సెజ్‌లు ఏర్పాటు చేసింది అందుకే | Mekapati Goutham Reddy Visits Brandix India Company At Vizag | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో పరిశ్రమలు గాడి తప్పాయి : గౌతం రెడ్డి

Jul 6 2019 4:45 PM | Updated on Jul 6 2019 5:01 PM

Mekapati Goutham Reddy Visits Brandix India Company At Vizag - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్‌ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 20 ఉద్యోగాలు కల్పించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో వైఎస్సార్‌ సెజ్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ టీడీపీ హయాంలో పరిశ్రముల పూర్తిగా గాడితప్పాయని ఆరోపించారు. కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement