శాంతిభద్రతలపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు | andhra pradesh assembly session begin | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు

Aug 18 2014 9:12 AM | Updated on Jul 29 2019 2:44 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై చర్చించాలని

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై చర్చించాలని వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

 

ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని స్పీకర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలపై జీరో అవర్ లో ప్రస్తావించాలని స్పీకర్ సూచించారు. అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టువీడక రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై చర్చ జరగాల్సిందేనని పట్టు వీడలేదు. కాగా అంతకు ముందు బీఏసీ సమావేశం జరిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement