లడ్డూ@: 99,999 | 900 grams Brownies 99.999 | Sakshi
Sakshi News home page

లడ్డూ@: 99,999

Sep 26 2015 12:26 AM | Updated on Sep 3 2017 9:58 AM

కురుపాంలోని కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుని లడ్డూ వేలం పాటలో లక్ష రూపాయలు పలికింది. 9కిలోల 900 గ్రాముల

కురుపాం: కురుపాంలోని కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుని లడ్డూ వేలం పాటలో లక్ష రూపాయలు పలికింది. 9కిలోల 900 గ్రాముల లడ్డూకు శుక్రవారం సాయంత్రం కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు అంధవరపు కోటేశ్వరరావు అధ్యక్షతన వేలం పాట నిర్వహించారు. పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంలో మండల కేంద్రానికి చెందిన వ్యాపారులు పట్నాన గోవింధరావు, బోటు రమేష్, గెంబలి పెదతాతయ్యలు, పొట్నూరు శ్రీనువాసరావు(గంగోత్రి), గుడ్ల శ్రీనువాసరావులు సంయుక్తంగా పోటీ పడి *99,999 కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ మేరకు కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, సభ్యులు కొత్తకోట రవీంద్రకుమార్, తదితర సభ్యులు దైవప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్న భక్తులకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement