వంట చేస్తుండగా ప్రమాదం | girl injured in fire accident | Sakshi
Sakshi News home page

వంట చేస్తుండగా ప్రమాదం

Feb 2 2015 4:20 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తు బాలికకు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైంది.

విజయనగరం: ప్రమాదవశాత్తు బాలికకు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలం కప్పబుచ్చంపేట గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. కప్పబుచ్చంపేట గ్రామానికి చెందిన రాయల శృతి(13) కాశీపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో 8వతరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు వచ్చిన బాలిక ఇంటివద్దనే ఉంది. ఈ క్రమంలో సోమవారం వంట చేసేందుకు ప్రయత్నిస్తుండగా చున్నీకి నిప్పు అంటుకొని మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే బాలిక ను బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్‌లోని కేజీహెచ్ కు తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు సిఫారసు చేశారు.
(మక్కువ)

Advertisement
 
Advertisement
Advertisement