ఇండియా అధికారులపై చిందులు తొక్కారు.

బోర్డింగ్ పాసు ఇవ్వకపోవడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం

 విమానాశ్రయం(గన్నవరం): గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శుక్రవారం ఎయిర్ ఇండియా అధికారులపై చిందులు తొక్కారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన అప్పటికే బోర్డింగ్ క్లోజ్ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నా టిక్కెట్ రద్దు చేస్తారా? అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తిట్లపురాణం అందుకున్నారు.

ఎయిర్ ఇండియా కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడున్న కంప్యూటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌రూమ్‌లో ఉండగానే జరగడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement