కరెంట్‌షాక్‌తో రైతు మృతి | farmer died due to electric shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌షాక్‌తో రైతు మృతి

Oct 30 2015 11:33 AM | Updated on Oct 1 2018 4:01 PM

పొలానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెంలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా: పొలానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కొత్తూరి జయశీలుడు(55) శుక్రవారం ఉదయం నీరు పెట్టేందుకు తన పొలానికి వెళ్లాడు. బోరు మోటారుకు ఉన్న సర్వీసు వైరును ఎలుకలు కొరికాయి. అది గమనించని జయశీలుడు దానిని పట్టుకోవటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. విద్యుత్ షాక్తో రైతు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement