అయ్యో.. దేవుడా..! | In order to reach the relatives back home to go to the house | Sakshi
Sakshi News home page

అయ్యో.. దేవుడా..!

Jan 12 2014 4:01 AM | Updated on Aug 17 2018 2:53 PM

బంధువుల ఇంట్లో దశదినకర్మకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. అడ్డంగా వచ్చిన పామును తప్పించబోయి బైక్ బ్రిడ్జి కింద పడగా..

గోదావరిఖని/కమాన్‌పూర్, న్యూస్‌లైన్ : బంధువుల ఇంట్లో దశదినకర్మకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. అడ్డంగా వచ్చిన పామును తప్పించబోయి బైక్ బ్రిడ్జి కింద పడగా.. తండ్రి, కుమార్తె మృతి చెందారు. తల్లి, కుమారుడికి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. అంతకుముందు సెల్‌ఫోన్ ప్రమాద విషయం బంధువులకు తెలిపినా.. సంఘటన స్థలాన్ని గుర్తించడానికి రెండు రోజులు పట్టింది. అప్పటివరకు ఆ తల్లీకొడుకులు శవాల పక్కనే ఉండిపోయారు.
 
 కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ కుందారపు శ్రీనివాస్(38), భార్య శ్రీలత, కుమార్తె దీక్షిత(9), కుమారుడు అజయ్‌రామ్‌లతో కలిసి ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో తోడల్లుడి బంధువుల ఇంట్లో దశదినకర్మ కార్యక్రమానికి గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి అదే రాత్రి 7గంటలకు ఈ నలుగురు రొంపికుంటకు బయలుదేరారు. మందమర్రి సమీపంలోని పాలవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రహదారిపై పాము అడ్డం వచ్చింది. దీంతో ఆందోళనకు గురై దానిని తప్పించే ప్రయత్నం లో వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇవతలి వైపున్న సిమెంట్ దిమ్మెలకు ఢీకొన్న వాహనం వేగంగా బ్రిడ్జి కిందకు దూసుకుపోయింది. వాహనంపై ఉన్న నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. శ్రీనివాస్‌కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ముందు భాగంలో కూర్చు న్న కుమార్తె దీక్షిత(9)కూడా తీవ్ర గాయాలపాలైంది. కొంతసేపటి వరకు నీళ్లు కావాలని ఏ డ్చింది.
 
 ప్రమాదంలో నడుము, ఒక కాలు విరి గిపోయి పడిపోయిన తల్లి శ్రీలత కదలలేని స్థితికి చేరింది. కుమారుడు అజయ్‌రామ్‌కు కూ డా గాయాలైనప్పటికీ చుట్టూ ఏం జరుగుతుం దో గమనిస్తున్నాడు. సోదరి నీళ్ల కోసం ఏడుస్తుండగా తట్టుకోలేక ఆ ఇసుకలో అటు ఇటు తిరిగినా నీళ్లు దొరకలేదు. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చిఏడ్చి ఆ రాత్రే కన్నుమూసింది. ఓవైపు భర్త, కుమార్తె కళ్లముందే దుర్మరణం పాలుకాగా, తీవ్ర గాయాలపాలైన కుమారుడిని చూ స్తూ ఆ తల్లి ఏమీ చేయలేక.. బయటకు గొంతుపెగలక లోలోపలే ఏడ్చింది. చివరకు గాయాలపాలైన అజయ్ పాకుతూ చుట్టూ కలియతిరగడంతో పడిపోయిన సెల్‌ఫోన్ కనిపించింది. వెంటనే మందమర్రిలో ఉంటున్న అమ్మమ్మకు ఫోన్ చేసి ‘మాకు యాక్సిడెంట్ అయ్యింది.
 
 మేం బ్రిడ్జి కింద ఉన్నాం..’ అంటూ చేసి సమాచారం అందించాడు. వెంటనే ఆమె తరుఫు బంధువులందరికీ ఈ విషయాన్ని చెప్పడంతో.. వారు శుక్రవారం గోదావరిఖనిలోని బ్రిడ్జి మొదలుకొని మందమర్రి వరకు గల బ్రిడ్జిలన్నింటిని తిరిగారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. చివరకు మంచిర్యా ల పోలీసులను ఆశ్రయించారు. ప్రతి బ్రిడ్జి వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫోన్‌కు రింగ్ ఇవ్వడంతో మందమర్రి సమీపంలోని పాలవాగు వద్ద శనివారం సాయంత్రం క్షతగాత్రులు కని పించారు. వెంటనే గాయాలపాలైన వారిని చికి త్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 ఒక వేళ సెల్‌ఫోన్ చెడిపోయినా.. ఆ రాత్రి ఏవైనా విషపురుగులు బతికున్న వారిని కాటేసినా ఆ కుటుంబంలో ఒక్కరూ మిగిలేవారు కాదు. ప్రమాదం జరిగిన గురువారం రాత్రి 7గంటల నుంచి.. శనివారం సాయంత్రం వరకు దాదాపు రెండు రోజులపాటు మృతదేహాల పక్కనే తల్లి, కుమారుడు ఉండిపోయారు. శ్రీనివాస్ 15 ఏళ్ల నుంచి రొంపికుంట గ్రామంలో వైద్య సేవలందిస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. గతంలో గ్రామంలో పాఠశాలను నిర్వహించగా.. దానిని ఇతరులకు అప్పగించాడు. పిల్లలు అజయ్‌రామ్ 5వ తరగతి, దీక్షిత 4వ తరగతి యైటింక్లయిన్‌కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాస్, దీక్షిత మృతి చెందడం, శ్రీలత, అజయ్ తీవ్ర గాయాలపాలు కావడంతో రొంపికుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement