అర్ధరాత్రి ప్రార్థనాలయాల తొలగింపు | Demolition of Prayer halls for road widening | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ప్రార్థనాలయాల తొలగింపు

May 1 2016 9:58 AM | Updated on Sep 3 2017 11:12 PM

విజయవాడలోని వన్‌టౌన్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో చేపట్టిన ప్రార్థనాలయాల తొలగింపు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

విజయవాడ : విజయవాడలోని వన్‌టౌన్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో చేపట్టిన ప్రార్థనాలయాల తొలగింపు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. భవానీపురం భాష్యం పాఠశాల సమీపంలో ఉన్న రామాలయం, దర్గాలను యంత్రాలతో తొలగించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పలువురుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement