రాయదుర్గం పట్టణంలో చైన్ స్నాచర్లు మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
అనంతపురం : రాయదుర్గం పట్టణంలో చైన్ స్నాచర్లు మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. స్థానిక చౌడమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న నాగమ్మ గురువారం మధ్యాహ్నం నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గొలుసును తెంపుకుని వెళ్లిపోయారు. బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.