కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారు | Ganta srinivasa rao objects KCR lock horns over student fee reimbursement issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారు

Jul 17 2014 11:37 AM | Updated on Sep 5 2018 9:18 PM

కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే బాగుంటుందని గంటా అన్నారు. స్థానికులు, స్థానికేతరుల అంశంపై  కేసీఆర్ వ్యాఖ్యలు సరికావని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్థానికతపై రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ఫణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోని రాజ్యాంగ సంక్షోభం సృష్టించవద్దని గంటా సూచించారు. 1956 ముందు తెలంగాణలో పుట్టినవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement