వరవరరావు ఇంటి వద్ద గిరిజనుల ఆందోళన | chintapally tribals protest at varavararao House in hyderabad | Sakshi
Sakshi News home page

వరవరరావు ఇంటి వద్ద గిరిజనుల ఆందోళన

Nov 19 2014 10:11 AM | Updated on Oct 9 2018 2:47 PM

విరసం నేత వరవరరావు నివాసం ముందు విశాఖ జిల్లా చింతపల్లి గిరిజనులు బుధవారం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్  : విరసం నేత వరవరరావు నివాసం ముందు విశాఖ జిల్లా చింతపల్లి గిరిజనులు బుధవారం ఆందోళనకు దిగారు. తాము మావోయిస్టుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. మావోయిస్టుల నుంచి తమను రక్షించాలని గిరిజనులు ఈ సందర్భంగా వరవరరావును కోరారు. కాగా విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో గతనెల 21వ తేదీన మావోయిస్టుల మీద గిరిజనులు తిరుగుబాటు చేసి.. ముగ్గురు నక్సలైట్లను హతమార్చిన విషయం తెలిసిందే.

మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్ పేరుతో ఒక గిరిజనుడిని హత్యచేసి, మరొకరిని శిక్షించేం దుకు ప్రయత్నించటంతో వారిపై ఆగ్రహించిన గిరిజనులు మూకుమ్మడిగా తిరుగుబాటు చేశారు. ఈ ఘటనలో మావోయిస్టు దళ డిప్యూటీ కమాండెంట్‌, మరో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనతో విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీ ఉద్రిక్తంగా మారింది. దాంతో మావోయిస్టుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారి నుంచి కాపాడాలని గిరిజనులు...వరవరరావుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement