బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న నాలుగు బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు: బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న నాలుగు బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డీలర్ రంగస్వామి రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్ డీలర్నుంచి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు.