ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె | Congress cadre are selected as Best farmers list: Palle Raghunath Reddy | Sakshi
Sakshi News home page

ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె

Jun 29 2014 2:38 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె - Sakshi

ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె

ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు.

అనంతపురం: ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని... అందుకే వారందర్ని తొలగించామని రఘునాథ్‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
రైతుల వ్యవసాయ మోటార్స్‌ మార్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హాయంలో పార్టీకి చెందిన కార్యకర్తలని మాత్రమే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని, అయితే నిజమైన ఆదర్శ రైతులను ఎంపిక చేయడానికే అందర్ని తొలగించామన్నారు. ఆదర్శ రైతులను తొలగిస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement