వెయ్యి కోట్ల వరద సాయం ఇచ్చేందుకు కేంద్రం అనుమతి | Center assures to give Rs. 100 crore as flood relief | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల వరద సాయం ఇచ్చేందుకు కేంద్రం అనుమతి

Nov 9 2013 12:53 PM | Updated on Jul 29 2019 5:31 PM

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. రాష్ట్రానికి వరద సాయం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రూ. 1000 కోట్ల విడుదలకు కేంద్రం ఈ సందర్భంగా అనుమతించింది. అదే సమయంలో, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్కు మంత్రి శైలజానాథ్ వినతిపత్రం అందించారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement