రైతుల పొట్ట కొట్టి జేబులు నింపుకుంటున్నారు
ప్రత్యేక హోదా, ఎన్నికల హామీలకు చెల్లుచీటీ
కేంద్ర,రాష్ర్టప్రభుత్వాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ద్వజం
విద్యానగర్(గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను లూఠీ చేస్తూ తమ జేబులు నింపుకుంటూ పాలన చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ దోపిడీ ప్రభుత్వాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రతి కమ్యూనిస్టు పోరాట జెండాలను పట్టాలన్నారు.
వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులను నట్టేట ముంచుతూ చట్టాలను రూపొందిస్తున్నారన్నారు. పాలకులు రైతుల పొట్టను కొట్టి పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి జేబులు నింపుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రజల డబ్బుతో జల్సా చేస్తూ ఎన్నికల హామీలను మరిచిపోయారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని చెప్పినా, ఇప్పటికి రూ.10 కోట్లయినా రప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు.
పారిశ్రామికీకరణ పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారేగాని ఒక్క భూస్వామి స్థలాన్ని తీసుకోలేదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేడు ఆ హోదాను ఇవ్వలేమని స్పష్టం చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ, ఇంటికి ఓ ఉద్యోగం, డాక్రామాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, విజయవాడ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్, సీనియర్ నాయకులు జీవీ కృష్ణారావు, రాష్ట్ర సమితి సభ్యులు రాధాకృష్ణమూర్తి, కోట మాల్యాద్రి పాల్గొన్నారు.
అక్కడ మాటలు..ఇక్కడ దోపిడీ
Published Thu, Apr 30 2015 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement