పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది.
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. ఈ నెల 29న ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి.... పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో చంద్రబాబు పాల్గొనున్నారు.