వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం కేశవాపురం పరిధిలోని రెడ్డివారిపల్లెలో స్వైన్ఫ్లూతో ఓ చిన్నారి మృతి చెందింది.
చిన్నమండెం (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం కేశవాపురం పరిధిలోని రెడ్డివారిపల్లెలో స్వైన్ఫ్లూతో ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సింధు(4) జనవరి 14వ తేదీన స్వైన్ఫ్లూతో అస్వస్థతకు గురైంది. ఎంతకీ నయం కాకపోవటంతో చెన్నై నగరం ఎగ్మోర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందింది.