సాక్షి, రంగారెడ్డి జిల్లా : సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి రోజువారీ జీవితాన్ని అష్టకష్టాలతో నెట్టుకొస్తున్న సగటు జీవిపై చమురు సంస్థలు కొరడా ఝుళిపించాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించాయి. ఎన్నడూలేని విధంగా ధరలను పెంచడంతో ఆమ్ఆద్మీ గుండె గుభేల్మంది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రాయితీ సిలిండర్పై రూ.25 పెంచగా, రాయితీ అవధి దాటిన (9సిలిండర్లు) వాటిపై ఏకంగా రూ.217 పెంచేసింది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్పై రూ.385కు హెచ్చించింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
జిల్లాలో 52 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ కనెక్షన్లు 13.55లక్షలున్నాయి. వీటిలో నెలవారీగా 9లక్షల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చమురు సంస్థలపై నియంత్రణ ఎత్తివేయడంతో అడ్డూ,అదుపు లేకుండా ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వచ్చే మార్పులను సాకుగా చూపుతూ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్న చమురు సంస్థలు.. తాజాగా వంటగ్యాస్పై ధరలను భారీగా పెంచాయి. రాయితీపై ఇచ్చే సిలిండర్ ధర రూ.25 పెంచగా, రాయితీ లేని సిలిండర్పై రూ.217 పెంచాయి.
ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే తొమ్మిది రాయితీ సిలిండర్లు ఒక్కో దానిపై రూ.419 కాస్త రూ.444కు చేరింది. అదేవిధంగా 9 సిలిండర్ల తర్వాత ఇచ్చే రాయితీ లేని సిలిండర్ ధర కాస్త రూ.1109 నుంచి రూ.1326కు చేరింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ప్రస్తుత ధర రూ.1881 ఉండగా.. తాజా పెంపుతో ఈ ధర రూ.2266 కు పెరిగింది. పెంచిన ధరలు అతి త్వరలో అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై ఏటా రూ.97.47కోట్ల భారం పడనుంది.
మళ్లీ వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు
Published Wed, Jan 1 2014 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement