ఆ లావాదేవీలతో సంబంధం లేదు


రైతు ఖాతాలో రూ.కోట్ల జమపై ల్యాన్‌కో ఎండీ వివరణ



కర్నూలు(అర్బన్‌): కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన అబ్రçహాం అనే రైతు బ్యాంకు ఖాతాకు జమ అయిన రూ.1,96,07,926 మొత్తానికి తమ కంపెనీకి  సంబంధంలేదని ల్యాన్‌కో అమర్‌ కంటక్‌ కంపెనీ సీఎం విజయ్‌కుమార్‌ తాతపూడి తెలిపారు. తన ఖాతాలో కొద్ది రోజులుగా పెద్ద మొత్తాలు జమ అవడం, మళ్లీ విత్‌డ్రా అవుతుండడంతో రైతు అబ్రహాం శుక్రవారం పత్రికలకు సమాచారమిచ్చిన విషయం విదితమే.



తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ల ప్రకారం ల్యాన్‌కో  నుంచి జమ అయినట్లు ఉన్నాయని రైతు చెప్పారు. దీనిపై ఆ కంపెనీ ఎండీ స్పందిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top