ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, అనంతరం ఉరి వేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది.
ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, అనంతరం ఉరి వేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన విశాఖపట్నం మధురానగర్లో జరిగింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
చిన్నారులిద్దరూ ఆడపిల్లలే. ఆడపిల్లలు పుట్టడంతో భర్త వేధించేవాడని, చిత్ర హింసలు భరించేలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతులను అర్చన, భావనగా గుర్తించారు.