
అధిక పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట మొత్తం దెబ్బతిందయ్యా అంటూ కాట్రావులపల్లికి చెందిన మొక్కజొన్న రైతు శివుడు గణేశ్వరరావు వాపోయారు. పాదయాత్రలో సీతానగరం జంక్షన్ వద్ద జగన్ను కలిసి తన గోడు వినిపించాడు. అదిగోనయ్యా దెబ్బతిన్న పంట అంటూ తన చేనును జగన్కు చూపించాడు రైతు గణేశ్వరరావు. రైతు విజ్ఞప్తి మేరకు జగన్ చేనువైపు చూసి దెబ్బతినడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అకాలంగా కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నదని, ఎకరాకు రూ.30 వేలు నష్టం వాటిల్లిందంటూ రైతు గణేశ్వరరావు జగన్ ఎదుట వాపోయారు.