భార్య మృతితో మనస్తాపం చెంది.. భర్త ఆత్మహత్య | Husband suicide due to wife death | Sakshi
Sakshi News home page

భార్య మృతితో మనస్తాపం చెంది.. భర్త ఆత్మహత్య

May 21 2015 9:51 AM | Updated on Sep 3 2017 2:27 AM

భార్య మృతి చెందడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చిత్తూరు (సోదం): భార్య మృతి చెందడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోదం మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జోగివారిపల్లిలో వెంకటేశ్వరరెడ్డి (70) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే భార్య యశోదమ్మ(63) మూడేళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను వారం కిందట తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యశోదమ్మ గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

వ్యవసాయంలో నష్టాలు రావడంతో భార్యకు ఖరీదైన వైద్యం చేయించలేక పోతున్నానని వెంకటేశ్వరరెడ్డి స్థానికుల దగ్గర తరచూ ఆవేదన చెందుతుండేవారు. ఈ నేపథ్యంలో భార్య మృతి వార్త తెలియగానే ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, వారు గతంలోనే మృతి చెందినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement