భద్రాచలం మాదే.. భాగ్యనగరం మాదే.. | Both Hyderabad, Bhadarchalam are our's : TSJAC | Sakshi
Sakshi News home page

భద్రాచలం మాదే.. భాగ్యనగరం మాదే..

Aug 18 2013 3:43 AM | Updated on Sep 4 2018 5:07 PM

భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, లేదంటే అంతర్యుద్ధం చేస్తామని టీఎస్‌జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు.

ఖమ్మం, న్యూస్‌లైన్: భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, లేదంటే అంతర్యుద్ధం చేస్తామని టీఎస్‌జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. శనివారం టీఎస్‌జేఏసీ ఆధ్వర్యంలో ‘భద్రాచ లం మాదే.. భాగ్యనగరం మాదే..’ అనే నినాదంతో పెవిలియన్ గ్రౌండ్‌నుంచి జడ్పీ సెంటర్‌కు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు.  భద్రాచలం జిల్లాలో 500 ఏళ్లుగా అంతర్భాగంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సం స్కృతీసంప్రదాయాలకు నిలయంగా ఉన్న భద్రాచలంను తెలంగాణ ప్రాంతనుంచి విడదీయాలని చూడటం అవి వేకం అన్నారు. ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై ఆక్కడి ఉద్యమకారులు  భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇది సరికాదన్నారు. ఇక ముందు తెలంగాణ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి మధిర నియోజకవర్గం కన్వీనర్ బొమ్మెర రామ్మూర్తి, టీఎస్ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరి యాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు చేకూరి నరేంద్రకుమార్, సురేష్, రజనీకాంత్, వాసన్, వీరబాబు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement