సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ యాజమాన్యం కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులను విధుల నుంచి తొలగించి వీధిన పడేశారు. దీంతో వీరంతా థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు ముందు గురువారం ధర్నాను చేపట్టి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగిస్తున్నట్టు బుధవారం సాయంత్రం నోటీస్ బోర్డులో పేర్లు అంటించి వెంటనే తొలగించడం అన్యాయమని కార్మికులు మండిపడుతున్నారు. రెండు నెలలుగా జీతం ఇవ్వక పోగా పనుల నుంచి తొలగించడం దారుణమని బాధితులు షణ్ముఖరావు, శ్యామలరావు,
గంగయ్యరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పూనుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. విధుల నుంచి తీసేయాలనుకుంటే 15 రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉండగా..అలా కాకుండా థర్మల్ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి తొలగించారన్నారు. లేబ ర్ కాలనీలో ఉంటున్న బీహార్, ఒడిశా కార్మికులు మాట్లాడుతూ.. తిండి, నీరు ఇవ్వకుండా బయటకు గెంతేసారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుకు నిరసనగా ప్లాంటు గేటు ముందు కార్మికులు టెంట్ వేశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. టెక్కలి సీఐ భవానీప్రసాద్, నౌపడ ఎస్ఐ మంగరాజు సంఘటన స్థలానికి వచ్చి కార్మిక నాయకులతో చర్చించడంతో ఆందోళనను కార్మికులు తాత్కాలికంగా విరమించార.
థర్మల్ కార్మికులను గెంటేశారు!
Published Thu, Sep 24 2015 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement