'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు' | former ias officer EAS Sharma comments over AP govt corruption on Land scams | Sakshi
Sakshi News home page

'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు'

Feb 20 2017 6:31 PM | Updated on Aug 18 2018 8:08 PM

'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు' - Sakshi

'భూ సమీకరణ పేరుతో సర్కార్ కుంభకోణాలు'

భూ సమీకరణ పేరుతో సర్కార్ భూ కుంభకోణాలకు అవకాశం కల్పిస్తోందని ఈఏఎస్ శర్మ చెప్పారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ పేరుతో భూ కుంభకోణాలకు అవకాశం కల్పిస్తోందని మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా భూ సమీకరణ జరుగుతోందన్నారు.

రాజధానిలో సీఆర్‌డీఏ అధికారులు చట్టాలను, రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరముందన్నారు. అసైన్డ్ భూముల విషయంలో అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే ఇబ్బంది పడతారని ఈఏఎస్ శర్మ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement