ఏపీలో మరో 10 కరోనా కేసులు

10 New Corona Cases Registered In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 314కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11 కేసులు నమోదయినట్లు వెల్లడించింది. గుంటూరు 9, కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి.

రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు
అనంతపురం-6
చిత్తూరు-17
తూర్పుగోదావరి-11
గుంటూరు-41
కడప-28
కృష్ణా-29
కర్నూలు-74
నెల్లూరు-43
ప్రకాశం-24
విశాఖపట్నం-20
పశ్చిమగోదావరి-21
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top