పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 291 మంది హాజరు | 291 people attend by Paliset Counseling | Sakshi
Sakshi News home page

పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 291 మంది హాజరు

Jun 11 2014 2:27 AM | Updated on Sep 17 2018 7:38 PM

పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 291 మంది హాజరు - Sakshi

పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 291 మంది హాజరు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది.

ఎచ్చెర్ల క్యాంపస్ :శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజైన మంగళవారం 40 వేలు లోపు ర్యాంకర్ల పత్రాలను సిబ్బంది పరిశీలించగా 311 మంది హాజరయ్యారు. ఇప్పటివరకూ 817 మంది ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తియింది. కాగా బుధవారం 60 వేలు లోపు ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన 50 వేల లోపు ర్యాంకర్లు ఈ నెల 12,13 తేదీల్లో కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.16వ తేదీవ రకు కౌన్సెలింగ్ జరగనుంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనను అడ్మిషన్లు ఇన్‌చార్జి మేనేజర్ కె.శివకుమార్, అధ్యాపకులు మల్లిబాబు పర్యవేక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement