ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌ | KCR Visited YSRCP MLA Chevireddy House Over Tirupati Tour | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌

May 27 2019 12:05 PM | Updated on May 27 2019 8:49 PM

KCR Visited YSRCP MLA Chevireddy House Over Tirupati Tour - Sakshi

సాంప్రదాయబద్దంగా కేసీఆర్‌ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి

సాక్షి, తిరుపతి : తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  తన ఇంటికి రావాల్సిందిగా కోరడంతో కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లారు. వేదమంత్రాలు, సన్నాయి మేళంతో సాంప్రదాయబద్దంగా కేసీఆర్‌ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత కేసీఆర్‌.. రేణిగుంట ఎయిర్‌ పోర్ట్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకు ముందు ఈ ఉదయం కేసీఆర్ కుటుంబసభ్యులు ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్‌కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement