ఆటో- కారు ఢీ: ముగ్గురు మృతి | 3 people killed in car - auto accident at nallajerla | Sakshi
Sakshi News home page

ఆటో- కారు ఢీ: ముగ్గురు మృతి

Sep 11 2013 9:59 AM | Updated on Sep 1 2017 10:37 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల వద్ద ఈ రోజు ఉదయం ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల వద్ద ఈ రోజు ఉదయం ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

దుర్ఘటన సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement