ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ

Andhra pradesh Final Voters List Out - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

    జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:

శ్రీకాకుళం          20,64,330
విజయనగరం       17,33,667
విశాఖపట్నం   32,80,028
తూర్పు గోదావరి 40,13,770
పశ్చిమ గోదావరి  30,57,922
కృష్ణా   33,03,592
గుంటూరు 37,46,072
ప్రకాశం  24,95,383
నెల్లూరు 22,06,652
వైఎస్సార్ కడప 20,56,660
కర్నూలు 28,90,884
చిత్తూరు   30,25,222
అనంతపురం 30,58,909
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top