
కులాల స్థాయిని మార్చే అధికారం కేంద్రానిదే
ఒక కులం స్థాయిని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశం పెట్టారని ఆ నేత గుర్తు చేశారు. మూడేళ్లయినా దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో తమ సంఘం నాయకులు కనపడిన చోటల్లా తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఒక కులానికి చెందిన ప్రజలను.. మరో కేటగిరీలోని కులాల జాబితాలోకి చేర్చే అధికారం కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. ఇటీవల కాపు నేతలు తనను కలసి తమకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని.. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కావాలని కోరారన్నారు.
బీసీలకు ఎలాంటి నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ సీఎం చెప్పుకొచ్చారు. కాకినాడ ఎన్నికల తర్వాత అమరావతిలో కులాల వారీగా సమావేశం నిర్వహించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలిస్తామని సీఎం హామీలు గుప్పించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పెట్టుబడి నిధి కింద ఇప్పటికి రూ.6 వేలు ఇచ్చామని, రేపో మాపో మిగతా రూ.4 వేలిస్తామని చెప్పారు.