'బాలయ్య ప్రభావం ఏ మాత్రం ఉండదు' | Jagan mohan Reddy will become a chief minister of Andhra Pradesh, says Sridhar reddy | Sakshi
Sakshi News home page

'బాలయ్య ప్రభావం ఏ మాత్రం ఉండదు'

Apr 17 2014 2:55 PM | Updated on Aug 17 2018 8:19 PM

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ హిందూపురం లోక్సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ హిందూపురం లోక్సభ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... ఆ మహానేత మరణం తర్వాత రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఆ మహానేత ఉండి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. విభజనలో మూలకారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా హీరో బాలకృష్ణ బరిలో దిగిన... ఆయన ప్రభావం ఏమాత్రం ఉంటుందని శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement