సాక్షి, హైదరాబాద్: తమ ముందు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి)కి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమన్ల ప్రకారం డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని ఆయనకు తేల్చిచెప్పింది. అయితే సుజనాపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ నుంచి తీసుకున్న రూ.364 కోట్ల అప్పును చెల్లించకుండా ఎగవేశారంటూ కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇటీవల హైదరాబాద్లోని సుజనాచౌదరి కార్యాలయం, నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అలాగే సుజనా గ్రూప్ కింద 120 సూట్కేసు కంపెనీలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. రూ.5,700 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్లు గుర్తించి, అందుకు సంబంధించిన కీలక పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. సూట్కేసు కంపెనీల పేరిట ఆరు ఖరీదైన కార్లు రిజిస్టరైనట్లు గుర్తించి వాటినీ జప్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను కొట్టేయాలని అభ్యర్థిస్తూ సుజనాచౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం విచారించారు.
వాస్తవాలు తెలుసుకునేందుకే సమన్లు..
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడీ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)లో సుజనాచౌదరి పేరు లేదన్నారు. అందువల్ల ఆయనకు జారీచేసిన సమన్లు చట్టప్రకారం చెల్లవన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే సుజనాపై ఈడీ దాడులు జరిగాయని చెప్పారు. ఈ వాదనలను కేంద్రప్రభుత్వ న్యాయవాది అనిల్ సోనీ తోసిపుచ్చారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టస్ లిమిటెడ్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆ కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుజనాచౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయన్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయనకు సమన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని సుజనాచౌదరిని ఆదేశించారు. అయితే సుజనాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఈడీకి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు.
ఈడీ ముందు హాజరు కావాల్సిందే...
Published Sat, Dec 1 2018 5:10 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
టీడీపీ అభ్యర్థి ఆఫీస్ను ముట్టడించిన మహిళలు
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement