చంద్రబాబును కలిసిన బాబా రాందేవ్‌ | Baba Ramdev meets Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన బాబా రాందేవ్‌

Oct 10 2013 5:07 PM | Updated on Mar 28 2019 5:23 PM

చంద్రబాబును కలిసిన బాబా రాందేవ్‌ - Sakshi

చంద్రబాబును కలిసిన బాబా రాందేవ్‌

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ భవన్‌లో చేస్తున్న నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.

న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ భవన్‌లో చేస్తున్న నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. చంద్రబాబును యోగాగురువు బాబా రాందేవ్‌ కలిశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు  చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు బుధవారం అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత మద్దతు తెలిపారు.

అనుమతి లేకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్‌లోనే చంద్రబాబు నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, చంద్రబాబు దీక్ష మాత్రం అక్కడ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ సహకారంతోనే ఆయన దీక్ష కొనసాగిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా, విభజన నేపథ్యంలో రాష్ట్రంలో సమస్యను సృష్టించింది కేంద్రమే కాబట్టి ప్రభుత్వమే పరిష్కారం చూపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement