రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | 3 injured in road accident at guntur district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Mar 4 2016 10:50 AM | Updated on Aug 30 2018 3:58 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పిన రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మాచర్ల: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మందాటిబోడు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. క్వారీలో పని చేయడానికి బైక్ పై వెళ్తున్న ముగ్గురు కూలీలు మందాటిబోడు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement