నిరూపిస్తే.. దేనికైనా రెడీ! | know everyone who sold tickets | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే.. దేనికైనా రెడీ!

Nov 8 2014 4:03 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే...దేనికైనారెడీ అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిఐ. వి. పి. రాజు డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్‌కు సవాల్ విసిరారు.

విజయనగరం క్రైం : ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే...దేనికైనారెడీ అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ. వి. పి. రాజు డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిక్కెట్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు నిరూపించాలన్నారు. టిక్కెట్ అమ్ముకున్నది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను తాడ్డి వెంటకరావుకు బి ఫారమ్ కేటాయించి వంగపండు నారాయణప్పలనాయుడుకు ఎంతకు అమ్ముకున్నారో ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు.

పదేళ్లుగా విజయనగరం పట్టణంలో అనేక దందాలు, భూకబ్జాలకు పాల్ప డిన వ్యక్తి ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీసీ అధ్యక్షుడు పట్టణానికి ఎక్కువ... జిల్లా పదవికి తక్కువ అన్న చం దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జిల్లాపై అవగాహన లేని వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని, ఇప్పటివరకు ఆయన ఎన్ని మండలాలు తిరిగారో చెప్పాలన్నారు. విజ య్‌కుమార్ చేసిన దందాలు, భూ ఆక్రమణలపై ఇప్పటికీ కేసు లు నడుస్తున్నాయని తెలిపారు. విజయ్‌కుమార్ అక్రమాలు, దందాలపై విచారణ చేయిస్తామన్నారు.

ఆ పార్టీ నాయకుడు సైలాడ త్రినాథ్‌మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హు ందగా వ్యవహరించాలని, విధానపరమైన విమర్శలు చేసుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజల్లో సులకన భావన వస్తుందని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు వెంకట నరసింగరావు, పార్టీ నాయకులు ఎస్.ఎన్.ఎం.రాజు, మైల పల్లి పైడిరాజు, గుండెల ప్రకాశరావు, మద్దాల ముత్యాలరావు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement