గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు | High court orders not to link aadhar with lpg delivery | Sakshi
Sakshi News home page

గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు

Nov 21 2013 8:08 PM | Updated on Aug 31 2018 8:24 PM

గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు - Sakshi

గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు

గ్యాస్ సరఫరాను ఆధార్ కార్డులతో లింకు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

గ్యాస్ సరఫరాకు ఆధార్ కార్డులతో లింకు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని, ఆధార్ కార్డులతో సంబంధం లేకుండానే గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ కార్డుల కోసం ఒత్తిడి చేయడం సరికాదని, వినియోగదారులకు ఆ కార్డులు లేకపోయినా కూడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతో ఆధార్ కార్డులను గ్యాస్ సరఫరాకు లింకు చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకం పుణ్యమాని వినియోగదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సిలిండర్ కొన్న ధరకు, సబ్సిడీ సిలిండర్ ధరకు ఉన్న వ్యత్యాసం మొత్తం బ్యాంకు ఖాతాల్లోకి జమకాకపోవడం, దీనిపై ఎవరిని అడగాలో కూడా తెలియకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కొంతవరకు ఊరట కలిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement