జూన్‌ 3న ఇంటర్‌ జియోగ్రఫీ పరీక్ష

Intermediate Geography Exam Date Finalised - Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ.. జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top