తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
Aug 31 2017 11:42 AM | Updated on Aug 21 2018 11:41 AM
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్కు రంగనాయకుల మండపంలో అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనాలు ఇచ్చారు. తితిదే అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానికి ముందు గవర్నర్ దంపతులు వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement
Advertisement