ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలే: పల్లె
ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: ఆదర్శ రైతులందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని... అందుకే వారందర్ని తొలగించామని రఘునాథ్రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రైతుల వ్యవసాయ మోటార్స్ మార్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హాయంలో పార్టీకి చెందిన కార్యకర్తలని మాత్రమే ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని, అయితే నిజమైన ఆదర్శ రైతులను ఎంపిక చేయడానికే అందర్ని తొలగించామన్నారు. ఆదర్శ రైతులను తొలగిస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.