పెళ్ళి భోజనాల కోసం ఘర్షణ | Bride And Groom Families Fight in Wedding Dinner West Godavari | Sakshi
Sakshi News home page

పెళ్ళి భోజనాల కోసం ఘర్షణ

Jun 20 2020 6:41 AM | Updated on Jun 20 2020 9:17 AM

Bride And Groom Families Fight in Wedding Dinner West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, ఆకివీడు: కోళ్ల పర్రు గ్రామంలో పెళ్లి భోజనాల కోసం శుక్రవారం రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. 18న యానాల భోజనాలు సక్రమంగా జరగలేదని, ఎవరూ రాలేదని బంధువులైన గండికోట బుల్లయ్య, దుర్గ తదితరులు ఆరోపిస్తూ, పెళ్లి కొడుకు తల్లిదండ్రులను విమర్శించారు. అంతేకాకుండా వారిపై దౌర్జన్యం చేసి గాయపరిచారని ఎస్సై వీరభద్రరావు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement