సర్కారుపై సమరం | fight against government | Sakshi
Sakshi News home page

సర్కారుపై సమరం

Jan 18 2015 4:28 PM | Updated on Aug 9 2018 2:42 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

సాక్షి, విజయవాడ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొనాలని సూచించారు.

నగరంలోని వైఎస్సార్ సీపీ దక్షిణ కష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజులు సమావేశం నిర్వహించారు. కష్ణా, గుంటూరు జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులు, డ్వాక్రా మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలన ప్రారంభించి ఏడు నెలలైనా వాటిని  ఠమొదటిపేజీ తరువాయి
 అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాలకులు అన్నింటికీ సింగపూర్ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రెండురోజులు దీక్ష చేస్తున్నారని తెలిపారు.  
 రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు...
 రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు పంటల పండే భూములను ల్యాండ్ పూలింగ్ పేరు తీసుకోవటం దారుణమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అక్కడి ప్రజలు వివిధ ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంచి పద్ధతి కాదన్నారు. తమ పార్టీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా రాజధాని నిర్మించాలనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు మంజూరు చేయకపోగా, పాత రుణాలు చెలిచాలని వరుస నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి జిల్లాలో సగటున రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం మాత్రం మొదటి విడత మాఫీ పేరుతో కనీసం వడ్డీకి కూడా సరిపోని విధంగా నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు.
 ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ప్రచార బాధ్యత..
 ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా వచ్చేలా ఈ కార్యక్రమం గురించి నియోజకవర్గాల్లో నాయకులు విస్తత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రచార బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పర్యవేక్షించాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో రైతులు, మహిళలు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ నేతలు వారి తరఫున పోరాటం సాగించాలని సూచించారు. సాగి దుర్గా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీని నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.
 సభ్యత నమోదుపై చర్చ.. త్రిసభ్య కమిటీ సభ్యులు పార్టీ సభ్యత్వ నమోదుపై ముఖ్య నాయకులతో చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు దష్టి సారించాలని త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించారు. కష్ణా జిల్లాలోని 16, గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో నూరు శాతం పార్టీ సభ్యత్వ నమోదు జరిగేలా కషిచేయాలని చెప్పారు. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి విధివిధానాలు రూపొందించి సభ్యత్వ నమోదు కార్యక్రమ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం కష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో వేర్వేరుగా సమావేశమై నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు.
 రెండు జిల్లాల నేతల హాజరు..
 ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోన రఘపతి(బాపట్ల), జలీల్‌ఖాన్(విజయవాడ పశ్చిమం) కొడాలి నాని(గుడివాడ), మేకా వెంకటప్రతాప్ అప్పారావు (నూజివీడు), కొక్కిలిగడ్డ రక్షణనిధి(తిరువూరు), పార్టీ దక్షిణ కష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ(రేపల్లె), రాష్ట్ర అధికార ప్రతనిధి అంబటి రాంబాబు (సత్తెనపల్లి), పార్టీ ముఖ్యనేత ఆళ్ల పేరిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అన్నాబత్తుని శ్రావణ్‌కుమార్(తెనాలి), కత్తెర క్రిస్టీనా(తాడికొండ), జోగి రమేష్ (మైలవరం), డాక్టర్ దుట్టా రామచంద్రరావు (గన్నవరం), సింహాద్రి రమేష్‌బాబు(అవనిగడ్డ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కష్ణా జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
 
 వైద్యం..చోద్యం!
 సాక్షి, గుంటూరు
 ప్రై వేటు ఆసుపత్రుల దోపిడీని భరించలేక ప్రభుత్వ వైద్యశాలలకు వెళుతున్న రోగులకు అక్కడి  వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఎదురవుతోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి కనీస వైద్య సేవలు కూడా అందకపోగా, నరకం చూపిస్తున్నారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  తీవ్ర గాయాలతో వచ్చే రోగులకు ఎక్సరే తీసే అవకాశం లేకపోవడం, రక్త పరీక్షలు చేసే సౌకర్యం లేకపోవడంతో ప్రై వేట్ ల్యాబ్‌లను ఆశ్రయి ంచాల్సిన దుస్థితి నెలకొంది.
  ముఖ్యంగా జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ వంటి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు రక్తమోడుతూ ఆసుపత్రులకు వస్తే గాయాలను శుభ్రం చేసి గుంటూరు వంటి పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకోవడం అక్కడి వైద్యులకు పరిపాటిగా మారింది.
   కనీస ప్రాథమిక వైద్య ఠమొదటిపేజీ తరువాయి
 సేవలు కూడా అందక అనేక మంది మార్గమధ్యంలోనే తనువుచాలిస్తున్నారు. ఏళ్లతరబడి ఇలా జరుగుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     ఇక సీజనల్ వ్యాధుల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రమైన గుంటూరులో సమగ్ర వైద్యశాల ఉన్నాయి.
     24 గంటలూ పనిచేసే వైద్యశాలల్లో సైతం జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో బాలింతలు, గర్భిణిలు, పసికందులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో తల్లి, పిల్లల హైరిస్క్ మానిటరింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంత వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.
 సమయపాలన పాటించని సిబ్బంది ...
 పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో  వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండాలి. అధికశాతం మంది వైద్యులు జిల్లా కేంద్రం నుంచి వచ్చి వెళ్తున్నారు. తాపీగా 11.30 గంటలకు పీహెచ్‌సీకి చేరుకుని రెండు గంటలు కాలక్షేపం చేసి తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరి ఇళ్లకు చేరుతున్నారు. దీంతో వైద్య సేవలు అందించేవారు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది వైద్యులకు ప్రై వేట్ ప్రాక్టీస్ ఉండటంతో దష్టంతా అటు వైపే పెడుతున్నారు.
 ఎమర్జెన్సీ మందులు దొరకని వైనం ...
     జిల్లాలోని అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రా ల్లో ప్రజలకు అత్యవసరంగా కావాల్సిన మందులు, ఇన్సులిన్ దొరక్క ఇక్కట్లపాలవుతున్నారు.
     ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసి, సరైన సౌకర్యాలు కల్పించి, అత్యవసర మందులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement