Jagitial District News
-
జీవాల దాహం తీర్చుదాం
కోల్సిటీ(రామగుండం): వేసవిలో నీటి కోసం జనాలు అల్లాడిపోతారు. వివిధ అవసరాల కోసం ఇంట్లోంచి బయటకు వెళ్తే.. దాహం తీర్చుకునేందుకు నీళ్లు ఎక్కడ లభిస్తాయా? అని ఆశ పడతారు. ఎప్పటికప్పుడు దాహం తీర్చుకునేందుకు తహతహలాడతారు. మరి మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుంది? అవి దాహం ఎలా తీర్చుకుంటాయి? మనం ఏమైనా ప్రయత్నం చేస్తే వాటి దాహం తీరుతుందా? ఇలాంటి సందేహాలకు సమాధానమిస్తున్నారు కొందరు పక్షులు, జీవాల ప్రేమికులు. పక్షుల శరీర ఉష్ణోగ్రతలు అత్యధికం.. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్గా ఉంటాయని పక్షిప్రేమికులు చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు దాటితే ఎక్కువ సేపు అవి జీవించలేవని అంటున్నారు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకుంటాయి. జనం కోసమైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? వీటి కోసం ఎవరు ఆలోచిస్తారు? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్కు చేరువలో నమోదవుతున్నాయి. అందుకే మూగజీవాలకు ఊపిరి పోయడానికి మనమే ఒకడుగు ముందుకేద్దాం. ఇంటి ఆవరణ, ఇంటి బయట కాసిన్ని నీళ్లు పెట్టి వాటి దాహం తీర్చుదాం. అందరూ స్పందించాలి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధికుక్కలు, పక్షుల దాహం తీర్చేందుకు ప్రతీ ఒక్కరు స్పందించాలి. ప్రభుత్వంతోపాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ఎదుట, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబాపై తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అయితే బల్దియా ఆధ్వర్యంలో గతేడాది వేసవిలో సుమారు 90 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు. వీటిని ప్రస్తుతం పట్టించుకున్న నాథుడు లేడు. కొందరు స్థానికుల ఇళ్ల ఎదుట, దుకాణాల మందున్న తొట్టెల్లో నీళ్లు పోసి దాహం తీర్చుతున్నారు. ఇలాగే ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తే మంచిదని మూగజీవాల ప్రేమికులు కోరుతున్నారు. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తల్లడిల్లుతున్న పక్షులు, జంతువులు నివాసాలు, ఖాళీ ప్రదేశాల్లో నీటితొట్టెలు -
మామిడి మార్కెట్తో ఉపాధి
● పొరుగు రాష్ట్రాల నుంచి కూలీల రాక ● వసతులు కల్పించడంలో వ్యాపారుల నిర్లక్ష్యం జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలలోని చల్గల్ మామిడి మార్కెట్ కూలీలకు ఉపాధి మార్గంగా మారింది. ఈ మార్కెట్లో మామిడి సీజన్లో పనిచేసేందుకు స్థానిక కూలీలేకాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వస్తుంటారు. వేల సంఖ్యలో కూలీలు వస్తున్నప్పటికీ వారితో పనిచేయించుకునే వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వారికి కనీస వసతులు కరువయ్యాయి. వేల సంఖ్యలో కూలీలు మామిడి సీజన్ ఏప్రిల్, మే నెలల్లో కొనసాగుతుంది. ఈ సీజన్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో రోడ్ల వెంబడి వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వాటిని ట్రాక్టర్ల నుంచి దింపేందుకు.. కాయలను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసేందుకు.. లారీల్లో లోడ్ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. తోటల్లో కాయలు తెంపేందుకు కూడా కూలీల అవసరం ఎక్కువ. ఈ పనులు చేసేందుకు స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూలీలను రప్పిస్తుంటారు. ఒక్కో వ్యాపారి దుకాణంలో కనీసం 50 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారు. నెలరోజుల్లో రూ.25వేల నుంచి రూ.30వేల ఆదాయం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను వ్యాపారులు వివిధ పనులకు ఉపయోగించుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూలీలను మామిడి కాయలను తెంపేందుకు, లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఢిల్లీ, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలను మామిడికాయల గ్రేడింగ్.. ప్యాకింగ్కు ఉపయోగిస్తారు. కూలీలు గ్రూపుగా ఏర్పడి పనులు చేస్తుండటంతో టన్ను ఆన్లోడ్ చేస్తే రూ.250 వరకు చెల్లిస్తారు. గ్రేడింగ్.. ప్యాకింగ్ చేసే వారికి ట్రేకు రూ.15, పెట్టెలను లారీల్లో లోడ్ చేస్తే రూ.3వేల నుంచి రూ.5 వేలు, కాయలు తెంపడానికి వెళ్తే రోజుకు రూ.500 చెల్లిస్తారు. ఆ వ్యాపారి దుకాణానికి వచ్చిన కాయలను బట్టి ఒక్కో కూలీ కనీసం 30నుంచి40 రోజుల్లో రూ.30వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో వేసవి సీజన్లో పనులు లేకపోవడంతో పనుల కోసం జగిత్యాల వస్తుంటారు. ఇలా జిల్లాకు కనీసం ఐదారు వేల మంది కూలీలు వస్తుంటారు. వసతులు అంతంతే.. మార్కెట్లో కూలీలతో పనులు చేయించేందుకు చూపుతున్న శ్రద్ధ.. వారికి కనీస వసతులు కల్పించడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మండుతున్న ఎండలో మార్కెట్ పక్కనున్న వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ కవర్లతో గుడారాలు వేసుకుని ఉండటం.. షెడ్ల కింద పడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతం. చాలామంది రోడ్డపక్కనున్న చెట్ల కింద తీరుతున్నారు. ఈ క్రమంలో వారిని పనులకు తీసుకొస్తున్న వ్యాపారులు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అంటున్నారు. ఏటా వస్తుంటాం ఏటా మామిడి సీజన్లో జగిత్యాలకు వస్తుంటాం. నెల రోజులపాటు ఇక్కడ పనిచేస్తాం. రూ.30వేల వరకు సంపాదించుకుంటాం. మహారాష్ట్రలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం ఇక్కడకు వస్తాం. – సేవాలాల్, మహారాష్ట్ర ప్యాకింగ్ చేస్తాం మామిడికాయలను గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేసేందుకు ఇక్కడకు వస్తాం. మా రాష్ట్రం నుండి కనీసం 500 మంది వరకు వచ్చాం. మామిడి మార్కెట్లో ఏదో పని దొరుకుతుందనే ఆశతో వచ్చి, ఎంతో కొంత సంపాదించుకుని వెళ్లతాం. – గుడ్డె, ఉత్తరప్రదేశ్ -
అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలకు తెలంగాణలో ఉత్తమ మహిళా డిగ్రీ కళాశాలగా అవార్డు లభించింది. ఢిల్లీలోని ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన ప్రపంచ విద్యా సమ్మిట్–2025లో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి భూషణ్ చౌదరి, పీజీ కమిషన్ కౌన్సిలర్ నీలేశ్ కుమార్, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్వీకర్ మోహన్సింగ్ చేతుల మీదుగా అవార్డును కళాశాల కరస్పాండెంట్ వూట్కూరి రవీందర్రెడ్డి స్వీకరించారు. విద్య, నైపుణ్యం, శాసీ్త్రయ దృష్టి, నైతిక విలువలు, ప్రాంగణ నియామకాలు, ఉత్తీర్ణతశాతం, విద్యార్థి అధ్యాపకుల నిష్పత్తి, కళాశాల సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని అవార్డు ప్రకటించిందని తెలిపారు. -
సంక్షేమాధికారులకు పోస్టింగ్
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. పెద్దపల్లికి ఐదుగురిని కేటాయించారు. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ(గర్ల్స్) పెద్దపల్లి, ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మంథని, ప్రశాంత్, ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్ మంథని, డి.తిరుపతి, ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్ మంథని, సాధుల రమేశ్, ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ మంథనికి కేటాయించారు. -
ప్రాణం తీసిన రీల్స్ సరదా
● మానేరువాగులో పడి యువకుడి మృతి కరీంనగర్క్రైం: సోషల్ మీడియా రీల్స్ సరదా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. రీల్స్ చేయడానికి కరీంనగర్ శివారులోని మానేరు వాగులోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నగరంలోని అశోక్నగర్కు చెందిన మహ్మద్ లతీఫ్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు మహ్మద్ అర్బాస్ (20) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి మానేరు బ్రిడ్జి సమీపంలోని రీల్స్ చేయడానికి వెళ్లాడు. అర్బాస్ మానేరు వాగులోకి దిగి రీల్స్ చేస్తున్న క్రమంలో లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. స్నేహితులు స్థానికులను పిలిచి వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అర్బాస్ అప్పటికే మృతిచెందాడు. అర్బాస్ తండ్రి లతీఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. 147 కిలోల గంజాయి స్వాధీనంవరంగల్ క్రైం: చింతగట్టు ప్లైఓవర్ బ్రిడ్జి దగ్గర రూ.73.65లక్షల విలువ గల 147 కిలోల ఎండు గంజాయిని పట్టకున్నట్లు నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుకుమామిడి నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీ చేయగా.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల సదయ్య, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సామల శేషు కలిసి ఇన్నోవా, షిప్ట్ కార్లలో 69ప్యాకెట్ల గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. సదయ్య, సతీశ్పై 2014, 2016లో కేయూసీ పోలీస్స్టేషన్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. -
జాతీయ పోటీలకు లౌక్యశ్రీ ఎంపిక
జమ్మికుంట: మండలంలోని కోరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నారవేన లౌక్యశ్రీ జాతీయస్థాయి హ్యాండ్బాల్ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే 39వ జాతీయస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థిని హెచ్ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్రాజు, శ్రీనివాస్రెడ్డి, పద్మ, సంపత్, విజేందర్రెడ్డి, గీతాలు హర్షం వ్యక్తం చేశారు. ఆయిల్పాం తోట దగ్ధంవీణవంక: మండలంలోని ఘన్ముక్కుల గ్రామంలో గాలికి విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగలడంతో అయిల్పాం తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన నందికొండ మాధవరెడ్డి మూడు ఎకరాల్లో అయిల్పాం సాగు చేశాడు. గురువారం విద్యుత్ వైర్లు గాలికి ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు చేనులో పడటంతో మంటలు చెలరేగి అయిల్పాం దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. అదేవిధంగా నందికొండ మల్లారెడ్డికి చెందిన నాలుగు ఎకరాల మగ వరి మంటలకు అంటుకొని కాలిపోయిందని అన్నాడు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. జూనియర్ సివిల్ జడ్జిగా కీర్తనకరీంనగర్క్రైం: నగరంలోని అరెపల్లికి చెందిన కట్ట కీర్తన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. 2021లో హైదరాబాద్లోని ప్రైవేట్ లా కళాశాల నుంచి ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. హైకోర్టులో, కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు సన్నద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. తల్లి పద్మ గృహిణి కాగా, తండ్రి కోటి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అక్క శ్రీదేవి పీజీ పూర్తి చేయగా, తమ్ముడు సుదర్శన్ బీటెక్ చదువుతున్నాడు. -
టెంట్హౌజ్లో అగ్నిప్రమాదం
ధర్మపురి: టెంట్హౌజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి లక్షల విలువ చేసే సామగ్రి దగ్ధమైంది. బాధితుడు షబ్బీర్ కథనం ప్రకారం.. పట్టణంలోని నక్కలపేట రూట్లో ఉన్న టెంట్హౌజ్లో గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు గోదాంలో ఉన్న టెంట్ సామగ్రికి నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో చుట్టుపక్కల వారు షబ్బీ ర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఫైరింజన్కు ఫోన్చేయగా.. సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు. మంటల్లో టెంట్ సామానుతోపాటు డెకరేషన్ సామగ్రి, థర్మకోల్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15లక్షల వరకు సామగ్రి దగ్ధమైందని బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
తడగొండ జీపీలో చొరబడ్డ ఆగంతకులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామపంచాయతీ భవనంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతకులు హంగామా చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. వాటర్ప్లాంట్ గది తాళం పగులకొట్టి, కాయిన్ బాక్స్లోని నాణేలను బయట పారబోశారు. అనంతరం జీపీ గది మెయిన్ డోర్ తలుపులు పగులకొట్టి బీరువాలోని ఉన్న కాగితాలు, రిజిష్టర్లను చిందర వందరగా పడేశారు. గురువారం ఉదయం ఎంపీవో శ్రీధర్, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం ఆధారాలను సేకరించింది. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపారు. -
బీజేపీకి గుణపాఠం తప్పదు
కరీంనగర్: కార్మికులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నారని, బీజేపీ వారి హక్కులను హరిస్తే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వే హమాలీ సంఘం కార్మికులు ఏర్పాటుచేసిన పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వేగేట్ నుంచి బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య జెండా ఆవిష్కరణ చేశారు. సిమెంట్ గోదాం, ఫర్టిలైజర్ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం చాడవెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11ఏళ్లు గడుస్తున్నప్పటికీ కార్మిక హక్కులను హరించడానికి కుటీల ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోని కార్మికవర్గం అంతా మేడే స్ఫూర్తిగా హక్కుల కోసం పోరాటం చేయాలని, ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ రైల్వే హమాలీ సంఘం అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రభాకర్, రవీందర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్దండి దామోదర్, ఉల్లిగడ్డల హమాలీ సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కొమురయ్య, సిమెంట్ గోదాం ఫర్టిలైజర్ హమాలీ సంఘం అధ్యక్షుడు జంగా తిరుపతి, నన్నవేన కొమురయ్య, కదారి బీరయ్య, మామిడిపెల్లి శంకర్, ఆకుల లచ్చన్న, ప్రకాశం గంజ్ ట్రాలీ ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ,కాల్వ రాయమల్లు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
● ప్రభుత్వ విప్ అడ్లూరి, మాజీ మంత్రి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: రిజర్వేషన్ల అమలుతోనే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జనాభా లెక్కలతోపాటు కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ మేరకు ప్రధాని మోదీ విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నారని తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని జీవన్రెడ్డి అన్నారు. కార్మిక దినోత్సవానిన పురస్కరించుకుని బల్దియా ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయడంతోపాటు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానన్నారు. బల్దియా కమిషనర్ స్పందన, మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
తిరిగొచ్చిన నీలగిరి పెద్దమ్మతల్లి
● మెట్పల్లి నుంచి శోభాయాత్రగా ముత్యంపేటకు ● భారీగా తరలివచ్చిన భక్తులు మల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని నీలగిరి పెద్దమ్మతల్లి అద్దకాన్ని పూర్తి చేసుకుని మెట్పల్లి నుంచి శోభాయాత్రగా డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య ముత్యంపేటకు చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్లో తాత్కాలికంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీడీసీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలను ఐదేళ్లకోమారు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మల్లాపూర్, మెట్పల్లి ఎస్సైలు రాజు, కిరణ్ బందోబస్తు చేపట్టారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కళ్ల నరేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ కళాశాల తరలించొద్దు
జగిత్యాల: కోరుట్లలోని మహిళా అగ్రికల్చర్ కళాశాల తరలింపును ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి అన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా అగ్రికల్చర్ కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేసిందని, వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వద్ద శాశ్వత భవన నిర్మాణానికి 70 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. కోరుట్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా బెజ్జంకికి తరలించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఏఐఎస్ఎస్ కన్వీనర్ మాణిక్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి అదనంగా యూనివర్సిటీ, విద్యాసంస్థలు, పరిశ్రమలు తీసుకురావాల్సిందిపోయి ఉన్న వాటిని తరలించడం సిగ్గుచేటన్నారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ దూరదృష్టితో ఈ జిల్లాలో అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేస్తే దానిని తరలించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వినోద్కుమార్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాకేశ్, మైనార్టీ విద్యార్థి అధ్యక్షుడు సోహెల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, వెంకటేశ్, రాజు, నరేశ్ పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్లపై పురోగతిపై చర్చించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి అధికారులతో సమీక్షించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని సూచించారు. నేరం జరిగిన స్థలంలో క్లూస్ ఎలా సేకరించాలనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. మూడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు, మరో కేసులో పదేళ్ల జైలుశిక్ష విధించడంలో కృషి చేసిన పీపీ మల్లికార్జున్, అడిషనల్ పీపీ మల్లేశంను ఎస్పీ అభినందించారు. జిల్లాకేంద్రంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనాలను తక్కువ సమయంలో చేధించి దొంగలను పట్టుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్ను ఎస్పీ అభినందించారు. గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలీసు అధికారులకు ప్రశంసపత్రాలు అందించారు. మల్యాల ఎస్సై నరేశ్కు అభినందన మల్యాల: ఎస్సై నరేశ్కుమార్ను ఎస్పీ అభినందించారు. పోలీస్స్టేషన్ విధులు, సత్వర కేసుల నమోదు, నేరాల నియంత్రణ, బందోబస్తు నిర్వహణకు గాను ఉత్తమస్టేషన్ హౌస్ ఆఫీసర్గా ప్రశంసపత్రం అందించారు. -
రైతులకు ఇబ్బంది రానీయొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్ మల్లాపూర్/మెట్పల్లి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం రాఘవపేట, మెట్పల్లి మండలం కొండ్రికర్ల, వేంపేట గ్రామాల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. నిర్వాహకులు కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని, తేమశాతం పరిశీలన, రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. సన్నం రకం ధాన్యానికి రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. డీఆర్డీవో రఘువరణ్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, ప్యాక్స్ సీఈవో రమేశ్, రైతులు పాల్గొన్నారు. పల్లెపల్లెకూ ఆర్టీసీ సేవలు పెగడపల్లి: రోడ్డు సౌకర్యమున్న ప్రతి గ్రామానికి టీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం నుంచి పెగడపల్లి మండలం నంచర్ల, దీకొండ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలను రాములపల్లి గ్రామంలో గురువారం ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. రాములపల్లి నుంచి దీకొండ వరకు ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. డిపో మేనేజర్ కల్పన, ఎంఎఫ్ కవిత, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలి జగిత్యాల: సీఎంఆర్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో రైస్మిల్లర్లతో సమీక్షించారు. రోజువారి లక్ష్యం ప్రకారం మిల్లుల నుంచి సీఎంఆర్ డెలివరీ చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి జగిత్యాల: వేసవి శిబిరాలను వినియోగించుకోవాలని డీఈవో రాము అన్నారు. పురాణిపేట ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాలను గురువారం ప్రారంభించారు. 15ఏళ్లలోపు విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వేదిక్, గణితం, సంగీతం, ఆటలు, ఇంగ్లిష్, యోగా వంటి అంశాల్లో మెళకువలు నేర్పిస్తారని, స్నాక్స్, తాగునీరు ఉచితంగా అందిస్తారని తెలిపారు. కో–ఆర్డినేటర్లు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కార్మికుల ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టాలు మెట్పల్లి: కార్మికుల ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని మెట్పల్లి సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అంతకు ముందు పలువురు న్యాయవాదులు ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ తదితర వాటిపై వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు. -
కొనుగోళ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
జగిత్యాలరూరల్: కొనుగోళ్ల వివరాలు వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, రూరల్ మండలం హైదర్పల్లిలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, తూకం, హమాలీ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతుల నుంచి ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ తీసుకుని వివరాలు నమోదు చేయాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు రాంమోహన్, శ్రీనివాస్, డెప్యూటీ తహసీల్దార్ తిరుపతి, కార్తీక్రెడ్డి, డీటీలు వరప్రసాద్, రాజేంద్రప్రసాద్, ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం తూకం త్వరగా చేపట్టాలి సారంగాపూర్: ధాన్యం తూకం త్వరగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు రేచపల్లి, నాయికపుగూడెం, మ్యాడారంతండా, బీర్పూర్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం గుర్తించి తూకం వేయాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు పూర్తిచేయాలని ఆదేశించారు. -
బల్దియాల్లో పన్ను బాదుడు
● ఆస్తి పన్ను భారీ మొత్తంలో పెంచిన ప్రభుత్వం ● గత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు ● ఆందోళనలో దిగువ, మధ్యతరగతి ప్రజలు మెట్పల్లి: మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పెంపును అమలు చేస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. పట్టణీకరణలో భాగంగా మున్సిపాలిటీలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఆదాయవనరులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వసతులు కల్పన, సిబ్బందికి వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం స్తి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కసారిగా రెండు, మూడింతలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. జియో ట్యాగింగ్ కొలతల ఆధారంగా.. ● పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును సరిగ్గా లెక్కించి వసూలు చేయడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రతి మున్సిపాలిటీలో జియో ట్యాగింగ్ సర్వే నిర్వహించింది. ● ఆ సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని అక్షాంశం, రేఖాంశం ఆధారంగా గుర్తించడంతోపాటు ఇంటి కొలతలు, ఇతర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేశారు. ● ప్రస్తుతం ఆ కొలతలను పరిగణనలోకి తీసుకునే ప్రతి ఇంటికి ఆస్తి పన్నును పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ● ఆన్లైన్ విధానం అందుబాటులోకి రాక ముందు సిబ్బంది కొలతలు వేయకుండా నామమాత్రంగా పన్ను వేసి వసూలు చేసేవారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడేది. ● జియో ట్యాగింగ్తో పక్కా కొలతలతో లెక్కింపు జరిగి దానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోంది. బెంబేలెత్తిపోతున్న ప్రజలు.. ● చాలాకాలం పాటు ఆస్తి పన్నును పెంచకుండా ఉన్న ప్రభుత్వం.. ఒక్కసారిగా జియో ట్యాగింగ్ను పరిగణనలోకి తీసుకుని పెద్ద మొత్తంలో భారం మోపడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ● కొందరికి పన్ను రెట్టింపు అయితే.. మరికొందరికి రెండింతలు, మూడింతలే కాకుండా అంతకంటే ఎక్కువ పెరిగింది. ● మెట్పల్లి మున్సిపాలిటీలోని కళానగర్లో ఓ ఇంటికి గతంలో రూ.2వేలు పన్ను ఉంటే.. ఇప్పుడు ఆది రూ.7900కు పెరిగింది. ఇదే కాలనీలో మరో ఇంటికి గతంలో రూ.1050 ఉంటే, ప్రస్తుతం రూ.4500కి పెరిగింది. ● ఇలా ప్రతి కుటుంబంపై అధిక భారం పడడంతో దిగువ, మధ్యతరగతి ప్రజలు అందోళన చెందుతున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంటి అనుమతులు, ప్రకటనలు, నల్లా బిల్లు, ఆస్తి పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రధానంగా ఆస్తి పన్నుతోనే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఐదు మున్సిపాలిటీల్లో 62,585 ఇళ్లు ఉన్నాయి. ఏటా ఆస్తి పన్ను ద్వారా సుమారు రూ.17కోట్ల ఆదాయం సమకూరుతోంది. వీటిలో చాలాకాలంగా ఆస్తి పన్నును సవరించలేదు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం లేకపోవడంతో మున్సిపాలిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో పన్నును పెంచింది. కొలతల ప్రకారమే పన్ను విధింపు ప్రతి ఇంటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి గతంలోనే కొలతలు వేశారు. ప్రస్తుతం వాటిని పరిగణనలోకి తీసుకుని ఆస్తి పన్నును సవరించాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రభుత్వం సవరించింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ప్రజలు మా దృష్టికి తీసుకరావాలి. వాటిని పరిశీలించి తగు చర్యలు చేపడుతాం. – అక్షయ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మెట్పల్లి -
అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో..?
జగిత్యాల: జిల్లాకు మంజూరైన జవహార్ నవోదయ పాఠశాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలడం లేదు. నవోదయ మంజూరైన తొలి రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్లలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా 37 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. అయితే ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి రావడంతో కొందరు దానిని జగిత్యాల పార్లమెంట్ పరిధిలోకి తీసుకురావాలని స్థానిక ఎంపీ అర్వింద్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నేరెళ్లలో ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్కు వినతిపత్రం కూడా అందించారు. కోరుట్లలో ఏర్పాటుకు సిద్ధం నేరెళ్లలో నవోదయ పాఠశాల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోవడంతో కోరుట్లలో ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కోరుట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలున్నట్లు అధికారులు గుర్తించారు. పైగా కోరుట్ల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపారు. పట్టణ శివారులోని సంగెం రోడ్డులోగల జంబిగద్దె వద్ద ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వాస్తవానికి ఈ విద్యాసంవత్సరం నుంచే నవోదయ తరగతులు ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాల్సి వస్తే సుమారు 20 నుంచి 30 గదులు ఉన్న భవనం తప్పనిసరి. ఇందుకోసం కోరుట్లలోని వేములవాడ రోడ్లోగల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించినా.. అది అనువుగా లేదని సమాచారం. దానికి మరమ్మతు చేయిస్తేనే సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ప్రారంభంకాని నవోదయ పాఠశాలకు ప్రస్తుతం చొప్పదండిలోని జవహార్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నవోదయతో ప్రయోజనం నవోదయలో విద్యార్థికి సీటు రావాలంటే 5వ తరగతి నుంచే కోచింగ్ తీసుకుంటుంటారు. ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు అర్హత పరీక్ష ఆధారంగా 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఇందులో 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ విద్య అందిస్తారు. ఒకవేళ ఈ విద్యాలయం ఏర్పాటైతే 600 మందికిపైగా ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ విద్యార్థులకు 25 శాతం కేటాయిస్తుంటారు. ఆదేశాలున్నాయి ఈ విద్యాసంవత్సరం నుంచే నవోదయ పాఠశాల తరగతులు ప్రారంభించాలని ఆదేశాలున్నాయి. ప్రస్తుతం కోరుట్ల ప్రాంతంలోని సంగెం వద్ద స్థలాన్ని చూశాం. తాత్కాలిక భవనం కోసం చూస్తున్నాం. ఇందుకు గురుకుల పాఠశాలను చూశాం. మరమ్మతు చేయిస్తే అందులో కొనసాగించే అవకాశం ఉంది. – మంగతాయారు, నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ ‘నవోదయ’కు స్థల సేకరణలో జాప్యం కోరుట్ల, సంగెంలో ఏర్పాటుకు నిర్ణయం? ఈ ఏడాది తరగతులు ప్రారంభమయ్యేనా..? -
కొనుగోళ్లు వేగవంతం చేయాలని ధర్నా
రాయికల్: మండలంలోని వీరాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉప్పుమడుగు–ఆలూరు క్రాస్ రోడ్ వద్ద బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసి 15 రోజులు గడుస్తున్నా.. హమాలీలు లేకపోవడంతో ఒక్క గింజ కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఖయ్యూం, ఎస్సై సుధీర్రావు సంఘటన స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు రామస్వామిగౌడ్, గంగాధర్, సోమ వెంకటేశ్, మహిపాల్, స్వామిరెడ్డి, షేక్ మాలిక్, ఇస్మాయిల్, నర్సారెడ్డి, అంజయ్య, రాములుగౌడ్ పాల్గొన్నారు. -
స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిమల్యాల: మండలంలోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన వేల్పుల మార్క్ (21) దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మార్క్ జగిత్యాల నుంచి వేములవాడ వైపు బైక్పై వెళ్తున్నాడు. మల్యాల క్రాస్రోడ్ వద్దకు రాగానే కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 లో జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్క్ తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కోన శ్రీనివాస్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలుజగిత్యాల: ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచామని డీఈవో రాము అన్నారు. పలు సంఘాల నాయకులు డీఈవోను సత్కరించారు. సమష్టి కృషితో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్, పీఆర్టీయూ ప్రధానకార్యదర్శి యాళ్ల అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజు, మహేశ్, తోట రాజేశ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కన్నవేని మల్లారెడ్డి, సురేందర్, రవి, రాంగోపాల్, రాకేశ్, గుర్రం శ్రీనివాస్, శంకరయ్య, కుమారస్వామి, తపస్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య, ప్రసాద్రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరేందర్రావు పాల్గొన్నారు. -
అందరికీ అందని అంజన్న అన్నప్రసాదం
మల్యాల: కొండగట్టులోని ఆంజనేయస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భక్తుల ద్వారా స్వామివారికి ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే నిత్యాన్నదాన సత్రంలో మాత్రం పరిమిత సంఖ్యలోనే అన్నప్రసాదం అందిస్తుండడంతో భక్తులు ఆకలితోనే అలమటిస్తున్నారు. ఈ ఆలయానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి తక్కువలో తక్కువ వెయ్యి నుంచి మూడు వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఆలయ అధికారులు నిత్యాన్నసత్రం ద్వారా ప్రతిరోజు కేవలం 100మందికి మాత్రమే భోజనం అందిస్తున్నారు. మంగళ, శనివారాల్లో 200మందికి అన్నప్రసాదం పెడుతున్నారు. దాతలు సహకరించినా.. కొండగట్టుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఆలయ అధికారులు దాతలు అందించే విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. దాతలు ఇచ్చే డబ్బులకు రశీదు అందిస్తున్నారు. అన్నప్రసాదం అందించేందుకు దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిషనర్ స్థాయి నుంచి అనుమతులు రావడంలో జాప్యంతో భక్తులకు భోజనం అందడం లేదు. భక్తుల ద్వారా ఆలయానికి ప్రతిరోజూ రూ.వేలల్లోనే ఆదాయం సమకూరుతోంది. ఆ నిధులతో భక్తులకు అన్నదానం చేసే విషయంలో మాత్రం అధికారులు చొరవ చూపడం లేదు. కనీసం ప్రతిరోజూ 200 మందికి.. మంగళ, శనివారాల్లో 400 మందికి తగ్గకుండా అన్నప్రసాదం అందిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమిత టికెట్లతో భక్తులకు తిప్పలు నిత్యం వంద, మంగళ, శనివారాల్లో 200మందికి.. ఆలయానికి ఏటేటా పెరుగుతున్న ఆదాయం -
‘పది’లో నాలుగో స్థానం
జగిత్యాల: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లాగా అవతరించిన తర్వాత మూడేళ్లు అగ్రస్థానంలో ఉన్న జిల్లా కొన్నాళ్లుగా నిరాశ పరుస్తోంది. గతేడాది 11వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ ఏడాది పుంజుకుని ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకుంది. 2016లో జిల్లా ఆవిర్భవించిన విషయం తెల్సిందే. 2016–17, 2017–18, 2018–19లో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. అప్పట్లో విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకోవడంతోపాటు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపించి బోధించడంతో వందశాతం ఫలితాలు సాధ్యమయ్యాయి. తర్వాత 2022లో 91.37 శాతంతో 21వ స్థానానికి పడిపోయింది. ఇక 2023లో 24వ స్థానానికి చేరింది. గతేడాది (2024) 11వ స్థానాన్ని సాధించింది. ఈ ఏడాది మరో ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. ప్రత్యేక కార్యచరణతో ముందుకు కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో రాము ప్రత్యేక కార్యాచరణతో పదిలో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. స్కూల్ కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు వర్చువల్గా మీటింగ్లు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విడదీసి వెనుకబడిన వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించారు. సబ్జెక్ట్ల వారిగా గ్రాండ్టెస్ట్లు పెట్టారు. జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షలంటే భయం లేకుండా అనేక సలహాలు ఇచ్చారు. ప్రశంసపత్రం, పంచసూత్రాలు అనే కరపత్రాన్ని ప్రతి విద్యార్థికి అందించి భయాన్ని పోగొట్టి మార్గదర్శనం చేశారు. తరగతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు ఎలా చె బుతున్నారు..? ఎలా ప్రోత్సహిస్తున్నారు..? తె లుసుకునేందుకు ఫోన్ఇన్ కార్యక్రమం ప్రారంభించారు. సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.హాజరైన బాలురు 5,962 బాలికలు 5,887 మొత్తం 11,849 ఉత్తీర్ణులైన బాలురు 5,823 ఉత్తీర్ణులైన బాలికలు 5,813 ఉత్తీర్ణులైన మొత్తం 11,636 ఉత్తీర్ణత శాతం 98.20 మొత్తం పాఠశాలలు : 336 వందశాతం ఉత్తీర్ణత సాధించినవి 221 ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్న జిల్లా 11వ స్థానం నుంచి 4వ స్థానానికి.. ఎప్పటిలాగే బాలికలే ముందంజ మొత్తంగా 98.20 శాతం ఉత్తీర్ణత -
క్రీడాకారిణులకు ‘ఫేస్బుక్ మిత్రుల’ చేయూత
ధర్మపురి: చదువుతోపాటు పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఇద్దరు క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అయ్యే ఖర్చుల నిమిత్తం ఫేస్బుక్ మిత్రులు రూ.1.16 లక్షలు సాయం అందించారు. ధర్మపురికి చెందిన శ్యామ్రావ్ ఐశ్వర్య, మండలంలోని నక్కలపేట గ్రామానికి చెందిన భూక్య శ్రావణి ఓ వైపు చదువుతూనే మరోవైపు పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తున్నారు. ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఈనెల 5న నిర్వహించే ఏషియన్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. అయితే పోటీలో పాల్గొనడానికి చెల్లించే ఫీజు, ప్రయాణ ఖర్చులు ఇరువురి కుటుంబ సభ్యులకు భారంగా మారాయి. వీరి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి ఏప్రిల్ 4న ఫేస్బుక్లో పోస్టు చేసి వీరికి సాయం అందించాలని కోరారు. తెలుగురాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు శ్రావణి తండ్రి తిరుపతి బ్యాంకు ఖాతాలకు రూ.1.16 లక్షలను విరాళాలుగా పంపించారు. వాటిని స్థానిక సీఐ రాంనర్సింహారెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై ఉదయ్కుమార్తో కలిసి శ్రావణికి రూ.66 వేలు, ఐశ్వర్యకు రూ.50వేలు పంపిణీ చేశారు. రమేశ్తోపాటు సా యం అందించిన దాతలను సీఐ అభినందించారు. ● రూ.1.16 లక్షలు సాయం -
అన్నప్రసాదం అందించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం అందడం లేదు. ప్రతిరోజు వందమందికే భోజనం పెట్టడం సరికాదు. భక్తులు నిరాశతో వెనుదిగాల్సి వస్తోంది. ఆలయానికి ఆదాయం పెరుగుతున్న దృష్ట్యా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలి. ఆలయంలోనే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. యాగండ్ల సుమన్, భక్తుడు, మల్యాల ఉన్నతాధికారులకు నివేదించాం అంజన్న భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరో జు 100మందికి.. మంగళ, శనివారం 200మందికి భోజనం పెడుతున్నాం. రెట్టింపు చేయాలని భక్తుల నుంచి వినతులు వస్తున్నాయి. విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. శ్రీకాంత్ రావు, ఈఓ, కొండగట్టు -
‘బండ’బారిన బతుకులు
కండలు కరిగించినా.. కొండలు పగులదీసినా.. ● కుండలో మెతుకులు కరువు ● కష్టజీవులకు దక్కని హక్కులు ● ప్రమాదబీమా ఊసేలేదు ● రెక్కాడితే తప్ప డొక్కాడని తుర్కాశీ కార్మికులు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 82 గ్రామాల్లో.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 82 గ్రామాల్లో తుర్కాశీ కార్మికులు ఉన్నారు. వీరంతా నిత్యం గుట్టలు, గుట్టబోరును నమ్ముకుని బండలు కొడుతున్నారు. భవన నిర్మాణాలకు, ప్రహరీలకు, పునాదుల నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తారు. ఎంతో కష్టతరమైన పనిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కండలు కరిగించి కొండలు పగలదీసినా ఇంట్లో కుండలు వెలితిగానే ఉంటున్నాయి. ఎదుగుబొదుగు లేని జీవితంతో బతుకు జట్కాబండిని భారంగా ఈడుస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ధైన్యం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎండా, వాన, చలి ఇవేవి వాళ్లని భయపెట్టవు... రేపటికి పని దొరక్కపోతే ఎలాగన్న వేదన తప్ప... పండుగ పబ్బాలకు పరమాన్నం రుచి ఎరుగరు. జిల్లాలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న తుర్కాశీల బతుకుచిత్రం దుర్భరం. అటవీ ప్రాంతాల్లో పనిచేయడంతో ఫారెస్ట్ అధికారులు బండలు కొట్టవద్దని పనిముట్లను లాకెళ్తున్నారని కార్మికులు వాపోయారు. రెక్కల కష్టాన్ని నమ్మకున్న కార్మికుల బతుకులు బండలవుతున్నాయి. గుర్తింపు లేదు తుర్కాశీ కార్మికులను భవన నిర్మాణరంగ కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా.. కార్మికశాఖ వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన బండలను కొట్టి సరఫరా చేస్తున్నా గుర్తింపుకార్డులు, భవన నిర్మాణ కార్మికులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు చొరవచూపి జిల్లాలోని తుర్కాశీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు ఇస్తాం భవన నిర్మాణ కార్మికులుగా తుర్కాశీ కార్మికులను గుర్తిస్తాం. తుర్కాశీ కార్మికులు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో చాలా మందికి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డులు లేని వారు ఉంటే కార్మిక శాఖ ఆఫీస్ను సంప్రదిస్తే జారీ చేస్తాం. – నాజర్ అహ్మద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సిరిసిల్ల సిరిసిల్ల: కండలు కరిగించి.. గుట్టలను పిండి చేస్తున్నారు. ఎండ..వాన..చలి.. లెక్కచేయని తనంతో కష్టపడుతున్నారు. అయినా పూటగడవని స్థితిలో తుర్కాశీలు కాలం వెల్లదీస్తున్నారు. భవన నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తున్నా వారికి కనీసం కార్మికులుగా గుర్తింపుకార్డులు లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. బండలు కొడుతూ ‘బండ’బారిన జీవనం గడుపుతున్న తుర్కాశీలపై మేడే సందర్భంగా ప్రత్యేక కథనం. -
ఫెయిలైతే నిరాశ చెందొద్దు
జగిత్యాలక్రైం: పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైనవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నిరాశ చెందొద్దని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని నిరాశ చెంది అఘాయిత్యం చేసుకోవడం సరికాదని, తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చొద్దని సూచించారు. మార్కులు తక్కువ వస్తే జీవితంలో ఓడినట్టు కాదని, అవి కేవలం కొలమానం మాత్రమేనని పేర్కొన్నారు. జీవితం మరెన్నో అవకాశాలతో నిండి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా ధైర్యం కల్పించేలా తోడుగా ఉండాలని, వారిని ప్రోత్సహించాలన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ బస్సులో పొగలుమల్లాపూర్: అసలే ఎండాకాలం.. ఆపై 120 మంది ప్రయాణికులు.. ఓవర్ హీట్తో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ఓ ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులో బుధవారం చోటుచేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సు నిర్మల్కు బయల్దేరింది. అందులో సుమారు 120మంది ప్రయాణికులు ఎక్కారు. మల్లాపూర్ శివారుకు చేరగానే ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. మరో బస్సు వచ్చేవరకూ ప్రయాణికులు ఎండలోనే వేచి ఉండి ఇబ్బందిపడ్డారు. బాక్సింగ్ కోచింగ్ ప్రారంభంజగిత్యాల: జిల్లాకేంద్రంలో బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ను ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పాదం మహేందర్, సెక్రెటరీ శ్రీనివాస్ తెలిపారు. మినీస్టేడియంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఉంటుందని, ఆసక్తి గల క్రీడాకారులు రావచ్చని పేర్కొన్నారు. నెలరోజులపాటు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ నాయకులు అరుణ్, తిరుపతి, కిరణ్, వంశీకృష్ణ, రాఘవరావు, సాకేత్, వరుణ్ పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యసారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డా డు. శరీరంలో విపరీతమైన నొప్పులు ఉండడంతో అసౌకర్యానికి గురవుతున్నాడు. మందులు వాడినా నొప్పులు తగ్గడంలేదు. జీవితంపై విరక్తి చెంది పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గంగన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కన్నవారిని విస్మరిస్తే చర్యలుమెట్పల్లి: తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వృద్ధుల సంరక్షణ చట్టాల అవగాహన పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించడానికి అసోసియేషన్ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లా అధ్యక్షులు హరి అశోక్కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, హన్మంత్రెడ్డి, యాకూబ్, అశోక్రావు, వొజ్జెల బుచ్చిరెడ్డి తదితరులున్నారు. -
బసవేశ్వరుని భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జగిత్యాలటౌన్: మహాత్మ బసవేశ్వరుడు బోధించిన మానవతా విలువలు, సమానత్వ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. బసవేశ్వర జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కులం, వర్గ వివక్షలేని సమాజం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్, లింగాయత్ కుల పెద్దలు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి నివాళి సామాజిక న్యాయం కోసం బసవేశ్వరుడు అలుపెరుగని పోరాటం చేశారని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ధరూర్ వద్ద బసవ కూడలిలోగల బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తన బోధనల ద్వారా ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. -
అప్పు తీసుకున్న వారు మోసం చేశారని..
జగిత్యాలక్రైం: మాయమాటలు చెప్పి అవసరం నిమిత్తం బంగారం, నగదు తీసుకున్న ఇద్దరు మహిళలు ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటుండడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు క్రిమిసంహారక మందుతాగి వచ్చి జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో స్పృహ తప్పి పడిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన తోట బాలవ్వ వద్ద జగిత్యాలకు చెందిన అశ్విని, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన విజయ ఇద్దరూ కలిసి తమ అవసరం నిమిత్తం 14 నెలల క్రితం 15 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకుని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. కాలపరిమితి ముగియడంతో బాలవ్వ డబ్బులు చెల్లించాలని కోరగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో గతంలోనే బాలవ్వ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా వారు డబ్బులు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. బుధవారం డబ్బులు చెల్లించేందుకు వాయిదా ఉండటంతో బాలవ్వ పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీసులు అశ్విని, విజయను పిలిపించారు. వారు డబ్బులు చెల్లించేందుకు కొంతసమయం కావాలని, ఇప్పుడే కావాలంటే తమ వద్ద లేవని నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలవ్వ వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగింది. అక్కడున్న వారు గమనించి బాలవ్వను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలవ్వ చికిత్స పొందుతోంది. పోలీస్స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలించిన పోలీసులు -
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
జగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సులో వరంగల్కు చెందిన సులోచన కరీంనగర్లో ఎక్కింది. తులం బంగారం, సెల్ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యాగ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగిత్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ కుటుంబం నుంచి జిల్లా టాపర్గా..
సారంగాపూర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచిన కడారి అమూల్య తల్లిదండ్రులు సరిత, గంగాధర్. వీరిది వ్యవసాయ కుటుంబం. బీర్పూర్ గ్రామానికి చెందిన అమూల్య అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 600 మార్కులకు 580మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అమూల్యను ఎంఈవో సిరుప నాగభూషణం, హెచ్ఎం సంగెనభట్ల నర్సింహ్మమూర్తి, ఉపాధ్యాయులు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్ అభినందించారు. కూలీబిడ్డ మండల టాపర్.. రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ జెడ్పీహెచ్ఎస్లో చదివిన బొడ్డుపల్లి రక్షిత 568 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. తండ్రి లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లి కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి జమున గ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రక్షిత 568 మార్కులు సాధించింది. చేతిలో చిల్లిగవ్వ లేదని, తన కూతురును ఇంటర్మీడియట్ చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రజతోత్సవ సభ విజయవంతం
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించినా జనం భారీగా తరలివచ్చారని, దీనిని జీర్ణించుకోలేని కొందరు మంత్రులు అక్కసువెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైన అగ్రికల్చర్ కళాశాల తరలిపోకుండా అక్కడి ఎమ్మెల్యే కాపాడాలన్నారు. జిల్లా విద్యార్థులకు కొత్త విద్యాలయం తీసుకురావాలిగానీ.. మంజూరైన అగ్రికల్చర్ కళాశాల తరలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని హితవు పలికారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్రావు, ఆనందరావు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
రాయికల్/పెగడపల్లి: భూ భారతి చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంతోపాటు పెగడపల్లి మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వారివారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలని ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. ఆధార్కార్డు తరహాలోనే భూమికి భూదార్ సంఖ్య కేటాయిస్తారని, దీనిద్వారా భూ ఆక్రమణలకు చెక్ పడుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు తీర్చేందుకు గ్రామపరిపాలన అధికారి కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం భూ భారతితో భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మ ణ్కుమార్ అన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామన్నారు. రాయికల్లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీడీవో చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, దీటి రాజిరెడ్డి, ఏనుగు ముత్యంరెడ్డి, పెగడపల్లిలో ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఏవో శ్రీకాంత్, ఆర్ఐలు శ్రీనివాస్, జమున, ఏఈవోలు పాల్గొన్నారు. సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి -
సమస్యల పరిష్కారానికి కృషి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి: ధర్మపురిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని 5, 13వ వార్డుల్లో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చింతామణి చెరువు కట్టను మినీ ట్యాంక్బండ్లా మార్చుతామని, గోదావరి నుంచి చెరువులోకి ప్రత్యేక పైపులైను ద్వారా నీటిని తరలిస్తామని వివరించారు. ప్రజలు వాకింగ్ చేయడానికి వీలుగా విద్యుత్ లైట్లు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. మురుగు నీరు గోదావరిలో కలువకుండా సీనరేజ్ ప్లాంట్ కోసం రూ.17 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపరిశెట్టి రాజేశ్, సీపతి సత్యనారాయణ, ధర్మకర్తలు తదితరులున్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల, కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రూ.13లక్షలతో సైన్స్ల్యాబ్లకు, ఇటిక్యాల, కొత్తపేటలో రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పల్లె దవాఖానా నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. రూ.9 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. మూటపల్లిలో సైన్స్ల్యాబ్ నిర్మాణానికి స్థల పరిశీలన, కుమ్మరిపల్లిలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న బీటీరోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. కిష్టంపేటలో అల్లీపూర్ రైతు ఉత్పత్తిదారుల లిమిటెడ్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణంలో 60 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.17.50 లక్షలు, 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో వసతుల కల్పన, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, నాయకులు కోల శ్రీనివాస్, అచ్యుత్రావు, సూర జగన్, నాగరాజు, నందయ్య, నిఖిల్ పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలువెల్గటూర్: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను మంగళవారం తనిఖీ చేశారు. సేల్స్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు, ఈ–పాస్ మిషన్లు, గోదాంలో ఎరువుల బస్తాల నిల్వలను పరిశీలించారు. వానాకాలం సీజన్కు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు, అనుమతులు లేనివి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. యాసంగిలో వచ్చిన యూరియా కొరత మరోసారి రాకుండా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్కుస్పందన అంతంతే..
● 25 శాతం గడువు నేటితో ముగింపు ● అవగాహన కల్పించినా ఫలితం శూన్యం ● ఫీజు చెల్లింపునకు ముందుకు రాని ప్రజలుజగిత్యాల: అక్రమ పాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించింది. ముందుగా మార్చి 31వరకే గడువు విధించినా ప్రజలు ముందుకు రాకపోవడంతో ఈనెల 30 వరకు పెంచింది. అయినప్పటికీ ఆదాయం అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా స్పందన అంతంతమాత్రమే లభిస్తోంది. క్రమబద్ధీకరణ కోసమని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా.. పరిష్కరించడంలో అప్పుడు నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ చెల్లించాలని, 25శాతం రాయితీ ప్రకటించినా స్పందన లభించలేదు. జిల్లాలో 27,484 దరఖాస్తులు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణకు 27,484 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించినా ఇప్పటివరకు రూ.11.77 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. 3,579 మంది ఫీజు చెల్లించారు. 869 మాత్రమే ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇంకా చాలామంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అధికారులు ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీపై ఫ్లెక్సీలు, వాల్రైటింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టినా ప్రజలు ముందుకు రాలేదు. నిషేధిత జాబితాలోకి వెళ్లడంతోనే.. చాలామంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా కొందరివి నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సాంకేతిక కారణాలతోనే నిషేధిత జాబితాలో చేరడంతో సంబంధిత దరఖాస్తుదారులు వాటిని సరిచేయాలంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారు కూడా పట్టించుకోవడం లేద న్న ఆరోపణలున్నాయి. ఒకవైపు గడువు ముగి యనుండగా.. అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యగా మారింది. ఎల్ఆర్ఎస్ మూడు దశల్లో దరఖాస్తులు పూర్తి చేస్తున్నారు. ఎల్–1, ఎ ల్–2, ఎల్–3 దశల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఎల్–1లో ఇరిగేషన్ అధికారులు, ఎల్–2లో రెవె న్యూ, ఎల్–3లో మున్సిపాలిటీ వారు ఉన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఒకవేళ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోకి వస్తే వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారులు ఉందా..? లేదా..? అ న్నది చూసి ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. రెవె న్యూ అధికారులు ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకో వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలిచ్చాం దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదని డీఈలకు ఆదేశాలు ఇచ్చాం. సుమారు అన్ని దరఖాస్తులను పరిష్కరించాం. ఏవైనా భూములు ఎఫ్టీఎల్లో ఉంటేనే సమస్యగా ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటే ఎన్వోసీ ఇస్తున్నాం. – ఖాన్, ఇరిగేషన్ ఈఈ -
ప్రణాళిక అమలు చేయాలి
వానాకాలం సీజన్కు ప్రణాళిక రూపొందించడంతోపాటు రైతులకు అవసరమైన మేరకు అందించాలి. కొన్నిచోట్ల విత్తనాలు దొరకడం లేదు. సకాలంలో ఎరువులు ముఖ్యంగా యూరియా అందడం లేదు. విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నాయి. అదుపులో ఉంచాలి. – మారు మురళీధర్ రెడ్డి, మెట్పల్లి ప్రణాళిక సిద్ధం చేశాం వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసే పంటల వివరాలతోపాటు వాటికి అవసరమయ్యే రసాయన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాం. ప్రణాళికను ఉన్నతాధికారులకు పంపించాం. ఆ మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రైతులకు దిశానిర్దేశం చేయనున్నాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
మెట్పల్లి: పట్టణంలోని పలు క్లినిక్లను డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. జ్యోతి క్లినిక్కు అనుమతి లేకపోవడం.. అర్హత లేని వైద్యులతో చికిత్స చేస్తుండడాన్ని గుర్తించారు. దీంతో క్లినిక్ను సీజ్ చేసి నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఆకుల శ్రీనివాస్, మండల వైద్యాధికారి ఎల్లాల అంజిత్రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 26 నుంచి 27 డిగ్రీల సెల్సియస్లో కదలాడాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. భీమారం మండలం మన్నెగూడెంలో 43.2, రాయికల్లో 43, ధర్మపురి మండలం జైనాలో 42.9, పెగడపల్లిలో 42.8, గొల్లపల్లి, మేడిపల్లిలో 42.7, బీర్పూర్ మండలం కోల్వాయిలో 42.6, కోరుట్ల మండలం ఐలాపూర్లో 42.5, ధర్మపురి మండలం బుర్దేశ్పల్లి, రాయికల్ మండలం అల్లీపూర్, మల్లాపూర్లో 42.4, మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఇబ్రహీంపట్నం గోదూర్లో 42.1 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలిఇబ్రహీంపట్నం: సాధారణ ప్రసవాలపై గ్రామాల్లో వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకునేలా సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీని పరిశీలించి టీబీ కేసుల వివరాలపై ఆరా తీశారు. మందుల గది, వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి అనిల్కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయభాస్కర్, నర్సింగ్ ఆఫీసర్ రాజేందర్ ఉన్నారు. నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంరాయికల్: మండలంలోని ఆలూరులో నల్లపోచమ్మతల్లి, పోతురాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సుప్రభాతసేవ, వేద పారాయణం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విగ్రహ దాత సోమిరెడ్డి సురేందర్రెడ్డి, సుజాత దంపతు, నాయకులు పాల్గొన్నారు. పశు వైద్యశిబిరం తనిఖీకథలాపూర్: మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో పశువైద్యశాఖ నిర్వహిస్తున్న గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని మంగళవారం జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి వేణుగోపాల్రావు తనిఖీ చేశారు. మండలంలో ఎన్ని పశువులకు టీకాలు వేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పశు వైద్యాధికారులు దివ్యశ్రీ, శ్రీనివాస్ ఉన్నారు. -
సాగు ప్రణాళిక ఖరారు
● వరి సాగు వైపే రైతన్న చూపు ● జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో సాగవనున్న పంటలు ● కావాల్సిన ఎరువులు సిద్ధం చేస్తున్న వ్యవసాయ అధికారులు ● అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుజగిత్యాలఅగ్రికల్చర్: వచ్చే వానాకాలంలో పంటల సాగును ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఎప్పటిలాగే ఈ సీజన్లో రైతులు వరి సాగు వైపే రైతులు దృష్టి పెట్టనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంటలు, కావాల్సిన ఎరువులు, సబ్సిడీ విత్తనాలు సమకూర్చుకునేందుకు వ్యసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు కానున్నాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, కంది అధిక విస్తీర్ణంలో సాగవుతుందని అంచనా వేశారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరిని అత్యధికంగా 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంటున్నారు. మొక్కజొన్న పంట 32వేలు, పత్తి 18వేలు, కంది 1500, పసుపు 8500, పెసర 100, సోయాబీన్ 500, చెరుకు 500, మిర్చి 500, ఉద్యాన పంటలు, కూరగాయలు 42,400 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతేడాది 4,13,974 ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 4,14,419ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. 88,733 టన్నుల రసాయన ఎరువులు ఆయా పంటల సాగుకు కావాల్సిన ఎరువుల ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఇందులో 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10,653 టన్నుల కాంప్లెక్స్, 3,329 టన్నుల సింగిల్ సూపర్ ఫాస్పేట్ అవసరమని అధికారులు తేల్చారు. పంటల పెరుగుదలను బట్టి జూన్లో 21,786 టన్నులు, జూలైలో 25,856, ఆగస్టులో 19,074, సెప్టెంబర్లో 8,706 టన్నుల చొప్పున ఎరువులు జిల్లాకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం యూరియా 6,053టన్నులు, డీఏపీ 1,165, కాంప్లెక్స్ 1,598, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 3,995, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 499 టన్నులు అందుబాటులో ఉన్నాయి. 80,468 క్వింటాళ్ల విత్తనాలు వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 77,660 క్వింటాళ్ల వరి, 90 క్వింటాళ్ల కంది, 2,560 క్వింటాళ్ల మొక్కజొన్న, పెసర 8 క్వింటాళ్ల, సోయాబీన్ 150 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని, వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 36 వేల ప్యాకెట్ల పత్తి విత్తనాల ను సిద్ధం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న విత్తనాలకు సబ్సి డీ లేకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు చెప్పిన ధర కే రైతులు కొనాల్సి న పరిస్థితి ఉంది. పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం పచ్చిరొట్ట అయిన జనుము, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. సుమా రు 1,83,417 ఎకరాలకు అవసరమైన 22,010 క్వింటాళ్ల జీలుగ, 41వేల ఎకరాలకు అ వసరమైన 6,150 క్వింటాళ్ల జనుమును 65 శాతం స బ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు జిల్లాకు కేటాయించింది. సబ్సిడీ పోను, మిగతా సొమ్మును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ విండోలు, అగ్రోస్ కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతిసారి పచ్చిరొట్ట విత్తనాలు చివరి రైతులకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
మేడిపల్లి/వెల్గటూర్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతులకు మేలు చేస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లిలోని రైతు వేదికలో, ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో అవగాహన కల్పించారు. రైతులు ఈ చట్టంపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని పేర్కొన్నారు. ఆధార్కా ర్డు మాదిరిగానే భూదార్ కార్డు అందించనున్నట్లు వెల్లడించారు. మేడిపల్లిలో కోరుట్ల ఆ ర్డీఓ జివాకర్ రెడ్డి, తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పద్మావతి, ఎండపల్లిలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మపురిలో ఆయుష్య హోమంధర్మపురి: శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో వేద పండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణలతో సోమవారం ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి● పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి జగిత్యాలటౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో తపస్ జిల్లా శాఖ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పెండింగ్ బిల్లుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నిధులు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంజిరెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నరేందర్రావు, బోనగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించాలి● అడిషనల్ కలెక్టర్ లత జగిత్యాల: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించాలని అడిషనల్ కలెక్టర్ లత, ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాలపై సమీక్షించారు. జాతీయ రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ మూడోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. రోడ్డు సేఫ్టీ అందరి బాధ్యత అని, వచ్చే సమావేశానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్లతో రావాలని ఆదేశించారు. ఆర్డీవోలు మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోరుట్లలో బార్ ఏర్పాటుకు 24 దరఖాస్తులు● ప్రభుత్వానికి రూ.24 లక్షల ఆదాయం ● జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ జగిత్యాలక్రైం: ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కమిషన్ ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో మూసివేయబడిన ఓ బార్ స్థానంలో మరో బార్ ఏర్పాటుకు 24 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.24 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 మంది ఎంట్రీ పాస్లతో ఈనెల 29న ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతి ద్వారా బార్ ఎంపిక ఉంటుందని తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీవో మనోజ్ కుమార్ తెలిపారు. వెల్గటూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగసంకీర్త్, పీఏసీఎస్ కార్యదర్శి పూర్ణచందర్, సంఘ సిబ్బంది అనిల్, సంతోష్ పాల్గొన్నారు. హమాలీలకు మజ్జిగ ప్యాకెట్లు ధర్మపురి: వ్యవసాయ మార్కెట్ యార్డులో పనులు చేస్తున్న హమాలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీవో, తహసీల్దార్ కృష్ణ చైతన్య తెలిపారు. హమాలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. -
బైపాస్ పనులకు బ్రేక్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల– పెద్దపల్లి సెక్షన్లోని బైపాస్ రైల్వేలైన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇటీవలకాలంలో పనులు వేగంగా సాగాయి. కానీ.. అకస్మాత్తుగా పెద్దపల్లి బైపాస్లో పనులు నిలిచిపోయాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకా రం.. పెద్దపల్లి బైపాస్ పనులు నిబంధనల మేరకు జరగడం లేదని, పనుల్లో నాణ్యతపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని, తదుపరి ఆదేశాలు వచ్చేసరికి పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే నెల ఆఖరును ప్రారంభం కావాల్సి న రైల్వేలైన్ ఆలస్యం కానుందని సమాచారం. వాస్తవానికి మార్చి ఆఖరునాటికి బైపాస్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. మార్చి 28నుంచి ఇంటర్లాకింగ్ పనులు మొదలవుతాయని, ఉగాది కల్లా పనులు పూర్తవుతాయ ని, ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక.. మే నెలాఖరునాటికి బైపాస్ లైన్ను అందుబాటులోకి తీసుకువస్తారని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఇటీవల ఇంటర్లాకింగ్ పను ల పరిశీలనకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు పనులు నిబంధనల ప్రకారం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మొత్తం 1.78 కిమీ పొడవున్న రైల్వేలైన్లో 500 మీటర్ల వరకు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో బైపాస్ రైల్వేలైన్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. జూన్ నుంచి కానరాని కరీంనగర్–తిరుపతి రైలు కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతివెళ్లే కరీంనగర్– తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మొన్నటి వరకు మే 29 తేదీ నుంచి పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్తుందని ప్రచా రం జరిగింది. దీన్ని బలపరుస్తూ ఐఆర్సీటీసీ పోర్టర్లోనూ మే 29 తరువాత పెద్దపల్లి రైల్వేస్టేషన్ కనిపించలేదు. జూన్ 1 నుంచి రైలు ఐఆర్సీటీసీ పోర్టర్లో కానరావడం లేదు. దీనికి కారణాలు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం బైవీక్లీగా ఉన్న ఈ ససర్వీసు కరీంనగర్కు ఉదయం 8.15 గంటలకు వస్తుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు తిరిగి తిరుపతి బయల్దేరుతుంది. ఈనేపథ్యంలో ఈ రైలును నిజామాబాద్ వరకు పొడగిస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ రైలును పొడిగిస్తారా? లేదా సర్వీసును వారానికి ఐదురోజుల పెంచుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పెద్దపల్లి రైల్వేబైపాస్లో స్టేషన్ కట్టాల్సిందే అదే సమయంలో బైపాస్ రైల్వే లైన్ వద్ద హాల్టింగ్ లేకుండా ప్రారంభమైతే.. తాము తిరుపతి వెళ్లేందుకు అవకాశం కోల్పోతామని పెద్దపల్లిలో రైలెక్కే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సిర్పూర్ కాగజ్నగర్, చెన్నూరు, ధర్మారం, ఆసిఫాబాద్ భక్తులు ఆందోళన చెందుతున్నారు. లేకపోతే గతంలోలా తామంతా కాజీపేట వరకు ప్రయాణం చేసి పద్మావతి లాంటి రైళ్లను అందుకోవాల్సి వస్తుందని, ఇది దూరాభారంతోపాటు తమకు సమయం కూడా వృథా అవుతుందని వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ వద్ద రైల్వేస్టేషన్ నిర్మించి, తిరుపతి–కరీంనగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్లో అనూహ్య మలుపు! తొలుత మే నెలాఖరుకు ప్రారంభిస్తారని ప్రచారం పనులు జరుగుతున్న తీరుపై అధికారుల అసంతృప్తి? పూర్తి అయ్యేందుకు మరింత సమయం ఐఆర్సీటీసీలో కానరాని కరీంనగర్– తిరుపతి రైలు నిజామాబాద్ వరకు పొడిగింపుపై ఉత్కంఠ -
బల్దియాలో ఆగని అవినీతి
● ప్రతి విభాగంపైనా ఫిర్యాదులు ● తీరుమార్చుకోని అధికారులు ● ఏళ్ల తరబడిగా ఇక్కడే తిష్ట ● ఇష్టారాజ్యంగా విధులు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. ఇక్కడ సుమారు లక్షకు పైగా జనాభా ఉంటుంది. అలాంటి బల్దియాలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక్క విభాగంలోనే కాదు.. ప్రతి విభాగంలోనూ చోటుచేసుకుంటోందని అందులో పనిచేసే కొందరు సిబ్బంది, స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జగిత్యాల బల్దియాలో వస్తున్న ఆరోపణలు మచ్చుకు కొన్ని.. -
అంబేడ్కర్ కృషితోనే అన్ని వర్గాల అభ్యున్నతి
● మాజీమంత్రి జీవన్రెడ్డి జగిత్యాలరూరల్: అంబేడ్కర్ కృషితోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలఅర్బన్ మండలం ధరూర్లో జైబాపు, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ధరూర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపై అంబేడ్కర్, మహాత్మగాంధీ చిత్రపటాలు, రాజ్యాంగ ప్రతులతో ర్యాలీ నిర్వహించారు. కులమతాల పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీకి యువతే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అభివృద్ధి ముసుగులో కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదో నిలదీయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శీలం సురేందర్, శివకుమార్, శీలం మల్లేశం, నర్సయ్య, బండ శంకర్, గాజంగి నందయ్య, గోపి రాజిరెడ్డి, కండ్లపల్లి దుర్గయ్య, జున్ను రాజయ్య, కోండ్ర జగన్, చాంద్పాషా, గంగాధర్, మహేశ్, రాధాకిషన్రావు, నరేశ్, రాజిరెడ్డి, స్వామిరెడ్డి, గుండ మధు, సింగరావు, మొగిలి, ముకేశ్ పాల్గొన్నారు. -
ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి
మల్లాపూర్: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు సోమవారం రాత్రి మండల కేంద్రంలోని జామమజీద్ ఎదుట ముస్లిం మైనార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు ఆర్పించారు. కమిటీ మండల అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పహల్గాం ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ మండల సభ్యులు బషీర్, బాబాఫరీద్, తక్కియుద్దీన్, సల్మాన్, మహబుబ్, షబ్బీర్, మహమ్మద్ రఫీ, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–మెయిల్ ద్వారా జైళ్లకు బెయిల్ ఆర్డర్ కాపీలు
● జిల్లాలోని అన్ని కోర్టులకూ ఉత్తర్వులు ● ఆదేశాలు జారీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగిత్యాలజోన్: వివిధ నేరాలకు పాల్పడి.. ఆయా కేసుల్లో జైళ్లలో విచారణ ఖైదీలుగా ఉన్న నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. సకాలంలో కోర్టు ఆర్డర్ కాపీలు జైళ్లకు చేరకపోవడంతో విడుదలలో జాప్యం జరుగుతోంది. నిందితుల కేసు ఓ కోర్టులో ఉండటం, నిందితుడు మరో జైళ్లో ఉండటంతో బెయిల్ మంజూరైనా ఆర్డర్ కాపీని జైలులో అందజేయడం అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులకు సవాల్గా మారింది. ఉదాహరణకు: జగిత్యాల పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో నిందితుడు చర్లపల్లి జైల్లో ఉంటే.. జగిత్యాల కోర్టు బెయిల్ మంజూరు చేస్తే.. ఆ ఆర్డర్ను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లడం కుటుంబసభ్యులకు పెద్ద సమస్యగా మారింది. బెయిల్ మంజూరైన తర్వాత నిందితుడి తరఫున ష్యూరిటీ పెట్టడం, వాటిని చెక్ చేసి, జైలుకు బెయిల్ ఆర్డర్ పంపడంలో చాలా సమయం గడిచిపోతోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత జైలు అధికారులు కోర్టులు ఇచ్చే రిలీజ్ ఆర్డర్ను తర్వాత రోజు ఓపెన్ చేస్తారు. అప్పటివరకు నిందితుల విడుదలలో జాప్యం జరుగుతుంది. నిందితుల తరఫున ఎవరూ లేకుంటే బెయిల్ ఆర్డర్ను జైలుకు తీసుకెళ్లడం కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రత్న పద్మావతి బెయిల్ ఆర్డర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేరుగా జైళ్లకే ఈ–మెయిల్ ఆర్డర్లు బెయిల్ ఆర్డర్ లేదా రిలీజ్ ఆర్డర్ కాపీని నేరుగా జైళ్లకు ఈ–మెయిల్ ద్వారా పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా నిందితులకు సత్వర ఉపశమనం కలిగి, జైలు నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి కోర్టులతోపాటు, అన్ని జైళ్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఉండే చర్లపల్లి సెంట్రల్ జైలు, చంచల్గూడ మహిళా జైలు, కరీంనగర్ జిల్లా జైలు, జగిత్యాల స్పెషల్ సబ్ జైలుల ఈ–మెయిల్ ఐడీలను కూడా అన్ని కోర్టులకు పంపించారు. ఇకనుంచి జిల్లాలోని అన్ని కోర్టులు మంజూరు చేసే బెయిల్ లేదా రిలీజ్ ఆర్డర్లను ఈ–మెయిల్ ద్వారా నిందితులు ఉండే జైళ్లకు పంపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
రజతోత్సవానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు
● పార్టీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్రావు ● వాహనాల్లో భారీ సంఖ్యలో కదలిన కార్యకర్తలు జగిత్యాలటౌన్/సారంగాపూర్/రాయికల్/మల్లాపూర్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఎల్కతుర్తిలో నిర్వహించిన సభకు తరలివెళ్లారు. -
అందని వైద్యం
● మెడికల్ కళాశాలలోనే ఎన్హెచ్ఎం సిబ్బంది ● ఇతర ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ● పట్టింపులేని వైద్యశాఖ అధికారులుజగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం కాకముందు.. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఇక్కడ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి కొనసాగేది. జిల్లాకేంద్రం కావడం, మెడికల్ కళాశాల మంజూరు కావడంతో జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిగా ఉన్న సమయంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఇద్దరు గైనకాలజిస్ట్లు, ఇద్దరు అనస్థిషియా, ముగ్గురు పిడియాట్రిక్స్ వైద్యులను నియమించారు. వైద్య విధాన పరిషత్గా ఉన్న సమయంలో వీరి సేవలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ఏర్పాటైన మొదట్లో వైద్యులు తక్కువగా ఉండటంతో ఈ ఎన్హెచ్ఎం కింద నియమితులైన వారు అందులోనే సేవలందించారు. మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెన్సీలు పూర్తిస్థాయిలో నియామకం అయ్యారు. వైద్య విధాన పరిషత్ కింద పనిచేసిన వారు ప్రస్తుతం మెడికల్ కళాశాలలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిని సంబంధిత ఏరియా ఆస్పత్రి లేదా.. జిల్లా జనరల్ ఆస్పత్రి, పీహెచ్సీ ఇతర ఏ ఆస్పత్రుల్లోనైనా వీరి సేవలు కొనసాగించవచ్చు. మెడికల్ కళాశాలలో స్థాయికి మించి సిబ్బంది ఉన్నప్పటికీ వీరిని అందులోనే కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో అనేకమంది వైద్యులు తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పిడియాట్రిక్స్గానీ, అనస్థిషియా, గైనకాలజిస్ట్లు తక్కువగా ఉన్నారు. వీరిని అందులో కేటాయిస్తే ప్రజలకు మరింత వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఒక మెడికల్ కళాశాల అనే కాకుండా ఎన్హెచ్ఎం కింద నియమించిన సిబ్బంది బ్లడ్బ్యాంక్, ల్యాబ్, పాథాలజీ, ఇతర డిపార్ట్మెంట్లలో సైతం అనేకమంది కొనసాగుతున్నారు. వీరందరినీ అవసరమున్న చోట నియమిస్తే మరింత వైద్యం అందే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కళాశాలలో తక్కువగా ఉన్న సమయంలో వారిని నియమించినప్పటి నుంచి అలాగే కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి వీరు జిల్లా వైద్య శాఖ పరిధిలోకి వస్తారు. ఉన్నతాధికారులు స్పందించి వీరి సేవలను ఇతర ఆస్పత్రుల్లో అందించేలా నియమించాలని ప్రజలు కోరుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద నియమితులైన ఈ డాక్టర్లతోపాటు, ఇతర సిబ్బంది వేరేచోట్ల పనిచేస్తున్నారని, వీరిని ఆస్పత్రుల్లో పనిచేసేలా చూడాల్సిన అవసరం ఉంది. జిల్లాలో జనరల్ ఆస్పత్రి, 17 పీహెచ్సీలు, ఒక వైద్య విధాన పరిషత్, రెండు సీహెచ్సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వైద్య సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. మెడికల్ కళాశాలలో ఉన్న వీరిని ఇతర ఆస్పత్రుల్లో నియమించేలా చూస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. మెడికల్ కళాశాల ఏర్పడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అందులో అత్యధిక సిబ్బంది ఉన్నా అందులోనే కొనసాగించడం, కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి వారిని ఇతర ఆస్పత్రులకు కేటాయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావొద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఘనంగా భరణి నక్షత్ర వేడుకలుధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది తదితరులున్నారు. భారీ ఈదురు గాలులకు నేల రాలిన మామిడిసారంగాపూర్: సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఆదివారం ఉదయం వీచిన ఈదురుగాలులతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్వల్పంగా వర్షం కురిసినప్పటికీ ఈదురుగాలులకు కాయలు నేల రాలాయి. రైతులు వాటిని కుప్పగా వేసి, దళారులకు కిలోకు రూ.5 నుంచి రూ.10 చొప్పున విక్రయించారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో 1500 ఎకరాల్లో రైతులు మామిడి పంటలు సాగుచేశారు. ఏటా మామిడి రైతులకు ఈదురుగాలులు, అకాల వర్షాలతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ముగిసిన శ్రీసూక్త కోటి పారాయణంధర్మపురి: ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీసూక్త కోటి పారాయణం ఆదివారం ముగిసింది. మాధవానంద స్వామివారి సంకల్పం మేరకు శ్రీరుద్రసూక్త కోటి సామూహిక పారాయణ గ్రూప్ ప్రారంభించి 143 రోజులు పూర్తయ్యింది. 5,823 పారాయణాలతో నాలుగో మహారుద్రాలను పూర్తి చేశారు. ధర్మపురిలోని వేద పండితులు, పురోహితులు, భక్తులు హాజరయ్యారు. ఉగ్రదాడి మృతులకు నివాళిమల్లాపూర్: పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణా లు కోల్పోయిన పర్యాటకులకు ఆదివారం మల్లాపూర్ మండలంలోని రేగుంటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు రాజోజి సదానందచారీ, దురిశేట్టి శ్రీనివాస్, లక్ష్మణ్, నరేంద్ర, వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
రాయికల్: లండన్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకంజలో ఉందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యేవరకూ ఎన్నారైలంతా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నావంపేట్ హరి, సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, అడ్వైజరీ బోర్డ్ వైస్చైర్మన్ పుప్పాల గణేష్, సభ్యులు ప్రదీప్, సురేష్, సత్యపాల్రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో గోల్మాల్
● 436 బస్తాలకు చీటీ రాసిచ్చి.. 421 అంటూ బుకాయింపు మల్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి.. లెక్కించి.. నిర్ధారించిన తర్వాత ధాన్యం బస్తాలు గోల్మాల్ అయిన సంఘటన మండలంలోని సర్వాపూర్లో చోటుచేసుకుంది. సర్వాపూర్కు చెందిన రైతు కానుగట్టి మల్లేశం ఇటీల కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఈనెల 24న ధాన్యం తూకం వేశారు. నిర్వాహకులు ధాన్యం బస్తాలను లెక్కించి 436 బస్తాలుగా నిర్ధారించారు. క్వింటాల్కు రూ.40చొప్పున 174.40 క్వింటాళ్లకు హమాలీ చార్జీలు రూ.6,976 చెల్లించాడు. ఈనెల 25న తూకం వేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తుండగా.. 421 బస్తాలేనంటూ రైతుకు సమాచారం ఇచ్చారు. దీంతో తనకు రాసిచ్చిన చీటీ చూపించగా.. తప్పుగా లెక్కించామంటూ బుకాయిస్తున్నారని రైతు మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తూకం వేసి, లెక్కించి, చీటీ రాసిచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో 421 బస్తాలు నమోదు చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాల్లో గోల్మాల్పై జిల్లా అధికారులు విచారణ చేపట్టి, తనకు న్యాయం చేయాలని రైతు మల్లేశం వేడుకుంటున్నాడు. -
● సారంగాపూర్ను మల్లారెడ్డి మండలంగా మార్చేందుకు కృషి ● మంత్రి శ్రీధర్బాబు ద్వారా ముఖ్యమంత్రిని కలుస్తాం ● మాజీ మంత్రి జీవన్రెడ్డి
సారంగాపూర్: వానాకాలం ప్రారంభం వరకు రోళ్లవాగు ప్రాజెక్టుకు గేట్లు బిగించేలా చూస్తామని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కోండ్ర మల్లారెడ్డి 15 వర్ధంతి సభలో పాల్గొన్నారు. మల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.60 కోట్లతో చేపట్టిన రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీవాఖ నుంచి కనీస అనుమతులు రాలేదని, దీంతో వ్యయం రూ.132 కోట్లకు చేరిందన్నారు. ఇటీవల గేట్ల బిగింపునకు రూ.19 కోట్లు విడుదలయ్యాయన్నారు. బీర్పూర్కు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి మల్లారెడ్డి కృషి ఎనలేనిదన్నారు. గతంలో శ్రీధర్బాబు మంత్రిగా ఉన్న సమయంలో సారంగాపూర్ను మల్లారెడ్డి మండలంగా మార్చడానికి హామీ ఇచ్చారని, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో ఏకగ్రీవంగా తీర్మానించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రి శ్రీధర్బాబు ద్వారా సీఎం రేవంత్రెడ్డిని కలిసి సారంగాపూర్ను మల్లారెడ్డి మండలంగా మార్చడానికి చర్యలు తీసుకునేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, నాయకులు మహంకాళి రాజన్న, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ భూక్య సరళ, ముక్క శంకర్, మాజీ వైస్ ఎంపీపీలు బల్మూరి లక్ష్మణ్రావు, బేతి పూర్ణచందర్రెడ్డి, కోండ్ర రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్లు గుర్రాల రాజేందర్రెడ్డి, న్యారబోయిన గంగాధర్, మాజీ ఎంపీటీసీలు మానాల లక్ష్మణ్ పాల్గొన్నారు. వానాకాలం వరకు రోళ్లవాగు గేట్లు బిగిస్తాం -
అవకతవకలకు తావు లేకుండా ధాన్యం కొనాలి
మెట్పల్లిరూరల్: అవకతవకలకు తావు లేకుండా ధాన్యం కొనాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కొనుగోళ్లపై ఆరా తీశారు. సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, 24గంటల్లోపు కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్ల వివరాలు, లారీ ట్రక్షీట్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు. కేంద్రాల్లో ప్యాడీక్లీనర్లు ఉంచాలని, రైతులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంటున్నందున హమాలీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజ్మహ్మద్, ఆర్ఐ ఉమేశ్, ఏఈవో మనోజ్ఞ పాల్గొన్నారు. ఎస్బీ డీఎస్పీగా వెంకటరమణజగిత్యాలక్రైం: స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పల్లె వెంకటరమణను నియమిస్తూ శనివారం రాత్రి డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న వెంకటరమణను ఖాళీగా ఉన్న జిల్లా ఎస్బీ డీఎస్పీగా నియమించారు. మండుతున్న ఎండలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నాలుగైదు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు 45.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాత్రి సమయంలో కనిష్టంగా 26.1 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. రాయికల్ మండలం అల్లీపూర్లో 45.3 డిగ్రీల సెల్సియస్, రాయికల్లో 45.2, మల్లాపూర్లో 45.1, కోరుట్లలో 45 డిగ్రీలుగా నమోదయ్యాయి. గొల్లపల్లి, మన్నెగూడెంలో 44.8, జైన, అయిలాపూర్లో 44.7, మెట్పల్లిలో 44.6, మేడిపల్లి, పెగడపల్లి, నేరేళ్లలో 44.5, గోదూర్లో 44.4, సారంగాపూర్, కథలాపూర్, వెల్గటూర్లో 44.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. -
● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పెరుగుతుంది ● జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు ● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్
జగిత్యాల: వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిదని, తెలియకుండానే సంభవిస్తుందని, వడదెబ్బ సోకిన వారు చ ల్లని నీరు తాగుతూ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలని అంటున్నారు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారని, ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే అవకాశాలుంటాయన్నారు. వేడి గాలులకు గురైతే శరీరంలో నీటిశాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఏ సమయంలో బయటకు వెళ్లకూడదు..? బారినపడిన వారు ఎలాంటి చికిత్స పొందాలి..? వంటి అంశాలపై ‘సాక్షి’కి డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ వివరించారు.● -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను శనివారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలని, దానిని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్య ద్వారానే కుటుంబపరిస్థితులు మారిపోతాయని, విద్యకు పేద, ధనిక బేధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, విజయ్కుమార్, జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ పాల్గొన్నారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు జగిత్యాలరూరల్/మల్లాపూర్ భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి మేలు చేస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలో జగిత్యాల అర్బన్, రూరల్ మండలం, మల్లాపూర్ మండలంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. పారదర్శకత జవాబుదారీతనంతో పని చేసేలా చట్టాన్ని రూపొందించిందన్నారు. రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు అప్పీల్ వ్యవస్థకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, మల్లాపూర్లో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, ఏవో లావణ్య తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ప్రభుత్వ సహాయంజగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ప్రభుత్వ సహాయం అందిస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగిత్యాలరూరల్, అర్బన్ మండలాలకు చెందిన 93 మందికి మంజూరైన రూ.26.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 87 మందికి కల్యాణలక్ష్మి కింద మంజూరైన రూ.87 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు దుస్తులు కుట్టే మహిళా సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యత మహిళలకిచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్లు శ్రీనివాస్, రాంమోహన్, ఏపీఎం గంగాధర్, సీసీలు పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో రూ.4 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. 45 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఘనంగా మహాలింగార్చనధర్మపురి: మాస శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ధర్మపురి నృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుష సూక్తం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు. నృసింహస్వామి ఆలయానికి శనివారం ఒక్కరోజే వివిధ సేవల కింద రూ.2,84,310 ఆదాయం సమకూరింది. -
ధర్మపురి నుంచి 5 వేల మంది
పెగడపల్లి: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ధర్మపురి నియోజకవర్గం నుంచి 5 వేల మందిని తరలిస్తున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తాను గెలిచినా.. ఓడినా ప్రజల పక్షమే ఉంటున్నట్లు పేర్కొన్నారు. మండలకేంద్రంలో శనివారం బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, అన్ని రంగాల్లో దేశాన్ని ఆదర్శంగా నలిపిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు ఇప్పటికే అర్ధమయ్యాయని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వివరించారు. రజతోత్సవ సభకు దండు కట్టి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు నరేందర్రెడ్డి, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్రావు, తిరుపతి, స్వామి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సుధాకర్, రామచంద్రం, వీరేశం, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గెలిచినా.. ఓడినా ప్రజల పక్షమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ -
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
● వాస్తవాలు తెలుసుకోకుండా మెసేజ్లు వద్దు ● ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు ● జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ జగిత్యాలక్రైం: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మెసేజ్లు పెట్టే వారిపై.. వాస్తవాలు తెలుసుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రఘుచందర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజనిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయకూడదని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టును నిశితంగా పరిశీ లిస్తోందన్నారు. కొందరు విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి పాస్పోర్టులు, వీసాలు రద్దు చేయించే అవకాశం ఉందని పేర్కొన్నా రు. ఇలాంటి పోస్టులు వాట్సాప్, ఫేస్బుక్లో చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై అనుమానాలు, సందేహాలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజాభద్రత, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపేల చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. -
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే
జగిత్యాలటౌన్: తల్లిదండ్రుల సంరక్షణ వారి పిల్లలదేనని, బాధ్యతలను విస్మరిస్తే జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తామని జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ అన్నారు. శనివారం తన కా ర్యాలయంలో వయోవృద్ధుల చట్టం కింద దాఖలయిన అర్జీలను పరిశీలించారు. వృద్ధుల వారసులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెగడపల్లి మండలం నామాపూర్కు చెందిన నల్ల రాజిరెడ్డి, గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన ఈర్తి రాయమల్లు, మల్లన్నపేటకు చెందిన గుండేటి రాజేశ్వరి, జిల్లాకేంద్రంలోని వాణినగర్కు చెందిన పల్లికొండ లక్ష్మి ఫిర్యాదులపై ఆర్డీ వో వి చారణ చేపట్టారు. తల్లిదండ్రుల సంక్షేమాన్ని వి స్మరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకుంటే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏఓ తఫజుల్ హుస్సేన్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి అశోక్కుమార్, ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, నక్క ఇందయ్య, చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, ఎఫ్ఆర్ఓ కొండయ్య పాల్గొన్నారు. ● జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ -
ఉగ్రవాదుల దాడి మృతులకు నివాళి
జగిత్యాలటౌన్: ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి జిల్లా మహిళా ఐక్యవేదిక నాయకులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో నివాళులర్పించారు. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తేనే భారత్లో శాంతి నెలకొంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకై నా మహిళా లోకం పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అరవ లక్ష్మి, వేముల మాధవి, భీమనాతిని ఉమాదేవి, మీనాక్షి, సింగం పద్మ తదితరులు ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ను మట్టుపెట్టాలని భారత్ సురక్షా సమితి నాయకులు ఏసీఎస్ రాజు కోరారు. ప్రధాని మోదీ తలచుకుంటే పాక్ కనుమరుగు కావడం ఎంతో దూరంలో లేదన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్క్రైం: రెండు వేర్వేరు దొంగతనం ఘటనల్లో నిందితులను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా.. వారి నుంచి 250 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీపీ గౌస్ ఆలం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు ఘటనల్లో నిందితుల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వన్టౌన్ పరిధిలోని బస్టాండులో చిగురుమామిడి మండలం నవాబ్పేటకు చెందిన కంది సంపత్రెడ్డి(48) ఫిబ్రవరి 14న ఒక మహిళ బ్యాగు నుంచి 16.5 తులాల బంగారం, ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండుకు వచ్చి ఒక మహిళ బ్యాగు నుంచి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న ఒక వృద్ధుడి బ్యాగు నుంచి రూ.13లక్షలు దొంగిలించాడు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంపత్రెడ్డిని కమాన్ చౌరస్తా వద్ద సీఐ కోటేశ్వర్ బృందం పట్టుకొని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 150 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కరీంనగర్ టూటౌన్ పరిధిలో ఈనెల 13న సప్తగిరికాలనీలో ఒక ఇంట్లోకి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం అశోక్నగర్క్ చెందిన సూర రవి(35) అనే నిందితుడు చొరబడి 175 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.35వేల నగదు అపహరించుకుపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు రవిని పద్మనగర్ చౌరస్తా వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్, సృజన్రెడ్డి, సీసీఎస్ సీఐ బొల్లం రమేశ్ పాల్గొన్నారు. సిబ్బంది కుమార్, అనిల్రెడ్డి, సురేందర్పాల్, మల్లయ్య, సాయికుమార్తోపాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. -
సలుపుతున్న రాచపుండు!
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ‘ఆరోగ్య మహిళ’ వరం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు కేన్సర్ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. – డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో శరీరంలో వ్యాధి నిరోరధకశక్తిపై తీవ్రప్రభావం చూపి కొన్ని రకాల హర్మోన్లు లోపిస్తాయి. దీంతో కూడా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో వినియోగం ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బీడీ, సిగరేట్తోపాటు నాన్ స్మోకింగ్ టొబాకోలో పాన్ మసాలా, తంబాకు, గుట్కా, ఖైనీ తినడం, ఆల్కహాల్ తాగడం వంటివి కారణమవుతున్నాయి. పొగాకు 14 రకాల కేన్సర్లకు కారణమవుతోంది. దీని పొగలో కనీసం 80 రకాల కేన్సర్ కారకాలు(కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. రక్త ప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా విస్తరిస్తాయి. అందుకే ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లు మాత్రమే కాకుండా ఇతర రకాలు కూడా వస్తాయి. మహిళలు బాధితులవడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా కరీంనగర్ జిల్లాలో వందల మంది కేన్సర్తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవనశైలిలో మార్పుతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో నోటి, వివిధ రకాల కేన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉన్నాయి.కేన్సర్ దరిచేరకుండా వ్యాక్సిన్(టీకా) అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు హెచ్పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ లక్ష మంది మహిళల్లో 35 మంది రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. జన్యులోపాలు, వంశపారంపర్యం, ఇన్ఫెక్షన్లు, రొమ్ములో గడ్డలు ఏర్పడడం, ఆధునిక జీవనశైలి, సంతానలేమి, 12 ఏళ్లలోపు రజస్వల అవడం, 55 ఏళ్ల కన్నా ముందుగానే రుతుక్రమం ఆగిపోవడం ఇందుకు కారణం. వ్యాధి నిర్ధారణ పద్ధతులున్నా అవగాహన లేక చివరిదశలో బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. నోటి, రొమ్ము, సర్విక్ కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్లో రక్తం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఒక్కసారిగా బరువు తగ్గితే.. సర్విక్ కేన్సర్గా భావించి హెచ్పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడంతో ముందస్తుగా కేన్సర్ను గుర్తించే వీలుంటుంది. నోటి ఆల్సర్లు, దగ్గితే రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి కేన్సర్ పరీక్ష చేయించాలి. ఒత్తిడితో ప్రమాదమే.. నోటి కేన్సర్కు కారణాలు..జీవనశైలిలో మార్పులు..అందుబాటులో టీకా..రొమ్ము కేన్సర్కు..ఇలా గుర్తించండి.. -
కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, సూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు వినోద్ నేగి తెలిపారు. అలాగే ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కార్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్ కత్తా బ్యాగులు, ఒడిస్సా పెయింటింగ్స్ , మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్ కోటా బాందేజన్, బ్లాక్ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నొవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
21 రోజుల్లో ముగ్గురి మృతి
● రాచర్లబొప్పాపూర్లోని ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ● ఒంటరివారైన తల్లీకొడుకులుఎల్లారెడ్డిపేట(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో ఆ కుటుంబంలో 21 రోజులుగా విషాదచాయలు వీడడం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గడ్డి నర్సయ్య, ఆయన కుమారుడు నరేందర్, తల్లి ఎల్లవ్వ మరణాలతో నర్సయ్య భార్య, కొడుకు ఒంటరివారయ్యారు. మూడు వారాల్లోనే ముగ్గురు రాచర్లబొప్పాపూర్కు చెందిన గడ్డి నర్సయ్య(55) తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఏప్రిల్ 3వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. అతని చిన్న కొడుకు నరేందర్(23) ఓ మహిళతో ప్రేమలో పడి, 45 రోజులు జైలు జీవితం గడిపాడు. తండ్రి చనిపోవడంతో బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి మృతికి సదరు మహిళే కారణమంటూ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈనెల 22న ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్ల ముందే కన్నకొడుకు, మనుమడు మృతిచెందడంతో నర్సయ్య తల్లి గడ్డి ఎల్లవ్వ(80) తీవ్ర మనోవేదనకు గురైంది. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. వారి కుటుంబంలో 21 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మరణించడం కలచివేసింది. ప్రస్తుతం వారి కుటుంబంలో నర్సయ్య భార్య, కొడుకు ఒంట రివారయ్యారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
‘ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ’ పర్యటన
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్ భూములను ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు శుక్రవారం పర్యటించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని వారు సందర్శించారు. గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని రైల్వేట్రాక్, రాజీవ్ రోడ్డు కనెక్టివిటీ, ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి బసంత్నగర్ ఎయిర్పోర్టు భూములు పరిశీలించారు. అయితే, ఎయిర్పోర్టు నిర్మాణం ఎంతోఅవసరం కాగా, అంతర్గాం, బసంత్నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతోపాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ ఏడీఈ శ్రీనివాస్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్పటేల్ తదితరులు ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉరేసుకుని ఆర్ఎంపీ ఆత్మహత్యమేడిపల్లి: మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సాంబారు జగదీశ్(44) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీశ్ మూడేళ్లనుంచి తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయిన మెడ నొప్పి తగ్గ్గలేదు. ఆపరేషన్ కోసం రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయాడు. జగదీశ్కు భార్య రూప, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
పలువురు జడ్జీల బదిలీ
జగిత్యాలజోన్: జిల్లాలోని పలు కోర్టుల్లో జడ్జీ లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల మొదటి అదనపు జడ్జిగా కొనసాగుతున్న తౌటం జితేందర్ను సిద్దిపేట జిల్లా దుబ్బాకకు, జగిత్యాల రెండో అదనపు జడ్జిగా పనిచేస్తున్న జడ వినీల్కుమార్ను కామారెడ్డి జిల్లా బిచ్కొండకు, ధర్మపురి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న పి.శ్యాం ప్రసాద్ను హైదరాబాద్ ఆరోమెట్రోపాలిన్కు జగిత్యాల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్ను జగిత్యాల మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా బదిలీ చేశారు. మేడ్చల్ మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న ఆర్.లావణ్యను జగిత్యాల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా, వనపర్తి రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న యేగి జానకిని ధర్మపురికి బదిలీ చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలుపెగడపల్లి: ఉపాధిహామీ పథకంలో ప్రతీ కూలికి పని కల్పించాలని డీఆర్డీవో రఘువరన్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మస్టర్లో కూలీల నుంచి సేకరించిన సంతకాల్లో తేడాలు కనిపించడంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మొత్తంగా రూ.63,944 వేలు దుర్విని యోగం జరిగినట్లు గుర్తించారు. ఎఫ్ఏల నుంచి రూ.15,673, పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ. 17,175, టీఏల నుంచి రూ.26.3 20 రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ డీఆర్డీవో మధన్మోహన్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి, దేవేందర్రెడ్డి, బాలునాయక్, ఏపీవో అనిల్ పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మోతె పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 వరకు మలేరియాను నిర్మూలించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ సమియోద్ధీన్, స్వాతి, సత్యనారాయణ, శ్రీధర్, రవీందర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ధర్మపురి: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్బ్యాంకు ఎఫ్ఎల్సీ కోట మధుసుదన్ సూచించారు. మండలంలోని జైనాలో శుక్రవారం ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాలైన జన సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ నరేశ్, కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు. -
రాజ్యాంగ విలువలపై అవగాహన పెరగాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి/పెగడపల్లి: బీఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వవిప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట నుంచి రాజారం వరకు శుక్రవారం జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు ఆవశ్యకతను వివరించేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. పీసీసీ సభ్యు డు ఎస్.దినేశ్, నాయకులు వేముల రాజు, చిలు ముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, సింహరాజు ప్రసాద్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలిజగిత్యాల: అంగన్వాడీ కేంద్రంలోని సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ పక్షం, పోషణ జాతర, చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లత, సంక్షేమాధికారి నరేశ్, సీడీపీవోలు మమత, వాణిశ్రీ, వీరలక్ష్మి, మణెమ్మ పాల్గొన్నారు. సర్కారు బడులను బలోపేతం చేస్తాం సర్కారు బడులను బలోపేతం చేస్తామని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం గొల్ల పల్లె, నామాపూర్లో ప్రభుత్వ పాఠశాలల వార్షి కోత్సవ వేడుకలకు డీఈవో రాముతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఎంఈవో సులోచన, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, హెచ్ఎంలు శంకరయ్య, అనిల్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రంథాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: గ్రంథాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, తెలంగాణ భాష సాహిత్యం పునర్నిర్మాణంలో తెలంగాణ సారస్వత కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సారస్వత ప్రధాన కార్యదర్శి చెన్నయ్య మాట్లాడుతూ నిజాంకాలం నుంచే తెలుగు భాష సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించడంలో తెలంగాణ శాశ్వత పరిషత్ అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉందన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, రాబోయే తరాలకు ఈ గ్రంథం ఉపయోగపడుతుందన్నారు. డీఈవో రాము, జిల్లా సమగ్ర స్వరూం పుస్తక కో–కమిటీ సభ్యులు శరత్చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి, నాగభూషణం, కళాశాల సీపీడీసీ కార్యదర్శి శ్రీలత, అధ్యాపకులు చంద్రయ్య, వరప్రసాద్, రహీం పాల్గొన్నారు. -
నీళ్లు రాకున్నా.. బిల్లు మోత!
మెట్పల్లి: పట్టణాల్లో నల్లాల ద్వారా సరఫరా చేసే నీటికి ప్రజలు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నల్లాలు ఉండి.. నీళ్లు రాకపోయినప్పటికీ మెట్పల్లి మున్సిపాలిటీలో పలువురికి బిల్లులు రావడం విమర్శలకు దారి తీస్తోంది. మిషన్ భగీరథ కింద నల్లాలు బిగించినప్పటికీ చాలా ఇండ్లకు ఏళ్లు గడిచినా నీళ్లు రావడం లేదు. అయినా రూ.వేలల్లో బిల్లులు రావడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆన్లైన్ పేరుతో జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 వార్డులు.. 10,928 నల్లా కనెక్షన్లు మెట్పల్లి పట్టణంలో 26వార్డులు ఉండగా, 10,928 నివాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. డబ్బాలోని రిజర్వాయర్ నుంచి వచ్చే మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. ప్రతీ రోజు సుమారు 90లక్షల లీటర్లను సరఫరా చేస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో ఇంటికి నెలకు రూ.200 చొప్పున ఏడాదికి రూ.2,400 నల్లా పన్నును మున్సిపాలిటీ వసూలు చేస్తోంది. మిషన్ భగీరథ కింద రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. ఇందులో ఇప్పటికీ కొన్ని వందల కుటుంబాలకు నీళ్లు రావడం లేదు. వాళ్లందరికీ బోరు నీళ్లే దిక్కయ్యా యి. డబ్బా రిజర్వాయర్ నుంచి అవసరం మేరకు నీరు సరఫరా కాకపోతుండడంతో ఇండ్లకు నీరు అందించడం లేదు. ఆయా కుటుంబాలకు నల్లా పన్నును మాత్రం లెక్కకట్టి వేయడంతో వారంతా అందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం బాలకృష్ణనగర్వాసులు అధికారులను కలిసి తమ బిల్లుల రద్దు చేయాలని కోరగా, అప్పటి పాలకవర్గం దీనికి అమోదం తెలుపుతూ తీర్మానం చేసింది. అయినా ఇప్పటివరకు వారి బిల్లులు రద్దు కాలేదు. ప్రజల్లో అసంతృప్తి ఒత్తిడి చేయడం లేదుగతంలో కొందరి ఇళ్లలో నల్లాలు తొలగించినప్పటికీ..కొందరి ఇండ్లల్లో నల్లాలు ఉండి నీళ్లు రాకపోయినప్పటికీ బిల్లులు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం నల్లా బిల్లులన్నీ ఆన్లైన్ కావడం వల్ల వాటిని రద్దు చేయడం ఇక్కడ సాధ్యం కాదు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయాం. అలాంటి వారిని బిల్లుల కోసం ఒత్తిడి చేయడం లేదు. – నాగేశ్వర్రావు, డీఈఈ భగీరథ కింద ఇంటింటా నల్లా కనెక్షన్లు రెండేళ్లు గడిచినా సరఫరా కాని నీరు అయినా రూ.వేలల్లో బిల్లులు లబోదిబోమంటున్న ప్రజలు‘మెట్పల్లి పట్టణంలోని 19వార్డుకు చెందిన సాంబారి సుధాకర్ ఇంట్లో మిషన్ భగీరథ కింద కొంతకాలం క్రితం నల్లా బిగించారు. ఇంతవరకు దాని ద్వారా ఒక్కచుక్క నీరు రాలేదు. అయినా రూ.10వేల పైనే నల్లా బిల్లు బకాయి ఉందంటూ మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు.’‘పట్టణంలోని బాలకృష్ణనగర్ శివారులో ఉన్న 27 ఇండ్లకు భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ నీళ్లు మాత్రం రావడం లేదు. అయినప్పటికీ వారందరికీ రూ.వేలల్లో బిల్లులు రావడంతో ఖంగుతిన్నారు. అధికారులను కలిసి విన్నవించుకున్నప్పటికీ అవి రద్దు కాలేదు.’జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా మెట్పల్లిలో నల్లా బిల్లు అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగతా మున్సిపాలిటీల్లో నెలకు రూ.100 చొప్పున వసూలు చేస్తుంటే..మెట్పల్లిలో మాత్రం రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదాయం పెంచుకునే క్రమంలో పాలకవర్గం అమోదంతో ఈ నిర్ణయం తీసుకున్న స్థానిక అధికారుల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
రజతోత్సవ సభకు 20వేల మంది
జగిత్యాల: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి 20 వేల మంది తరలిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు రావడానికి ప్రజలు ఉత్సాహం కనబర్చుతున్నారని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వంపై విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మాజీ జెడ్పీచైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని, ప్రజలంతా రజతోత్సవ సభకు రావడానికి విరాళాలు సైతం ఇస్తున్నారన్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన అమరులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు సతీశ్, వొల్లం మల్లేశం, సమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు -
భూ భారతితో సాదాబైనామాలకు పరిష్కారం
● కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్సారంగాపూర్/కోరుట్ల రూరల్/జగిత్యాలరూరల్: సాదాబైనామాలపై కొనుగోలు చేసిన భూములకు భూ భారతిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ పేర్కొన్నారు. భూభారతిపై బీర్పూర్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు రైతులు అడిగిన భూ సమస్యల ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. మండలంలో సాదా బైనామాలపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలు సా గుతున్నాయని భూ భారతితో పూర్తిన్యాయం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నా రు. ఎస్సారెస్పీ ముంపు బాధితుల కోసం కేటాయించిన భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయని, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయని, మరికొంత మంది కొనుగోళ్లు చేసిన భూములను నోషనల్ ఖాతాలో చేర్చారని, ధరణిలో ఈ సమస్య పరిష్కారం జరగలేదని కొల్వాయి విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వీటికి భూభారతిలో పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బీర్పూర్లో రెవెన్యూ, అటవీ భూముల విషయంలో ప్రజలు, అధికారుల్లో అ యోమయం ఉందని, రైతుల రెవెన్యూ భూములను ధరణిలో అసైన్డ్ భూములుగా చూపడంతో సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నా రు. రెవెన్యూ భూములను అటవీశాఖ అటవీభూములుగా పేర్కొంటోందని, సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ముంతాజొద్దీన్, ఎంపీడీవో లచ్చాలు పాల్గొన్నారు. కోరుట్లలో... భూ భారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారులు ఇచ్చిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితుడు ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, అక్కడ కాకుంటే కలెక్టర్, ట్రిబ్యునల్కు కూడా వెళ్లే వెసులుబాటు ఉందన్నారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. సెంటర్లలో అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలన్నారు. ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ సెట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు. -
ఒకే రోజు ఆరు అగ్నిప్రమాదాలు
కరీంనగర్క్రైం: జిల్లాలో మొత్తం ఆరు అగ్రిప్రమాదాలు సంభవించాయి. వెంటవెంటనే జరిగిన ఆరు అగ్ని ప్రమాదాలు ఫైర్ అధికారులను ఊపిరిపీల్చుకోనివ్వలేదు. మండుటెండలకు విపరీతమైన వేడితో గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన అగ్నితో శాతవాహనలో అగ్నిమంటలు చెలరేగగా వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులే ఫైర్ అధికారులకు ఫోన్ చేశారు. డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ ఫైరింజిన్ శాతవాహన యూనివర్సిటీకి చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమవగా గాలికి మంటలు ఎక్కువ అవడంతో మానకొండూర్ నుంచి ఫైరింజిన్ను పిలిపించారు. కరీంనగర్, మానకొండూర్ ఫైర్ అధికారులు రాజ్కుమార్, భూదయ్యలు సిబ్బందితో కలిసి రాత్రి వరకు శాతవాహనలో పొగలురావడంతో అక్కడే ఫైరింజన్ల సహాయంతో సేవలు అందించారు. ● ఇవే మంటలకు చెందిన పొగలు కొత్తపల్లి పోలీస్స్టేషన్ వద్దకు రావడంతో అప్రమత్తమైన ట్రైనీ ఐపీఎస్ వసుంధరాయాదవ్ ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే చేరుకొని అక్కడ విధులు నిర్వహించి మంటలు ఎగిసిపడకుండా చర్యలు చేపట్టారు. ఈప్రమాదంలో శాతవాహనలో వివిధ రకాల చెట్లు కాలిపోయాయి. ● పద్మనగర్లోని వ్యవసాయ కేంద్రం వెనుక నుంచి ప్రారంభమైన మంటలు యూనివర్సిటీ వైపు రావడంతో అక్కడి వైపు నుండి కూడా పొగమంటలు పెద్ద ఎత్తున రావడంతో వేములవాడకు చెందిన ఫైర్ ఇంజన్ పిలిపించారు. ● శాతవాహన యూనివర్సిటీ గేటువద్ద ఒక సానిటరీ షాపులో షాట్సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని వెంటనే యూనివర్సిటీలో సేవలందిస్తున్న మానకొండూర్ ఫైర్ ఇంజన్ను పంపించి అక్కడ మంటలను ఆర్పారు. ● కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద గల ఐటీ టవర్ వెనక ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫోన్ చేయగా చొప్పదండి ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు. ● నాగులమల్యాలలోని ఇండ్ల పక్కన గల ఖాళీ ప్రదేశంలో మంటలు చెలరేగడంతో వేములవాడ ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పారు. శాతవాహనలో పెద్ద ఎత్తున మంటలు రాత్రి వరకు సేవలందించిన నాలుగు స్టేషన్ల ఫైర్ సిబ్బంది -
పంచాయతీ కార్యదర్శి కథ సుఖాంతం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ నాయకుల వేధింపులతో అదృశ్యమైన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రియాంక ఆచూకీ కడప జిల్లాలో లభ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా గురువారం ఉదయం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ప్రియాంక తనగోడును పోలీసుల ఎదుట వెల్లబోసుకుంది. ఇప్పటికే సిరిసిల్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదుకాగా.. దర్యాప్తు జరుగుతోంది. ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు క్రీదాది మల్లేశ్బాబు, గుగ్గిళ్ల శ్రీకాంత్గౌడ్ మూలంగా తాను మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొంది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగా పంచాయతీ కార్యదర్శి అదృశ్యం అవడంపై స్టేట్ ఇంటలిజెన్స్ అధికారులు రిపోర్టు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంధించినట్లు తెలుస్తోంది. సదురు కాంగ్రెస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిరిసిల్లకు చేరిన కార్యదర్శి ప్రియాంక టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరు -
ఒకే ఇల్లు.. ఒకే వంట
బలం..బలగం ● ఇంటిపెద్ద మాటకు కట్టుబడి ● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ ● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలుఉమ్మడి కుటుంబమంటే కొండంత బలం. ఏ ఆపదొ చ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది.. ప్రస్తుత ఉరుకులు పరుగు ల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరుకుంపటి వ్యవస్థ పె రుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరిదారి వారి దే.. అయినా కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంటి పెద్దల మాటకు కట్టుబడి, విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబమే కొండంత అండా అన్నట్టు ఆదర్శంగా నిలుస్తున్నారు. – కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్కాలనీ/ వేములవాడ/ముత్తారం/మల్యాలఉప్పుల జాయింట్ ఫ్యామిలీ వారిది నిరుపేద వైశ్య కుటుంబం. అయినా బంధాలు, బంధుత్వాలను గౌరవిస్తారు. ముందునుంచి హోటల్ నడుపుకుంటూ జీవించే వసుధైక కుటుంబం. ప్రస్తుతం టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పెంకుటింట్లో ఇరుకై న గదుల్లోనే వీరంతా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్వీధిలో ఉంటున్న ఉప్పుల శ్రీరాములు– జయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. కొడుకులు, కోడళ్లు కలిసే ఉంటున్నారు. ఇందులో శ్రీరాములు ఇటీవలే మరణించారు. వీరితోపాటు ఇద్దరు కూతుళ్లు ఇక్కడే ఉంటున్నారు. మిగతా ఐదుగురు కూతుళ్లు తమతమ అత్తావారిళ్లలో ఉంటున్నారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఈ ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సమష్టి కృషి నాకు 13 ఏళ్లకే పెళ్లయింది. నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశా ం. ఇప్పటి వరకు ఉమ్మడిగానే ఉంటున్నాం. కుటుంబ సభ్యులమంతా సమష్టిగా కృషి చే స్తూ కాలం వెల్లదీస్తున్నాం. చిన్నపాటి ఇళ్లయినా అనురాగాలు, ఆప్యాయతల మధ్య సంతో షంగా గడుపుతున్నాం. ఇప్పటికీ నా కొడుకులు, కోడళ్లు మా మాటను జవదాటరు. ఉమ్మ డి కుటుంబంతో ఎన్నో లాభాలు ఉంటాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనువలు, మనుమరాళ్లు, మునిమనువలు మొత్తం 44 మంది అయ్యాం. కానీ, నేటి తరం పెళ్లి కా గానే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వేరు సంసారాలు పెడుతున్నారు. ఇది మన సంప్రదాయం కాదు. – ఉప్పుల జయలక్ష్మి, కుటుంబ పెద్ద -
చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై..
జగిత్యాలక్రైం: తన నానమ్మ కర్మకాండ చేసేందుకు వెళ్లి చింతకుంట చెరువులో గల్లంతైన నీలి మల్లికార్జున్ (30) శవమై తేలాడు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ బుధవారం ఉదయం తన నానమ్మ కర్మకాండ చేసేందుకు చింతకుంట శ్మశాన వాటికకు వెళ్లాడు. కర్మకాండ పూర్తయిన తర్వాత చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు గాలించినా మృతదేహం లభ్యం కాలేదు. గురువారం ఉదయం శవమై కనిపించాడు. మృతుడి తల్లి మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై మన్మథరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంమల్యాల(చొప్పదండి): మండలంలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం (75) కనిపించినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిసారంగాపూర్: మండలంలోని కోనాపూర్ శివారు ఎల్లమ్మ గుడి సమీపంలో గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి, గ్రామస్తుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన బేతి మధు (30) గుల్లపేటలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తిరిగి బాలపల్లి బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో గుల్లపేటకు చెందిన జగదీష్, రాజిరెడ్డి పొరండ్ల వెళ్లి బైక్పై గుల్లపేటకు వెళ్తున్నారు. ఎల్లమ్మ ఆలయం వద్ద మధు, జగదీశ్ వాహనాలు ఢీకొనడంతో మధు అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డి, జగదీశ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జగదీశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించారు. ఆన్లైన్ షాపింగ్లో మోసంసిరిసిల్లక్రైం: కుటుంబ అవసరాల కోసం ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు ప్రయత్నించగా రూ.2లక్షలు మోసపోయారు. ఈ మేరకు సిరిసిల్లటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన పూస శ్రీనివాస్ తన గృహ అవసరాల కోసం ఆన్లైన్లో కొన్ని వస్తువులను కొనేందుకు క్రెడిట్కార్డ్ నంబర్లను ఎంటర్ చేశాడు. సీవీఈవ పిన్ ఎంటర్ చేయగానే కార్డులో ఉన్న డబ్బులు తన ఆధీనంలో లేకుండానే పోవడం గమనించాడు. ఇలా రూ.2లక్షలు ఖాతా నుంచి పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కండుపులోంచి రెండు కిలోల కంతీ తొలగింపు
కోల్సిటీ(రామగుండం): తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మ హిళకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యబృందం మెరుగైన శస్త్రచికిత్సలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆపరేషన్ చేయడం రిస్క్ అని తెలిసీ కూడా గురువారం ఆ మహిళకు ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. గైనిక్ విభాగం ప్రొఫెసర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. 10 రోజుల క్రితం పాలకుర్తి మండలం ఎల్కపల్లికి చెందిన హేమలత కడుపునొప్పి, రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. అడ్మింట్ చేసుకొని పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో కంతీ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు అప్పటికే రెండు పెద్దాపరేషన్లు కూడా జరిగాయి. ఇలాంటి రిస్క్ కండీషన్లో పేషెంట్కు ఆపరేషన్ చేయడం సవాల్గా మారింది. యూరాలజిస్టు నిషాంత్, సర్జన్ దామెర అనిల్కుమార్ తొలత అవసరమైన అన్ని వైద్య పరీక్షలు, ప్రొసిజర్లు పూర్తి చేసిన అనంతరం పేషెంట్కు గురువారం గైనిక్ హెచ్ఓడీ అరుణ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి, అనస్తీషియా నిపుణులు ప్రశాంత్తోపాటు మిగితా వైద్య బృందం జ్యోతి, శ్రవంతి సక్సెస్గా ఆపరేషన్ నిర్వహించారు. ఆమె కడుపులోంచి రెండు కిలోల బరువు ఉన్న కంతీని తొలగించారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ అభినందించారు. జీజీహెచ్లో మెరుగైన శస్త్ర చికిత్స -
ఎక్కడి పనులు అక్కడే..
● ఈచిత్రంలో కనిపిస్తున్నది సమీకృత మార్కెట్ భవనం. వెజ్, నాన్వెజ్ విక్రయాలు అన్నీ ఒకేచోట సాగేలా ఖాదీ ప్రతిష్ఠాన్కు చెందిన స్థలంలో మూడేళ్ల క్రితం దీనిని నిర్మాణం చేపట్టారు. ఏడాదిన్నర క్రితం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులు నత్తే నయమన్నట్లుగా సా..గుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా మొదలు పెట్టిన పలు పనులు.. అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. తిరిగి వాటిని పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. వీటిని పూర్తి చేసే విషయంలో ప్రభుత్వాలు వ్యవహారిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రాక..నిధులు సరిపోక.. ● మౌలిక వసతులను కల్పించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లాది నిధులు మంజూరు చేసింది. ● ఆ నిధులతో చేపట్టిన సమీకృత మార్కెట్, షాదీఖానా, ప్రభుత్వాసుపత్రి, జూనియర్ కళాశాల, ఉర్దూ ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్ల భవనాల పనులు కొంతవరకు పూర్తయ్యాయి. ● వీటిలో కొన్నింటికి సంబంధించి బిల్లులను నాటి ప్రభుత్వం నుంచి రాకపోవడం.. మరికొన్నింటికి కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసినట్లు తెలిసింది. ● అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించలేదు. దీనివల్ల ఆ పనులు ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కావడం లేదు. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సంజయ్ ● పెండింగ్లో ఉన్న పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకపోయారు. ● సమీకృత మార్కెట్తో పాటు ఆసుపత్రి, విద్యా సంస్ధల భవనాల పనులు నిధుల కొరత వల్ల చాలా కాలంగా నిలిచిపోయాయని, వెంటనే వాటికి నిధులను మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ● కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ ఒక్కదానికి కూడా నిధులను మంజూరు చేయకపోవడం గమనార్హం. వసతులు లేక తప్పని తిప్పలు ● ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి నిర్వహిస్తున్న పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. మరోవైపు అందులో ఉన్న గదులు సరిపోక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● కూరగాయల విక్రయాలకు ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రహదారులకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లోనే అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు. ● ఉర్దూ ఉన్నత పాఠశాల కొత్త భవన పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గదులు సరిపోక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ● షాదీఖానా పూర్తయితే పేద ముస్లింలు శుభకార్యాలు, ఇతరత్రా జరుపుకోవడానికి ఎంతో ఉపయోగపడుతోంది. కానీ ఇది పూర్తికాక ఏళ్లుగా వారికి నిరాశే ఎదురవుతోంది. ఇది పట్టణంలోని బీడీ కాలనీలో నిర్మిస్తున్న షాదీఖానా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో దీనికి అవసరమైన స్థలం కేటాయించారు. తర్వాత 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేసింది. కానీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. -
ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టాలి
ధర్మపురి: జమ్మూకాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలంటే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా కేంద్రప్రభుత్వ చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంతాప సభ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది మృతి చెందడం.. మరో 20 మంది వరకు గాయపడడం కలచివేస్తోందని తెలి పారు. భవిష్యత్తులో ఏ ఒక్క టెర్రరిస్టు కూడా దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకుండా కేంద్రం చర్యలు చేపట్టాలని, అందుకు అండగా ఉంటామని వివరించారు. నాయకులు వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, కుంట సుధాకర్, గడ్డం భాస్కర్రెడ్డి, సింహరాజు ప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
మామిడి మార్కెట్లో అవకతవకలు
● పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి ● డీఎంవోను ప్రాసిక్యూట్ చేయాలి ● మాజీ మంత్రి జీవన్రెడ్డిజగిత్యాలటౌన్: మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మార్కెటింగ్ శాఖ కనుసన్నల్లో జరగాల్సిన ఓపెన్ యాక్షన్ ట్రేడర్ల ఇష్టారాజ్యంగా మారిందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. ట్రేడ ర్ల చేతిలో రైతులు నష్టపోతున్నా పట్టించుకోని జిల్లా మార్కెటింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, పదేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్న అతడిని వెంటనే బదిలీ చేయాలని సూచించారు. మామిడి రైతులు నష్టపోతున్నా నిబంధనలు అమలు చేయడంలో విఫలమవుతున్న సదరు అధికారిని విచారణ చేపట్టాలన్నారు. ఈ మేరకు కలెక్టర్కు లేఖ రాశారు. సూట్ పేరుతో 5శాతం తరుగు, రాట్ గ్రేడింగ్ పేరుతో మరో 5శాతం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షించినట్లుగానే మామిడి కొనగోళ్లపైనా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు. ప్రతి ట్రేడర్ బహిరంగ వేలం ద్వారానే మామిడి కొనాలన్న మార్కెటింగ్ శాఖ నిబంధన అమలు చేయాలన్నారు. 4శాతానికి కంటే ఎక్కువ మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తూ రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, రాజేందర్, రాజేందర్, మహ్మద్ భారీ, మన్సూర్, గుంటి జగదీశ్వర్, రఘువీర్గౌడ్, మధు పాల్గొన్నారు. -
ఠారెత్తిస్తున్న ఎండలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గురువా రం భానుడు తన ఉగ్రరూపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఎండపల్లి మండలం మారేడుపల్లిలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, గొల్లపల్లి, మల్లాపూర్, మల్లాపూర్ మండలం రాఘవపే ట, వెల్గటూర్లో 44.8, బీర్పూర్ మండలం కొల్వాయి, బుగ్గారం మండలం సిరికొండలో 44.7, ధర్మపురి మండలం జైన, ఇబ్రహీంపట్నం గోధూర్లో 44.6, పెగడపల్లి, కోరుట్ల మండలం అయిలాపూర్, సారంగాపూర్లో 44.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. ● 45 డిగ్రీల సెల్సియస్గా నమోదు -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాలజోన్: కక్షిదారుల కేసులు సత్వరం పరిష్కరించి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. పద్మావతికి జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు బెంచ్కు న్యాయవాదులు సహకరించాలని న్యాయమూర్తి కోరారు. పెండింగ్ కేసుల సంఖ్యను వీలైనంతమేర తగ్గించేందుకు ప్రయత్నిద్దామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, సబ్ జడ్జి శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, మొదటి, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు జితేందర్, వినీల్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడి దురదృష్టకరం ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల:జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడి దురదృష్టకరమని, హంతకులను ఉపేక్షించవద్దని, కఠినంగా శిక్షించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి మోతెలోని పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు జ్యోతి, గిరి నాగభూషణం, హన్మండ్లు పాల్గొన్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయొద్దుకథలాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని డీఆర్డీవో రఘువరణ్ సెర్ప్ సిబ్బందికి సూచించారు. మండలంలోని దూలూర్, తాండ్య్రాల, బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. తేమశాతం పరిశీలించి వెంటనే తూకం వేయించాలన్నారు. ఆయన వెంట ఏపీఎం నరహరి, సీసీలు విజయనిర్మల, రాజేందర్ ఉన్నారు. ఒకే విద్యార్థి.. ఏడుగురు సిబ్బందిమెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా.. గురువారం గణితం పరీక్ష జరిగింది. ఉదయం రెగ్యులర్, మధ్యాహ్నం సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రాయగా.. ఏడుగురు సిబ్బంది విధులు నిర్వర్తించారు. మెట్పల్లి మున్సిపల్ బడ్జెట్ రూ.22.85కోట్లుమెట్పల్లి: 2025–26 ఆర్థి సంవత్సరానికిగాను మెట్పల్లి బల్దియా రూ.22కోట్ల 85లక్షల 94వేలతో రూపొందించిన బడ్జెట్ను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆమోదించారు. ప్రారంభ నిలువ రూ.13.29లక్షలు, అంచనా ఆదాయం వివిధ గ్రాంట్స్తో కలుపుకొని రూ.22కోట్ల 72లక్షల 65వేలతో బడ్జెట్ను రూపొందించారు. ఇందులో వేతనాలకు రూ.4.65కోట్లు, శానిటేషన్ నిర్వాహణకు రూ.కోటి 29లక్షల 60వేలు, గ్రీన్ బడ్జెట్కు రూ.కోటి 3లక్షలు, కరెంట్ బిల్లులకు రూ.1.80కోట్లు కేటాయించారు. -
‘మత్తు’తో నైతిక విలువల పతనం
● ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలఅగ్రికల్చర్: మత్తు పదార్థాల వినియోగంతో నైతిక విలువలు పతనం అవుతున్నాయని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. పొలాస వ్యవసాయ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మత్తుబారిన పడొద్దని సూచించారు. ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్ ఆవిష్కరించారు. వ్యవసాయ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమం కో–ఆర్డినేటర్ పర్లపల్లి రాజు, సీఐలు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలి జగిత్యాలక్రైం: సమస్యలు వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలని ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మానసిక నిపుణులు అశోక్కుమార్ మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మానసికంగా ఆరోగ్యం ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది వివిధ మానసిక ఒత్తిళ్లపై అశోక్కుమార్ అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు కిరణ్కుమార్, వేణు, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్, రఫీక్ఖాన్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
భూభారతితో సాదాబైనామాలకు పరిష్కారం
మల్యాల: భూ భారతి చట్టంతో సాదాబైనామాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో భూభారతి చట్టంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి అవగాహన కల్పించారు. చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెండింగ్ సాదాబైనామాల పరిష్కారానికి భూ భారతి చట్టం సెక్షన్–6 కింద ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగించిందన్నారు. అధికారులు ఇచ్చిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశముందన్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేపట్టి, రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తిచేయకుంటే ఆటోమెటిక్గా పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతితో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీఓ స్వాతి, ఏఎంసీ చైర్మన్, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన అనంతరం కలెక్టర్ నూకపల్లి, బల్వంతాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనాలన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు జగిత్యాల: భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. భూభారతి చట్టంపై కొడిమ్యాల మండలం పూడూరులో అవగాహన కల్పించారు. ఏ సమస్యలైనా ఇక్కడే పరిష్కరించుకోవచ్చని సూచించారు. ● కలెక్టర్ బి.సత్యప్రసాద్ -
ఒకే వంట
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఒకే ఇల్లు..బలం.. బలగం ● ఇంటి పెద్ద మాటకు కట్టుబడి ● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ ● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలుభీమనాతి బలగంఉమ్మడి కుటుంబం.. జీవిత పాఠం.. అలాంటి కుటుంబాల్లో భావోద్వేగాలకు..ఆప్యాయతలకు చోటుంటుంది. ఏది మంచో.. ఏది చెడో బాల్యం నుంచే చిన్నారులకు చెప్పే వారుంటారు. నీతి కథలు.. పెద్దల అనుభవాలు జీవిత పాఠాలుగా ఉపయోగపడుతాయి. ఏ ఆపదొచ్చినా.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరు కాపురాల సంఖ్య పెరుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరి దారి వారిదే.. ఇలాంటి రోజుల్లో కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. విభేదాలు లేకుండా క లిసిమెలిసి ఉంటున్నారు. అలాంటి వారిపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.. – కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్కాలనీ వేములవాడ/ముత్తారం/మల్యాలతరతరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కాలం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కుటుంబం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముంటోంది. కుటుంబ పెద్ద భీమనాతి కాంతయ్య–గంగుబాయి దంపతులకు ఒక కుమార్తె, ఆరుగురు కుమారులు. భీమనాతి శ్రీనివాస్, వేణుగోపాల్, జనార్దన్, శ్రీధర్, దామోదర్, సాయికృష్ణ. కాంతయ్య ఇటీవల మృతిచెందినా ఆయన కొడుకులు తల్లి గంగుబాయితో కలిసే ఉంటున్నారు. వారసత్వంగా వస్తున్న ఐరన్హార్ట్వేర్ వ్యాపారంలో వీరంతా స్థిరపడ్డారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. తల్లి గంగుబాయితో కలిసి కొడుకులు–కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా 27 మంది ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండటమే కాదు.. ఒకే వంట కావడం విశేషం. రోజూ చిన్నపాటి ఫంక్షన్ తీరుగా ఇల్లంతా పెద్దలతో పాటు పిల్లాపాపలతో కళకళలాడుతుంది. తరతరాలుగా ఈ కుటుంబం ఉమ్మడిగా కాలం గడపటం నిజంగా ఈ కాలంలో ఓ వింతగానే తోస్తోంది. – వివరాలు 10లోuన్యూస్రీల్ -
అందరూ ఒకే ఇంట్లో..
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని అట్ల భూమవ్వ–అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్రెడ్డి. తండ్రి కొద్ది రో జుల క్రితం మృతిచెందాడు. అ న్నదమ్ములు ఎవరి పనులు వారు చే సుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. తిరుపతిరెడ్డి–గాయత్రి దపంతుల కు ఇద్దరు కుమారులు అభినయ్, కార్తీక్రెడ్డి. శ్రీనివాస్రెడ్డి– సంధ్యకు ఇద్దరు కుమారులు అక్షిత్, జశ్వంత్. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఉమ్మడిగానే సాగు చేస్తున్నారు. పిల్లల చదువులుసైతం ఉ మ్మడిగానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ పండుగే.. నా కొడుకులు ఎవరి పనులకు వారు వెళ్తారు. కోడళ్లు ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు చేతనైనంత ఇంటి పనుల్లో సాయం చేస్తుంటా. కొడుకులు, కోడళ్లు, మనుమళ్లతో కలిసి ఉంటే రోజూ పండుగ వాతావరణం ఉంటుంది. – అట్ల భూమవ్వ, తాటిపల్లి -
రెండు దశాబ్దాలుగా..
రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ హనుమాన్నగర్కు చెందిన బైరి రాజేశం–జయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికి పెళ్లిళ్లయ్యాయి. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లతో కలిసి రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు. అంతా కలిసి పండుగలను సంతోషంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, ఎమ్మెస్సీ బీఎడ్ చదివి ప్రైవేట్ టీచర్గా పని చేశారు. కరోనాతో స్కూల్ మూతపడడంతో ప్రస్తుతం యైటింక్లయిన్కాలనీలో నాగరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కిరాణం షాపు పెట్టుకుని ముగ్గురన్నదమ్ములు నాగరాజు, ప్రవీణ్కుమార్, సుమన్కుమార్ చుసుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటేనే ఆనందం ఉంటుందని రాజేశం పేర్కొన్నారు. -
అత్తాకోడళ్లు కాదు.. తల్లీకూతుళ్లు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెల్పూ రి రాజమ్మ– రాములుది ఆదర్శ ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనోన్యత చాటే తోడికోడళ్లు. అత్త సారథ్యంలో కుటుంబ నిర్వహణ. తల్లీకూతుళ్ల వలె కలిసిమెలిసి ఉంటారు. వైషామ్యాలకు తావులేకుండా పండంటి కా పురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు సరిత, అంజలి, గాయత్రి, అంజలి. సరిత భర్త ఓదెలు, అంజలి భ ర్త గట్టయ్య, గాయత్రి భర్త రాజమౌళి, అంజలి భర్త లింగమూర్తి. అన్నదమ్ములందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలు సాయితేజ, సిందూజ, అమూల్య, అక్షిత, రేవంత్, రుత్విక్, రిషిత, కార్తీకేయ. ఇక ఆడబిడ్డలు శంకరమ్మ– శంకరయ్య, లక్ష్మీకాంత– రవి. వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఆడబిడ్డ కుమారుడైన లవకుమార్కు సిందూజతో వివాహం జరిగింది. ఆడబిడ్డలు, కూతురు వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లును చూసి ఆదర్శవంతమైన కుటుంబం అని గ్రామస్తులు కితాబునిస్తారు. -
జిల్లాకు 12 మంది హెడ్కానిస్టేబుళ్లు
జగిత్యాలక్రైం: మల్టీజోన్–1లో పనిచేస్తున్న 28 మంది కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్–1 ఇన్చార్జి, మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక కానిస్టేబుల్కు హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి రాగా.. 12 మంది ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. జగిత్యాలకు చెందిన వెంకటేశంకు హెడ్గా పదోన్నతి వచ్చింది. అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లాకు హెడ్కానిస్టేబుళ్లుగా పి.శివాజీ, డి.వెంకటి, ఎ.వెంకటరమణ, నిజామాబాద్ నుంచి ఎస్.వేణుగోపాల్, ఎం.శంకర్రావు, ఆర్.నారాయణ, ఎండి.మహ్మద్ అలీ, ఎ.గంగాధర్, ఎ.మనోజ్, కృష్ణకుమార్, ఎస్.హరికృష్ణ రానున్నారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
26 క్రీడాంశాలు.. 889 సీట్లు
● కోచ్గా మారేందుకు కేరాఫ్ ఎన్ఎస్ ఎన్ఐఎస్ ● 26లోపు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ కరీంనగర్స్పోర్ట్స్: దేశంలో క్రీడారంగానికి పెద్దన్న ఎన్ఐఎస్. క్రీడాకారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి ఒలింపిక్స్తో పాటు ప్రపంచ క్రీడావేదికల్లో భారత పతాకం రెపరెపలాడేలా తీర్చిదిద్దుతుంది. క్రీడాకారులకు ఎన్ఐఎస్ నుంచి పిలుపువచ్చిందంటే అదృష్టమే. దేశవ్యాప్తంగా కోచ్లను తయారు చేసేందుకు ఏటా కొన్ని క్రీడాంశాల్లో నిష్ణాతులైన క్రీడాకారులకు, అర్హులైన వారికి డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. పీఈటీలుగా మారాలనుకునే వారు పీఈసెట్ రాసి ట్రైనింగ్ చేసి డీఎస్సీ ద్వారా డ్రిల్ మాస్టర్లుగా మారుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో కోచ్లుగా నియామకం కావడానికి ఈ డిప్లొమా కోర్సులు దోహదపడుతుంటాయి. 2025–26 ఏడాదికి నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 63వ డిప్లొమా బ్యాచ్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 26 క్రీడాంశాల్లో.. దేశవ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో డిప్లొమా కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంజాబ్లోని పాటియాలలో ఎన్ఎస్ ఎన్ఐఎస్ సెంటర్, బెంగళూర్లోని సాయ్ ఎన్ఎస్ఎస్సీ సెంటర్, కోల్కత్తాలోని సాయ్ ఎన్ఎస్ఈసీ సెంటర్, తిరువంతపురంలోని సాయ్ ఎల్ఎన్సీపీఈ సెంటర్లలో కోర్సుల కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 26 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. మొత్తం 785 సీట్లతో పాటు 104 అదనపు సీట్లు (ఒలింపిక్స్, ప్రపంచస్థాలో ఆడిన వారికి) కలిపి మొత్తం 889సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలు అర్చరీ(30), అథ్లెటిక్స్(75), బ్యాడ్మింటన్(20), బాస్కెట్బాల్(30), బాక్సింగ్(50), కనోయింగ్–కయాకింగ్(15), సైక్లింగ్(30), ఫెన్సింగ్(30), ఫుట్బాల్(50), జిమ్నాస్టిక్స్(20), హ్యాండ్బాల్(20), హాకీ(50), జూడో(30), కబడ్డీ(30), ఖోఖో(20), రోయింగ్ (10), షూటింగ్ (20), స్విమ్మింగ్(20), టేబుల్టెన్నిస్(40), తైక్వాండో(20), టెన్నీస్ (20), వాలీబాల్(30), వెయిట్ లిఫ్టింగ్ (30). రెజ్లింగ్(50), ఉషూ(25), యోగాసన(20) సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు... అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు ఒలింపిక్స్, ప్రపంచస్థాయి, జాతీయ స్పోర్ట్స్ ఆచీవ్మెంట్ సర్టిఫికెట్లు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయాలి. రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. సామర్థ్య పరీక్షలు పురుష, మహిళా అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్ప్రింట్, స్టాండింగ్ బ్రాడ్జంప్, షటిల్రన్, బెండ్ అండ్ రీచ్ టెస్ట్, 1600మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 26 సవరణ తేదీ ఏప్రిల్ 27,28 పరీక్ష తేదీ జూన్ 6 -
నాలుగు రోజులు ఎండలే
బయటకు వెళ్లలేని పరిస్థితి ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)మరో నాలుగు రోజులు వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వడదెబ్బతో విలవిల ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు. వాతావరణ మార్పులే కారణం వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లాకు రెడ్ అలెర్ట్ రోజురోజుకూ ఆగ్రహిస్తున్న సూర్యుడు బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్ను గత నెలలో రిమాండ్కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్ను అభినందించారు. -
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్రోడ్లోగల లో చిట్ఫండ్లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్ఫండ్పై కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్రోడ్లోగల ఓ చిట్ఫండ్లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్ఫండ్పై కేసు నమోదు చేశారు. ● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు ● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని నిర్వాహకులు ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు 19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది. చిట్స్ఫండ్స్ మోసాలు జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్డ్ చిట్స్ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్ఫండ్ కార్యాలయంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్స్ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాకట్టు వ్యాపారం జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల్లేని ఫైనాన్స్లపై చర్యలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్లు, చిట్ఫండ్స్పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్ఫండ్స్పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. -
‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
కథలాపూర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో అర్హులకే భూములు దక్కే అవకాశముందన్నారు. రికార్డుల్లో తప్పులు దొర్లితే త్వరగా సవరణ చేయొచ్చన్నారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీషా, ఏవో యోగితా, ఏఈవోలు హరీశ్, మౌనిక, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూడాలి జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అర్హత పరిశీలనపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని, ప్రతి నియోజకవర్గ గెజిటెడ్ స్పెషల్ అధికారులు మండలాల వారీగా కమిటీలు వేసి అవకతవకలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలపైన వ్యవసాయ భూమి ఉండరాదని, కారు, ప్రభుత్వ ఉద్యోగం, వలస వెళ్లిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులన్నారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మపురి: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హతులైన మృతుల కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాద ముష్కరులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందడం.. 20 మంది వరకు గాయపడడం బాధాకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి జగిత్యాల: పాకిస్థాన్ ముష్కరుల ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణరహితంగా దాడిచేసి చంపడాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఖండించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. ఉగ్రవాదుల చేతిల్లో పర్యాటకులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారిని తక్షణమే ఆదుకోవాలన్నారు. -
ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం
జగిత్యాల/మెట్పల్లి: జమ్ముకాశ్మీర్లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడిలో చనిపోయిన వారికి బీజేపీ, వీహెచ్పీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులను ఉపేక్షించొద్దన్నారు. మెట్పల్లిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్ ఉన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
● హరిత జగిత్యాల లక్ష్యం ● స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత
జగిత్యాల బల్దియా బడ్జెట్ రూ.58.41కోట్లుజగిత్యాల: జగిత్యాల హరిత లక్ష్యంగా మౌలిక సదుపాయల కల్పన, పట్టణాభివృద్ధే ధ్యేయంగా ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) సంబంధించిన మున్సిపల్ బడ్జెట్ను స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ప్రకటించారు. రూ.58.41 కోట్లతో బడ్జెట్ను ఆమోదించారు. ఇందులో గ్రీన్బడ్జెట్కు రూ.2.81 కోట్లు, పట్టణ పారిశుధ్య నిర్వహణకు రూ.2.37 కోట్లు కేటాయించారు. విలీన గ్రామాలు, వెనుకబడిన తరగతులు, ప్రాముఖ్యం కలిగిన వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. పార్క్లు, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్లు, స్ట్రీట్ వెండర్స్, జంతువధశాల, శాసీ్త్రయ పద్ధతిలో డంపింగ్యార్డు నిర్వహణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ. 3.56 కోట్లు కేటాయించారు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో వసతుల కల్పనకు రూ.1.18 కోట్లు కేటాయించారు. సమావేశంలో కమిషనర్ స్పందన పాల్గొన్నారు. రాయికల్ మున్సిపల్ బడ్జెట్ రూ.8.58 కోట్లురాయికల్: రాయికల్ బల్దియా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.8.58 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్గౌడ్ తెలిపారు. క్యాపిటల్ గ్రాంట్స్ కింద రూ.5.39 కోట్లు, జనరల్ ఫండ్ రూ.3.14 కోట్లు చార్జ్డ్ వ్యయం రూ.3.06 కోట్లకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. -
భూ భారతితో రైతులకు మేలు
● త్వరితగతిన సమస్యలు పరిష్కారం ● కొత్త చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ● కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్ సాక్షి: భూభారతి చట్టంతో ఎలాంటి ఉపయోగాలున్నాయి?కలెక్టర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం త్వరలో అమల్లోకి రాబోతోంది. ఇందులో ధరణిలో లేని పలు అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. వీటివల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సాక్షి: జిల్లా రైతులు వివిధ భూ సమస్యలపై ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏమైనా పరిష్కారమవుతున్నాయా?కలెక్టర్: భూ సమస్యల పరిష్కారంలో జగిత్యాల జిల్లా ముందంజలోనే ఉంది. ధరణిలో వచ్చిన దాదాపు సమస్యలన్నీ పూర్తయ్యాయి. భూభారతి అమల్లోకి వచ్చేలోపు ధరణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: భూ హక్కుల రికార్డుల తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చా?కలెక్టర్: భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు నూతన చట్టం వచ్చిన ఏడాదిలోపే దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆర్డీవో, తహసీల్దార్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సాక్షి: భూభారతి చట్టంపై రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?కలెక్టర్: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టం గురించి వివరిస్తున్నాం. ఈనెల 30వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై వివరిస్తున్నాం. రైతులకు అనుమానాన్ని నివృత్తి చేస్తున్నాం. సాక్షి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త చట్టంలో వాటిని పరిష్కరించే అవకాశం ఉందా? కలెక్టర్: కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: ధరణి ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే ట్రిబ్యునల్కు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు ఈ చట్టంలో అవకాశం ఉందా?కలెక్టర్: కొత్త చట్టం ప్రకారం భూ హక్కుల నిరూపణకు అవసరమైన పత్రాలు జతచేస్తే ఆర్డీవో స్థాయిలో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. సాక్షి: ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?కలెక్టర్: ఆబాది, గ్రామకంఠం వంటి భూములకు గుర్తింపు సంఖ్య ఉంటుంది. కబ్జాకు గురికాకుండా చూస్తాం. ఆధార్ కార్డు లాగే భూధార్ సంఖ్య కూడా ఇస్తాం. సాక్షి: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా?కలెక్టర్: వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. ఈ చట్టం ద్వారా నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్గా మ్యుటేషన్ అయిపోతుంది. ఈ చట్టంలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. సాక్షి: జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించే అవకాశాలున్నాయి?కలెక్టర్: రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా దరఖాస్తు చేసుకుంటే ఆర్డీవో, తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఈ అవకాశం లేదు. సాక్షి: చాలామంది రైతులకు పట్టాదారు పాస్బుక్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నా రాలేదు. ఈ చట్టంలో వచ్చే అవకాశాలున్నాయా..?కలెక్టర్: పట్టాదారు పాస్బుక్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే విచారణ చేపట్టి పాస్బుక్ జారీ చేస్తాం. రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం అన్ని సక్రమంగా ఉంటే బుక్ తొందరగానే వస్తుంది. జగిత్యాల: ‘ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది. ధరణి పోర్టల్లో లేని పరిష్కార మార్గాలు కొత్తచట్టంలో పొందుపర్చారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే వీలుంది. గతంలో మాదిరిగా సీసీఎల్కు వెళ్లకుండా జిల్లాస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. రైతులకు భూభారతి చట్టంపై వివరించేందుకు ఈనెల 17 నుంచి 29వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. భూభారతి చట్టంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. -
రూటే సప‘రేటు’ఉద్యోగిపై విచారణ
● మెట్పల్లి మండల పరిషత్లో జెడ్పీ సీఈవో విచారణ ● కార్యదర్శులతో సమావేశమై వివరాలు ఆరా.. ● ఆయనను బదిలీ చేయాలని తేల్చిచెప్పిన కార్యదర్శులు మెట్పల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్న మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ నవీన్పై అధికారులు విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగి ఇబ్బందులు పడలేక కొందరు కార్యదర్శులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఈనెల 22న ‘ఆయన రూటే సపరేటు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. ఒక్కో కార్యదర్శిని పలు విషయాలపై అడిగి తెలుసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్తో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు జెడ్పీ సీఈవోకు పూర్తి విషయాలను వివరించారు. ఆయనను బదిలీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణకు హారైన కార్యదర్శులంతా ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు సమాచారం. ప్రతి పనిలోనూ ఉద్దేశపూర్వకంగా కార్యదర్శులను ‘ముప్పుతిప్పలు’ పెట్టిన సబ్ ట్రెజరీ కార్యాలయంలోని మరో ఉద్యోగి విషయంపై మాత్రం అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. సదరు ఉద్యోగితో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కారణంగా ఆయనపైనా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఉగ్రముఠాకు తగిన గుణపాఠం చెప్పాలి
జగిత్యాల: పహల్గమ్లోని జైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనను మాజీమంత్రి జీవన్రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసముందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రజలకు భద్రత కల్పించాలని, కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వాలని సూచించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పర్యాటకులపై దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్న ఉగ్రముఠాను ఉపేక్షించవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలన్నారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రచేస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాల్పుల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రజతోత్సవ సభకు తరలిరండి● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతజగిత్యాలరూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్గల్ గ్రామాల్లో బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతర్గాంలో తాగునీరు, సాగునీరు అంది పంటపొలాలు పచ్చగా ఉన్నాయంటే అది కేసీఆర్, కవిత ఘనతేనన్నారు. ఇల్లులేని నిరుపేదలకు 100 డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత కవితదేనని గుర్తు చేశారు. ఈనెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. మాజీమంత్రి రాజేశంగౌడ్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్రెడ్డి, నాయకులు ఆనందరావు, గంగాధర్, తిరుపతి, శ్రీనివాస్గౌడ్, షఫీ, మల్లేశ్, రాజయ్య, మహేశ్, పోచమల్లయ్య, రంజిత్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లుధర్మపురి: ధర్మపురి మున్సిపల్ కార్యాలయ కార్మికులకు బుధవారం శానిటేషన్ పరికరాలు, పీపీఈ కిట్లయిన తట్టలు, పారలు, చీపుర్లు, గ్లౌజులను కమిషనర్ రాజశేఖర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మహేశ్, సిబ్బంది తదితరులున్నారు. -
ఓ పాఠం
గెలుపు ఓటమిఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు. ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదుఇంటర్ఈ ఏడాది ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యహుజూరాబాద్: ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.కరీంనగర్పెద్దపల్లిజగిత్యాలసిరిసిల్ల -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
రాయికల్: రైతులకు ఇబ్బందులు కలగనీయకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని అల్లీపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, తహసీల్దార్ ఖయ్యూం, సీఈవో ఉపేందర్, నాయకులు ముఖీద్, తిరుపతిగౌడ్, మోర వెంకటేశ్, రత్నాకర్రావు, రామన్న, రవి, జీవన్రెడ్డి, గంగారాం, శంకర్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించండి జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం క న్నాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు కన్నాపూర్, కుర్మపల్లి రైతులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్, ఉన్నతాకారులతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సైన్స్ ప్రయోగశాలకు భూమిపూజ జగిత్యాల: జిల్లాకేంద్రంలోని బాలికల హైస్కూల్లో రూ.13.5 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ప్రయోగశాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, విద్యాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డీఈవో రాము, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, హెచ్ఎం రామానుజం, తపస్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య పాల్గొన్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల పరిశీలన నూకపల్లిలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4,520 ఇళ్లను నిర్మించామన్నారు. నూకపల్లి కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేశామన్నారు. దాదాపు 25 వేల మంది పేదలకు వసతి కల్పించాలన్న లక్ష్యంగా ఇళ్లు నిర్మించామని తెలిపారు. -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని ట్రినిటి విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనాయత్, రశ్మిత, నేహ, నిఖిత 467మార్కులు సాధించారు. 48మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్.హేమనందిని 438 మార్కులు, 16మంది 436 మార్కులు, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494మార్కులు, రాహుల్, దీపిక 490 మార్కులు, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994 మార్కులు, 13మంది 993, 21మంది 992, 27మంది 991మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996, మహతి, పల్లవి 994మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి అభినందించారు. -
భూభారతిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ పునరుద్ధరణ
● అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యప్రసాద్ ● పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్సారంగాపూర్: భూభారతి చట్టంలో పట్టాదా రుడు నష్టపోయినప్పుడు తిరిగి అప్పీలు చేసుకోవడానికి రెండంచెల వ్యవస్థ పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన కల్పించారు. ఎమ్మె ల్యే సంజయ్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సాదాబైనామాలకు ధరణిలో పరిష్కారం దొరకలేదని, భూభారతిలో సంపూ ర్ణ పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి ఇతరుల పేరిట బదలాయింపు అయితే పట్టా దారుడు మొదటి అప్పీల్ కింద ఆర్డీవో, రెండో ప్పీల్ కింద జేసీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. వివాదాల్లో ఉన్న భూములకూ పట్టాదా రుడు నష్టపోకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ధరణిలోని లో పాలను సవరిస్తూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూద న్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ పాల్గొన్నారు. నాణ్యమైన ధాన్యం తేవాలి రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధా న్యం తేవాలని, తప్ప, తాలు లేకుండా చూడాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు. కోనాపూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తూకం వేయడానికి సీరియల్ నంబర్ పాటించాలని, తేమ శాతం వస్తే తూకం వేయాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్, విండో చైర్మన్లు గుర్నాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి ఉన్నారు. -
మోడల్స్కూల్ విద్యార్థుల ప్రతిభ
లజగిత్యాలరూరల్: ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్కు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బోదాసు నాగరాణి 457, పాంపల్లి శ్రీజ 456, ఇమ్మడి అశ్విని 450, ద్వితీయ సంవత్సరంలో శేర్ల అక్షయ 975, పంబాల కావ్య 973, ఒడ్నాల అరుణ్కుమార్ 964 మరికొంత మంది ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సరితాదేవి తెలిపారు. పెగడపల్లి విద్యార్థులు.. పెగడపల్లి: స్థానిక ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులు ఫస్టియర్లో 72శాతం, సెకండియర్లో 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో రేవతి 968, ఫస్టియర్ బైపీసీలో కె.అక్షయ 425 మార్కులు సాధించారు. కేజీబీవీ విద్యార్థినులు కూడా ప్రతిభ కనబర్చారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి, మీనాక్షి, ఉపాధ్యాయులు అభినందించారు. ఫస్టియర్లో రాయికల్ విద్యార్థులు రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్స్కూల్ విద్యార్థులు ఎంపీసీలో రష్మిత 460, సీఈసీలో శ్రీనిధి 469, సౌమ్య బీపీసీలో 406, సెకండియర్లో త్రిష ఎంపీసీలో 951, రాజేశ్వరి బీపీసీలో 939, అక్షయ సీఈసీలో 949 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సంతోష్ తెలిపారు. కేజీబీవీ విద్యార్థిని నక్క నందిని సీఈసీలో 492 సాధించినట్లు ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. మల్లాపూర్ విద్యార్థినులు.. మల్లాపూర్: ఎంపీసీలో మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని జీ.లక్ష్మీనర్సయ్య 966 మార్కులు సాధించాడు. మోడల్ స్కూల్లో ఫస్టియర్లో 81.25 శాతం, సెకండియర్లో 92.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమేష్ తెలిపారు. బైపీసీ టాపర్గా భావన 901, సీఈసీ టాపర్లుగా శరణ్య 882, భావన 882 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో కీర్తన 358, బైపీసీలో చరీష్మా 308, సీఈసీలో రుచిత 361 మార్కులు సాధించారు. -
కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లలో కట్టె పెడుతున్నరు..
జగిత్యాలటౌన్: దశాబ్దకాలం బీఆర్ఎస్ పాలనలో పదవులు అనుభవించి.. స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ముసుగులో వచ్చి అసలైన కార్యకర్తల కాళ్లలో కొందరు కట్టెపెడుతున్నారని, వారి కట్టెలకన్న తమ కాళ్లు బలంగా ఉన్నాయని, కట్టెపెట్టాలని చూస్తే వారి కట్టె విరుగుతుందిగానీ తాము భయపడేదిలేదని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ నుంచి మంచినీళ్ల బావి వరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం ఇన్చార్జి దినేష్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు. దశాబ్దకాలం పాటు బీఆర్ఎస్ అరాచక పాలనను ఎదిరించి పోరాడిన పార్టీ కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పదేళ్లు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అభివృద్ధి చేసేందుకు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తానని వెల్లడించారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, గాజుల రాజేందర్, నక్క జీవన్ తదితరులు ఉన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలిరాయికల్: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని అల్లీపూర్, ఉప్పుమడుగు, ఆలూరు, తాట్లవాయి, ఆల్యనాయక్తండా, రామాజీపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని, గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ఖయ్యూం ఉన్నారు. -
మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు...
ధర్మపురి: ధర్మపురి మండలం మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారు. ఫస్టియర్లో 148మందికి 120 మంది పాసయ్యారు. సెకండియర్లో 119 మందికి 111 మంది ఉత్తీర్ణులయ్యారు. మైనార్టీ గురుకులంలో ఫస్టియర్లో 53 మందికి 47, సెకండియర్లో 45 మందికి 45 మంది ఉత్తీర్ణులయ్యారు. మగ్గిడి సోషల్ వెల్ఫేర్ కళా శాలలో ఫస్టియర్లో 18 మందికి 13, సెకండియర్లో 13 మందికి 13 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులను మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు అభినందించారు. నక్షత్ర -
ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది. శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి, తండ్రి ఎల్లయ్య క్వారీ పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులలో ఒకరు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. మరో కుమారుడికి ఇటీవలే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. బావిలో దూకి మహిళ ఆత్మహత్యబుగ్గారం: జీవితంపై విరక్తితో వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుగ్గారం మండలం గంగాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్ట గంగమ్మ (61) కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారుడు కట్ట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు. గంగమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అత్యాచారయత్నం కేసులో రెండేళ్ల జైలు జగిత్యాలజోన్: మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదన పు జిల్లా జడ్జి సుగళి నారాయణ మంగళవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాసారపు మల్లేశం కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను భర్త వదిలివెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి కిరాణం షాఫు పెట్టుకుని జీవిస్తోంది. 2019 మే9న రాత్రి భోజనం చేసి తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో సొంత చిన్న మామ అయిన బోద్దుల రాజేందర్ కిటికికి ఉన్న దోమ తెరను కత్తిరించుకుని అక్రమంగా మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సదరు మహిళ అరవడంతో పక్కింటి వారు వచ్చేసరికి రాజేందర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కె.నరేష్, బి.రాజునాయక్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి బొద్దుల రాజేందర్కు రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
బాలికలదే పైచేయి
● ఇంటర్ ఫస్టియర్లో 68శాతం పాసైన బాలికలు ● 39శాతంతో బాలుర ఉత్తీర్ణత ● సెకండియర్లో 54.9 శాతం బాలురు.. ● 78.58 శాతంతో బాలికలు అగ్రస్థానం ● జిల్లాకు ఫస్టియిర్లో 24.. సెకండియర్లో 18వ స్థానంజగిత్యాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్లో జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలువగా.. ఫస్టియర్ ఫలితాల్లో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 73 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 మోడల్స్కూళ్లు, ఏడు కేజీబీవీ, ఐదు సోషల్ రెసిడెన్సీలు, ఐదు మైనార్టీ రెసిడెన్షియల్స్ 5, రెండు బీ సీ రెసిడెన్షియల్స్, ఐదు టీఎస్డబ్ల్యూఆర్సీజేసీ, 21 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో.. జిల్లాలో మొదటి సంవత్సరం 2,554 మంది బాలురు పరీక్షలు రాయగా కేవలం 996 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 39శాతంగా నమోదైంది. బాలికలు 3,550 పరీక్ష రాయగా.. 2,443 మంది ఉత్తీర్ణతతో 68.82 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2,233 బాలురు రాయగా.. 1226 మంది ఉత్తీర్ణతతో 54.9 శాతం సాధించారు. బాలికలు 3,137 పరీక్ష రాసి 2,465 మంది పాసై 78.58 శాతం నమోదు చేశారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్లో బాలురు 570 మంది రాసి 178 మంది పాసయ్యారు. 399 బాలికలు పరీక్ష రాసి 273 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్లో 454 బాలురు పరీక్ష రాయగా 226 మంది పాసయ్యారు. 349 బాలికలు పరీక్షరాసి 303 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంపై వారిని అభినందించారు. పేద విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో పోటీపడుతూ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. సీఈసీ సెకండియర్లో మానుపాటి వర్ష 971, గ్రీష్మ 928, ఫస్టియర్ ఎంపీసీలో సానియామీర్జా 465, బైపీసీలో నజాలియ నస్ర 430 మార్కులు సాధించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, అధ్యాపకులు కొట్టాల తిరుపతిరెడ్డి, రాజయ్య, సునీత, శ్రీలత, శిల్ప, మాధవి పాల్గొన్నారు. మే 22 నుంచి సప్లిమెంటరీఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలిచిందని ఇంటర్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఫస్టియర్లో 4.65శాతం, సెకండియర్లో 4.4శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం మే 22నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా.. రీకౌంటింగ్.. రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30లోపు ఫీజు చెల్లించి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. జవాబు ప్రతిని కూడా పొందవచ్చని సూచించారు. -
జగిత్యాల
న్యూస్రీల్నృసింహ స్వామి ఆలయం శుభ్రంధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి ఫైరింజన్తో శుభ్రం చేశారు. ఆలయం లోపలిభాగాన్ని కొన్నాళ్లుగా శుభ్రం చేయకపోవడంతో విషయాన్ని ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఫైరింజన్కు ఆన్లైన్లో చలానా చెల్లించి శుభ్రం చేసినట్లు తెలిపారు. బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025 -
నేనూ వస్త బిడ్డా కేసీఆర్ సభకు..
9జగిత్యాలరూరల్: ‘కేసీఆర్ను చూడాలవ్వ.. నేనూ వస్తా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు.. నన్ను ఎలాగైనా తీసుకెళ్లండి..’ అంటూ జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు చిన్నమల్లయ్య జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతను కోరారు. తాను కేసీఆర్ను చూస్తానని, తనను సభకు తీసుకెళ్లండని బతిమిలాడా రు. దీనికి వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు తప్పకుండా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 27న గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించాలని వసంత సూచించారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ మహేశ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సునీత, స్వప్న పాల్గొన్నారు. ఆంధ్రులు తెలంగాణకు వ్యవసాయం నేర్పారా..? తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపర్చినట్టేనని వసంత అన్నారు. తెలంగాణ రైతులకు వెయ్యేళ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో వరి పండించిన చరిత్ర ఉందన్నారు. -
‘ఎస్వీజేసీ’ విజయదుందుబి
కరీంనగర్: ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఫస్టియర్లో ఎంపీసీలో సీహెచ్ రాజశేఖర్రెడ్డి 468, బి.వెన్నెల 466, బి.శ్రీనిత్య 466, బి.హరిణి 465, ఎన్.అరుణ్తేజ 464, కె.సహస్ర 463, ఎస్కే.తమన్నా 463, జె.సునీల్ 462, పి.సంజన 462, ఏ.హర్షవర్దన్ 462 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర 437, డి.శివకుమార్ 437, డి.శ్రీనిధి యాదవ్ 435, ఎం.స్పందన 434, అనికేత్ మిశ్రా 434,శ్రీవల్లి 432, బి.రుచిత 431, ఎన్.నిహారక 430 మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీలో పి.లిఖిత 992, ఎం.స్పూర్తి 992, ఎస్.రిషిక 991, టి.లిఖిత గౌడ్ 989, ఆర్.మేఘన 988, కె.కార్తీక్ 988, ఎస్.లావణ్య 987, ఎం.త్రిణిజ 987, ఎస్.రక్షిత 987 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఎస్ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు. -
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు. -
ఇష్టారాజ్యంగా మార్కెట్ ఫీజు
మామిడి మార్కెట్లో ఇష్టారాజ్యంగా మార్కెట్ పీజు వసూలు చేస్తున్నారు. ఎంత కాయ కొంటున్నారు..? ఎంత వసూలు చేస్తున్నారు..? ఎవరికీ తెలియదు. మార్కెట్ ఫీజు బుక్కులు చివరకు వ్యాపారులకే ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ సారి అలా జరగకుండా చూడాలి. – బందెల మల్లయ్య, చల్గల్, రైతు పకడ్బందీగా వసూలు చేస్తాం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా.. ఈసారి పకడ్బందీగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో ఉండేందుకే ఏ వ్యాపారికి కూడా మార్కెట్ బయట క్రయ విక్రయాలు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతిరోజూ వ్యాపారుల దుకాణాలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తాం. – రాజశేఖర్, మార్కెట్ కార్యదర్శి, జగిత్యాల -
‘పెద్దింటి’కి అరుదైన గౌరవం
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత పెద్దింటి అశోక్కుమార్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన జిగిరి, గోస, అనగనగా ఓ కోడిపెట్ట అనే కథలను వరంగల్లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్గా ప్రవేశపెట్టారు. ఆయా కథలను బోధించే బాధ్యతను కూడా అప్పగించారు. స్వతహాగా ఉపాధ్యాయుడైన పెద్దింటి కళాశాల విద్యార్థులకు కథలను పాఠాలుగా బోధించారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల కళాశాలలో రచయితే అధ్యాపకుడై బోధించడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ సానబోయిన సతీశ్ తెలిపారు. తన కథలపై తానే విస్తృతోపన్యాసం ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా పెద్దింటి అభివర్ణించారు. ఈ సందర్భంగా పెద్దింటిని మానేరు రచయితల సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు అభినందించారు. -
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: ఈనెల 27 వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సత సభకు భారీగా తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలో సోమవారం పలు కుల సంఘాలు, యువజన సంఘాల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించేందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, అమలు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు
● రావెప్కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక ● రైతులతోనే నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయి పాఠాలు ● భౌగోళిక స్వరూపం, ప్రదర్శనల రూపకల్పనకరీంనగర్ అర్బన్: అవును.. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతర్జాలం ద్వారా అందే సేవలను వివరించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను రూపొందించనుండగా గ్రామ భౌగోళిక స్వరూపాన్ని డయాగ్రామ్ ద్వారా నివేదించనున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (రావెప్)లో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు నాలుగు నెలలపాటు గ్రామాల్లోనే బస చేయనున్నారు. కరీంనగర్ ఏరువాక ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా ఇప్పటికే విద్యార్థులు రైతులతో మమేకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కళాశాలకు చెందిన మొత్తం 21మంది విద్యార్థులకు గానూ 4–5గురు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేసి, మండలానికో గ్రామం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండ గ్రామాల్లో క్షేత్రస్థాయి అనుభవాలను గడిస్తున్నారు. జూన్ వరకు కార్యక్రమాల నిర్వహణతో పాటు అనుభవాలను పొందనున్నారని కరీంనగర్ ఏరువాక సమన్వయకర్త డా.మదన్మోహన్రెడ్డి వివరించారు. యూట్యూబ్, టోల్ఫ్రీ సేవలపై ప్రచారం రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా అంతర్జాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఎప్పకటిప్పటి సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామీణ విశ్లేషణాత్మక తులనం(పీఆర్ఏ)లో భాగంగా సోషల్ మ్యాప్ వేసి గ్రామంలో ఉన్న భౌగోళిక వివరాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, ఇతరత్రా వివరాలను రూపొందించనున్నారు. యూట్యూబ్ ఛానల్ ‘పీజేటీఎస్ఎయూ’లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోలు ఉండనుండగా అథెంటిక్గా రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు చూసుకోవచ్చు. రైతుల విజయగాథలు ఉండనుండగా నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుములు, అపరాలు, తృణధాన్యాలపై వీడియోలు ఉండనున్నాయి. కిసాన్ సారథి టోల్ఫ్రీ నంబర్ 14426 లేదా 18001232175 ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను వివరిస్తే పరిష్కారం చూపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలందనుండగా రైతులు ఫోన్ చేస్తే ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు లైన్లోకి రానున్నారు. ఇక వ్యవసాయ యూనివర్శిటీలు రూపొందించిన విత్తనాలను రైతుల క్షేత్రాల్లో ప్రాక్టికల్గా పరీక్షించనున్నారు. విత్తు నుంచి కోత వరకు సేవలు ఒక్కో విద్యార్థినికి ఒక్కో రైతును అటాచ్ చేయగా వివిధ రకాల విత్తనాలు వేసిన నుంచి పంట కోత వరకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో పాటు పంటలకు ఆశించే చీడపీడల నివారణ, దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకు అనుసరించిన యజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల సూచనల క్రమంలో ఫీల్డ్లో అమలు చేయనున్నారు. ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల వినియోగం పొదుపుగా జరిగేలా సూచనలు చేయనున్నారు. అలాగే ఏ గ్రామంలో సేవలందిస్తున్నారో ఆ గ్రామ నైసర్గిక స్వరూపంతో పాటు వనరులను వివరిస్తూ డయాగ్రామ్ రూపొందించనున్నారు. నాలుగు నెలల పాటు సేవలు మాది సిద్దిపేట. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో అగ్రి కల్చర్ లాస్ట్ ఇయర్ చదువుతున్న. వ్యవసాయ విద్యార్థులకు తరగతి బోధనలతో పాటు ప్రాక్టీకల్ అవగాహన అవసరం. అందుకే నాలుగు నెలల పాటు పంట పొలాలు, రైతుల మధ్య తిరుగుతూ నివేదికలు, మ్యాప్లు రూపొందించాల్సి ఉంటుంది. – పి.స్పందన, ఆగ్రికల్చర్ విద్యార్థి, సిద్దిపేట -
డిజిటల్ భవిష్యత్కు ఏఐ
గంభీరావుపేట(సిరిసిల్ల): డిజిటల్ భవిష్యత్ మొ త్తం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ సంస్థల ప్రొఫెసర్లు పాల్గొని పవర్ ప్రెజెంటేషన్లు, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐ గురించి వివరించారు. సెమినార్లో ఏం చెప్పారంటే.. డిజిటల్ భవిష్యత్కు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దోహదపడుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని ముందుకు సాగించే క్రమంలో త్వరలోనే కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులు డిజిటల్ భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, రీసోర్స్ పర్సన్లు కల్యాణి, స్వాతి మాతూర్, హంట్ మెట్రిక్ సీఈవో అయూబ్ షేక్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటర డాక్టర్ శ్రావణ్కుమార్, పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి ‘కృత్రిమ మేధ’ గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ సెమినార్ హాజరైన రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆకట్టుకున్న ప్రొఫెసర్ల పవర్ ప్రెజెంటేషన్లు -
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అ భ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అని కొని యాడారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో నిర్వహించిన సెమినార్కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యలు -
మామిడి మార్కెట్ ఆదాయం పెరిగేనా..?
● రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం ● మార్కెట్కు ఫీజు మాత్రం అంతంతే ● ఏటా రూ.70లక్షలు దాటని ఆదాయంజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలలోని చల్గల్ మామిడి మార్కెట్లో ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. మార్కెట్ ఫీజు మాత్రం అంతంతమాత్రంగానే వస్తోంది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు ఇష్టారీతిన ఫీజు చెల్లిస్తుండటంతో సరైన ఆదాయం రావడం లేదు. మామిడి మార్కెట్ ఏర్పాటై 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆదాయం ఏటా రూ.50లక్షల నుంచి రూ.60లక్షలలోపే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్లలో మామిడి వ్యాపారం చల్గల్లో మామిడి మార్కెట్ 2005లో సుమారు 23 ఎకరాల స్థలంలో ఏర్పాటైంది. ఈ మార్కెట్లో ఏటా రూ.కోట్లలో వ్యాపారం సాగుతుంది. కాయలు కొనుగోలు చేసేందుకు 88 మంది కమీషన్ ఏజెంట్లు, 59 మంది అడ్తిదారులు ఉన్నారు. వీరంతా ప్రతి సీజన్లో రూ.200కోట్ల వరకు వ్యాపారం చేస్తుంటారు. సీజన్లో ఇక్కడి నుంచి మామిడిని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, నాగ్పూర్ వంటి ప్రాంతాలకు రోజుకు కనీసం 5 నుంచి 10 లారీలు తరలిస్తుంటారు. పెద్దలారీలో 12 నుంచి 15 టన్నులు, చిన్న లారీలో 8 నుంచి 10 టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఐదారేళ్లుగా సగటున టన్ను మామిడికాయల రేటు రూ.30 వేల వరకు ఉంది. పెద్ద లారీలో వెళ్లే 15 టన్నుల మామిడికి టన్నుకు రూ.30వేల చొప్పున, రూ.4.50 లక్షలు అవుతుంది. మామిడికాయల కొనుగోలు విలువ ప్రకారం వ్యాపారులు ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం ఒక్కో లారీకి రూ.4500 మార్కెట్ ఫీజు చెల్లించాలి. మామిడికాయ రేటు పెరిగినప్పుడల్లా.. రేటు ప్రకారం మార్కెట్ ఫీజు వసూలు చేయాలి. వ్యాపారులు అధిక రేటు పెట్టి మామిడికాయలు కొనుగోలు చేసినప్పటికీ తక్కువ రేటుకు కొన్నామని చెప్పి ఆ మేరకు అధికారులు మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ ఫీజుకు గండి పడుతోంది. గతేడాది రూ.63.29లక్షలు మాత్రమే వసూలైంది. 2018లో రూ.71.89 లక్షలు, 2019లో రూ.64.01లక్షలు, 2020లో రూ.69.65 లక్షలు, 2021లో రూ.91.70 లక్షలు, 2022లో రూ.60.90 లక్షలు, 2023 రూ.43.28 లక్షల ఫీజు మాత్రమే వసూలైంది. ప్రారంభం నామమాత్రం దివంగత వైఎస్ హయాంలో అప్పటి మంత్రి జీ వన్ రెడ్డి పట్టుబట్టి మామిడి మార్కెట్ను జగి త్యాలకు తెచ్చారు. రూ.కోట్లు విలువైన వాలంతరీ సంస్థ స్థలాన్ని మార్కెట్కు కేటా యించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే సంజ య్కుమార్ ఒత్తిడితో మరో 10 ఎకరాలు కేటాయించింది. స్థలంతోపాటు దాదాపు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్లతో వ్యాపారుల కోసం షెడ్లు నిర్మించారు. మార్కెట్ ప్రారంభ సమయంలో వ్యాపారులు, రైతులకు మార్కెట్ను పరిచయం చేసేందుకు లారీకి రూ.500 నుంచి రూ.వెయ్యి ప్పున నామమాత్రపు మార్కెట్ ఫీజు వసూలు చేసారు. అదే అదనుగా తీసుకున్న వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్వహణకూ సరిపోని పరిస్థితి మార్కెట్కు వచ్చే ఫీజు నిర్వహణకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ బిల్లులు కూడా మార్కెట్ నుంచే చెల్లించే పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు జరపడం, తాగునీటి వసతి కల్పించడం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వంటి పనులు కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. మార్కెట్ను పర్యవేక్షించే నలుగురైదుగురు సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షెడ్ల నిర్మాణానికి మేడ్చల్, ములుగు, నర్సంపేట, కథలాపూర్, లక్సెట్టిపేట మార్కెట్ల నుంచి రూ.5.20 కోట్లు అప్పు తెచ్చారు. ఆ ఆప్పులకు వడ్డీ చెల్లించేందుకు మార్కెట్ ఫీజు సరిపోవడం లేదు. -
చెరువులో మునిగి ఒకరి మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు. విద్యుత్షాకుతో రైతు..బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, నువ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్ వైరు మధ్యలో కొద్దిగా కట్ అయిన విషయం తెలియక మోటార్ స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్ వైరుకు విద్యుత్ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సీఎంఆర్ చెల్లించాలిజగిత్యాల: వానాకాలం సీజన్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ రోజువారి లక్ష్యం ప్రకారం చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బాయిల్డ్ రైస్మిల్లర్లతో సోమవారం సమీక్షించారు. మిల్లు కెపాసిటి ప్రకారం రోజువారి సీఎంఆర్ చెల్లింపులు చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివేదిక సమర్పించాలన్నారు. ఎఫ్సీఐ అధికారులు సీఎంఆర్ గోదాముల్లో అవసరమైన స్థలం ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్ సభకు చలో చలో..
మేడిపల్లి: ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. సోమవారం మండలకేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశమై సభ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామగ్రామాన బీఆర్ఎస్ జండా ఎగురవేయాలని, వరంగల్ సభకు తరలిరావాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, చెన్నమనేని అజిత్రావు, ఉదిగిరి ఆదిరెడ్డి, మకిలీ దాసు, దేశవేని కృష్ణ, నాంచారి రాజేందర్ పాల్గొన్నారు. -
ఆయన రూటే సప‘రేటు’
● మెట్పల్లి మండల పరిషత్లో ఓ ఉద్యోగి ఇష్టారాజ్యం ● కార్యదర్శులకు తలనొప్పిగా ఆయన తీరు ● ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ● పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ● ఆయన బాటలోనే మరో కార్యాలయం ఉద్యోగి ● మెట్పల్లి మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి కొన్ని రోజుల క్రితం జీపీఎఫ్ లోన్ విషయంపై మండల పరిషత్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్దకు వెళ్లాడు. ఆ పనికి సంబంధించిన పత్రాలు నిబంధనల ప్రకారం ఉన్నప్పటికీ పెండింగ్లో పెట్టాడు. ఎంత బతిమిలాడిన పనిచేయకుండా నెలరోజులకు పైగా తిప్పించుకున్నాడు. చివరకు ఆ కార్యదర్శి తన పైఅధికారి దృష్టికి తీసుకెళ్లాడు. ఆ అధికారి చెప్పినప్పటికీ పనిచేయలేదు. కొద్దిరోజుల తర్వాత ‘కొంతమొత్తం’ ముట్టచెబితేనే పని చేసినట్లు తెలిసింది. ● మెట్పల్లి మండలంలోని మరో కార్యదర్శి వేతనానికి సంబంధించిన విషయంపై సదరు ఉద్యోగి వద్దకు వెళ్లాడు. పెండింగ్లో పెట్టి.. చాలారోజుల తర్వాత పనిపూర్తి చేశాడు. ఆ పనికి సంబంధించిన తర్వాతి ప్రక్రియ మరో కార్యాలయంలో జరగాల్సి ఉంది. ‘కొంతమొత్తం’ ముట్టజెప్పలేదనే కారణంతో మరో కార్యాలయంలో తనకు సన్నిహితంగా ఉండే ఉద్యోగితో ఆ పనిని పెండింగ్లో పెట్టించి ఇబ్బందులకు గురిచేయించినట్లు తెలిసింది. ఇలా వీరే కాదు సదరు అధికారి తీరుతో మరికొందరు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై విసుగు చెందిన పంచాయతీ కార్యదర్శులు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా..? అంటూ తన పైఅధికారిని సదరు ఉద్యోగి ప్రశ్నించడం గమనార్హం. ఎంతో ‘కొంత’ ముట్టచెబితేనే.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనుల విషయంలో సదరు ఉద్యోగి వద్దకు వెళ్తున్న కార్యదర్శులు ఎంతో కొంత ముట్టచెబితేనే పనులు జరుగుతాయనేది ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది. ఉద్యోగుల వేతనాలు, సరెండర్ సెలవులు, ఇంక్రిమెంట్లు ,ఐటీ ఫైలింగ్, జీపీఎఫ్ లోన్, అప్పులకు సంబంధించిన పనులు, మిగతా సర్వీస్కు సంబంధించిన పనులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. లేకుంటే ఆ పనులను పెండింగ్లో పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. సదరు ఉద్యోగి ప్రతి పనిని పెండింగ్ పెట్టడం, కాసులు ఇస్తేనే పని చేస్తుండడంతో బాధితులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పూర్తిచేసి..అక్కడ పెండింగ్.. తన వద్దకు వచ్చిన కొన్ని పనులను తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి చేస్తున్న సదరు ఉద్యోగి.. ఆ పనికి సంబంధించి చివరి ప్రక్రియ మరో కార్యాలయంలో పూర్తి కావాల్సి ఉంటే అక్కడ తనకు సన్నిహితంగా ఉండే మరో ఉద్యోగితో పెండింగ్లో పెట్టించడం.. లేదా ఏదో కారణం చూపుతూ ఉద్దేశపూర్వకంగానే రిజెక్ట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇలా పనులు పూర్తికాకపోవడంతో ‘ఫలానా పని పూర్తికాలేదు సార్’ అని సదరు ఉద్యోగి వద్దకు వెళ్తే ‘నా వద్ద పని పూర్తయింది.. కానీ ఆ కార్యాలయంలో పెండింగ్ ఉంది..’ అని చెబుతున్నట్లు తెలిసింది. మరో కార్యాలయంలోని ఉద్యోగి వద్దకు వెళ్తే ఆయన మొదటగా ఏదో కారణాలు చెబుతూ, రోజుల తరబడి తిప్పించుకుంటూ.. ఆ తర్వాత ‘చేయి తడిపితేనే’ పనులు పూర్తి చేస్తున్నాడని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. షోకాజ్ నోటీస్ జారీ చేశారు పనుల విషయంలో సదరు ఉద్యోగి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యదర్శులు ఫిర్యాదు చేశారు. ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సదరు ఉద్యోగికి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశారు. – మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవో, మెట్పల్లి -
యూజీడీపై ఆశలు
● రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం ● నిధులు మంజూరుకు కేంద్రానికి ఎమ్మెల్యే వినతి ● పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు ఎంతో మేలు జగిత్యాల: జిల్లా కేంద్రం.. లక్షకు పైగా జనాభా. 48 వార్డులు.. గ్రేడ్–1 మున్సిపాలిటీ కావడంతో జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) అత్యంత ఆవశ్యకంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరంతా రోడ్లపైనే పారుతూ అస్తవ్యస్తంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీకి బీజం పడినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపితే అనుమతి రాగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్తో కలిసి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతోపాటు, యూఐడీఎఫ్ పథకం కింద ఎస్టీపీ సీవరేజీ ప్లాంట్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరైతే జిల్లా కేంద్రంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు కార్యరూపం దాల్చ నుంది. 2017లోనే బీజం.. జగిత్యాల జిల్లాగా మారిన అనంతరం జిల్లాకేంద్రంతోపాటు మెట్పల్లి, కోరుట్ల, మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం మారిన అనంతరం మళ్లీ యూజీడీ వ్యవస్థ ముందుకు వచ్చింది. గతంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు యూజీడీ రూపకల్పనకు హైదరాబాద్కు చెందిన యూటర్న్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇందుకు రూ.25లక్షలు కూడా కేటాయించారు. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. డీపీఆర్ రూ.400 కోట్లతో సిద్ధం చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఢిల్లీలోని కేంద్రమంత్రితో పాటు, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను కలిసి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ అర్వింద్తో కలిసి కోరారు. జగిత్యాల వ్యూ యూజీడీతో మారనున్న రూపురేఖలు జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అస్తవ్యవస్తంగా మారింది. వర్షకాలం ఇళ్లలోకి నీరు చేరుతోంది. జిల్లాకేంద్రం కావడంతో చాలా గ్రామాలు ఇందులో విలీనమయ్యాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. జగిత్యాల సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లక్షకు పైగా జనాభా ఉన్నా.. యూజీడీ లేకపోవడం గమనార్హం. ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సిటీ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. యూజీడీ మంజూరుకు కృషి జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటున్నాం. రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే యూజీడీ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – సంజయ్కుమార్, ఎమ్మెల్యే -
భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
మెట్పల్లిరూరల్: రైతుల భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి శివారులోని ఓ గార్డెన్లో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. వీఆర్వో, వీఆర్ఏలు లేకపోవడంతో రైతుల భూ సమస్యలను గుర్తించేందుకు తహసీల్దార్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని, నూతన చట్టంతో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఏటా డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని రికార్డులను ఆప్డేట్ చేస్తారన్నారు. అనంతరం విట్టంపేట, మెట్లాచిట్టాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, డీఆర్డీవో పీడీ రఘువరన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్, ఆర్ఐలు కాంతయ్య, ఉమేశ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. భూములకు రక్షణ కల్పించేందుకే కొత్త చట్టం: విప్ అడ్లూరి గొల్లపల్లి: భూములకు రక్షణ కల్పించడానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి పోర్టల్ను రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు పంట నష్ట పరిహారం అందేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఎంపీ సోమవారం పరిశీలించారు. పంట నష్టంపై సత్వరమే సర్వే నిర్వహించి ఎకరాకు రూ.50వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందర్రెడ్డి, నాయకులు రఘు, సుకేందర్గౌడ్, వొడ్డెపల్లి శ్రీనివాస్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నృసింహుని సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని సోమవారం రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం తరఫున చైర్మన్ జక్కు రవీందర్ వారికి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం అందించారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, అర్చకులు నంబి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జడ్జి పూజలు నృసింహస్వామిని మంచిర్యాల జడ్జి అర్పిత దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాస్ ఆమెకు స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. తేమశాతం వచ్చిన ధాన్యం కొనండిమెట్పల్లిరూరల్: తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం మేడిపల్లి, సత్తక్కపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఏపీఎం విమోచన, ఏఈవో మనోజ్ఞ, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, నాయకులు ఆరెళ్ల రాజాగౌడ్, గంగాధర్, శ్రీధర్, లింగారెడ్డి, ఖుతుబొద్దీన్పాషా, తదితరులు పాల్గొన్నారు. భారీ వాహనాలు రాకుండా..ధర్మపురి: నృసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వాహనాలతో భక్తులు, వ్యాపారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో నంది చౌరస్తా నుంచి నృసింహుని ఆలయం వరకు.. అక్కడి నుంచి బ్రాహ్మణ సంఘం వరకు భారీ వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన ఐరన్ పైపులు అమర్చారు. వాటి వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. భక్తుల వాహనాలను బ్రాహ్మణసంఘం, నైట్ కాలేజీ వద్ద నున్న పార్కింగ్లో పెట్టుకోవాలని సూచించారు. స్థానికులకు షరతులు ఉండవని తెలిపారు. -
రజతోత్సవ సభకు చీమలదండులా కదలాలి
● మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మల్యాల: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూరా ప్రజలు, కార్యకర్తలు చీమల దండై కదలిరావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. మల్యాల మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయడంలేదని విమర్శించారు. 16నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తితో ఉన్నారని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రజతోత్సవ సభకు తరలివచ్చే ముందు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, శ్రీలత, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్రావు, జనగం శ్రీనివాస్ ఉన్నారు. -
రాజ్యాంగంతోనే పౌరులకు హక్కులు
● మాజీమంత్రి జీవన్రెడ్డి ● బీర్పూర్లో జైబాపు, జైభీం, జైసంవిధాన్ సారంగాపూర్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే ప్రతిపౌరుడు హక్కులను స్వేచ్ఛగా పొందగలుగుతున్నాడని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం బీర్పూర్ మండలకేంద్రంలో జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగప్రతులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోందన్నారు. పదేళ్లలో బీర్పూర్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేనోడు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకుని.. బీజేపీ బాటలో పయనిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, సీసీ రోడ్లు, ఇతర పనులను తన అనుయాయులకే కట్టబెడుతున్నాడని, పదేళ్లపాటు పార్టీని కాపాడిన కార్యకర్తల పొట్టగొడుతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందని, ముసుగులో వచ్చే వారిని ప్రజలు గమనించాలని కోరారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు ఖరీఫ్ నాటికి మూడు గేట్లు బిగించే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. పరిశీలకులు సంగెనభట్ల దినేష్, మహంకాళి రాజన్న, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, పార్టీ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్, గుడిసె జితేందర్, కోండ్ర రాంచంద్రారెడ్డి హాజరయ్యారు. -
తల్లీ బైలెల్లినాదో..
● అద్దకానికి తరలివెళ్లిన నీలగిరి పెద్దమ్మతల్లి ● ముత్యంపేట నుంచి శోభాయాత్ర ● మెట్పల్లికి చేరిన అమ్మవారు ● భారీగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసంనీలగిరి పెద్దమ్మతల్లిని అద్దకానికి తరలిస్తున్న భక్తులుమల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో నీలగిరి పెద్దమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్లకోసారి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని అద్దకం (కొత్తగా రంగులు వేయడం) కోసం ఆలయం నుంచి డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, అశేష భక్తజనం మధ్య శోభాయాత్రగా వేంపేట గ్రామం మీదుగా మెట్పల్లికి తరలించారు. అద్దకం పూర్తయిన తర్వాత మే ఒకటోతేదీన మళ్లీ శోభాయాత్రగా ముత్యంపేటకు తీసుకొచ్చి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా ప్రతిష్ఠించి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మే 4న ఆలయానికి తరలించనున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్లాపూర్, మెట్పల్లి ఎస్సైలు రాజు, కిరణ్ బందోబస్తు నిర్వహించారు. కిసాన్కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కళ్ల నరేశ్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, మాజీ సర్పంచ్ బొల్లపల్లి కృష్ణవేణి పాల్గొన్నారు. -
లేఔట్ నిబంధనలు బేఖాతరు
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలో వెంచర్ల ఏర్పాటులో రియల్ వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న వ్యాపారులు.. వాటి విషయంలో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొ క్కుతున్నారు. లేఅవుట్ అనుమతులు పొందకుండానే దర్జాగా ప్లాట్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొ మ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాల్సిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అఽ దికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పంచాయతీ నుంచి ము న్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన మెట్పల్లిలో ఇంతవరకు ఒక్కటి తప్ప మిగతావన్నీ అక్రమ వెంచర్లే కావడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిబంధనలు ఇవే.. ● వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించడానికి ముందుగా రెవెన్యూ అధికారులకు నాలా కింద దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలి. ● తర్వాత డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్)కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ శాఖ ఆమోదం పొందాలంటే ప్లాట్లుగా విభజిస్తున్న భూమిలో ప్రజాఅవసరాల నిమిత్తం పది శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు ఇవ్వాలి. ● అందులో ఏర్పాటు చేసే రహదారులు కనీసం 33 ఫీట్లు ఉండాలి. జరుగుతోందిలా.. ● పట్టణంలో హన్మాన్నగర్, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, వెంకట్రావ్పేట, ఆరపేట, బీడీ కాలనీ, వేంపేట రోడ్, వెల్లుల్ల రోడ్, రాంనగర్ శివారులో ఉన్న వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేస్తున్న వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. ● కేవలం నాలా కింద బదలాయింపునకే పరిమితమవుతున్నారు. ● స్థానికంగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా రియల్ వ్యాపారులు డీటీసీపీ అనుమతితో వెంచర్లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ● అధికారుల ఉదాసీనత కూడా వీరికి దోహదం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● లేఅవుట్ లేకుండానే భూములను ప్లాట్లుగా విభజించి బహిరంగంగానే విక్రయాలు జరుపుతున్నారు. ఆ భూముల్లో కేవలం 21, 24 ఫీట్లతో మాత్రమే రహదారులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ● ఈ సమస్య వల్ల ఇప్పటికే చాలా కాలనీల్లో రహదారులు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపాలిటీ ఆధీనంలో స్థలాలు లేకపోవడంతో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో వసతులు కల్పించడం కష్టంగా మారింది. హద్దు రాళ్ల తొలగింపునకే పరిమితం ● అక్రమ వెంచర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ● ఎక్కడైనా వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేస్తే అధికారులు అక్కడి వెళ్లి అందులోని హద్దురాళ్ల తొలగింపునకే పరిమితమవుతున్నారు. తర్వాత జరిగే లావాదేవీలను నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు. ● అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా నిబంధల ప్రకారం రావాల్సిన పది శాతం స్థలాలను కోల్పోవాల్సి వస్తోంది. ప్రజలు కొనుగోలు చేయవద్దు లేఅవుట్ అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటిని కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటీవల కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేస్తే అడ్డుకున్నాం. ఇటీవల ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. అలాంటి వాటిని మినహాయిస్తే మిగతా వాటిలో వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. – మోహన్, మున్సిపల్ కమిషనర్ వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్లు వేలాది ప్లాట్లు అక్రమంగా క్రయవిక్రయాలు రెండు దశాబ్దాల్లో కేవలం ఒక్కచోటనే డీటీసీపీ అనుమతి మున్సిపల్ ఆధీనంలో స్థలాలు లేక వసతుల కల్పనకు ఇబ్బందులు -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు ఇవ్వడానికి ప్రజలెవరూ కలెక్టరేట్కు రావొద్దని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణంఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివా సుడు, శ్రీదేవి, భూదేవి కల్యాణాన్ని ఆదివారం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు చక్రపాణిమాధవాచార్యులు, దివాకరాచార్యులు, మాజీ సర్పంచు దొంతుల శ్యామల తుక్కారం, మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకట్, నాయకులు మామిడి సురేశ్రెడ్డి, రాజన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు విడుదల చేయండి జగిత్యాలటౌన్: పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ కార్మికుల జిల్లా విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. మే 20న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. శానిటేషన్, పంపుఆపరేటర్లు, బిల్కలెక్టర్, డ్రైవర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. ఉద్యోగ భద్రత కరువైందన్నారు. కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా అమలు కావడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. కార్యక్రమంలో జీపీ కార్మిక యూనియన్ జిల్లా కార్యదర్శి పులి మల్లేశం, నా యకులు రాజన్న, రాజేందర్, సత్తయ్య, రాజు, దేవయ్య, జోగవ్వ తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గాలు లేకనే సమస్యలుజగిత్యాలటౌన్: స్థానిక సంస్థలకు పాలకవర్గం లేకనే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. వీధి దీపాలు, తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. గాంధీ ఆశయ సాధన కోసం జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్లో ఈనెల 22న నిర్వహించే జైబాపు, జైభీం, జైసంవిధాన్కు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు జీఆర్.దేశాయ్, మహ్మద్భారీ పాల్గొన్నారు. -
వరంగల్ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదాం
కథలాపూర్: ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీ సత్తాను చాటుదామని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సభకు ప్రతీ గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలన్నారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మామిడిపల్లి రవి, కిరణ్రావు, గడ్డం భూమారెడ్డి, కేసరి సాయన్న, దొప్పల జలందర్, వంగ రవీందర్, శీలం మోహన్రెడ్డి, ఏజీబీ మహేందర్, తిరుజానీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ● బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ -
ధాన్యంలో కోత విధించొద్దు
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పెగడపల్లి: ధాన్యంలో మిల్లర్లుగానీ, కొనుగోలు కేంద్రాల నిర్వహకులుగానీ కోత విధిస్తే క్షమించేది లేదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ హెచ్చరించారు. తూకంలో తేడా, ధాన్యంలో కోత ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే నిర్వాహకులపై చర్యలుంటాయన్నారు. మండలంలోని ఆరవెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ధాన్యం తూకం చేసిన వెంటనే రైతులకు ట్రక్షీట్ ఇవ్వాలని, మిల్లులో ధాన్యం దిగుమతి అయ్యే వరకు నిర్వాహకులే బాధ్యత వహించాలని సూచించారు. తూకం చేశాక రైతులకు ఎలాంటి సంబంధమూ ఉండకూడదన్నారు. రైతులు ఽనాణ్యతతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఏఎంసీ వైస్ చైర్మెన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు తిరుపతి, కాంతయ్య, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. -
ధాన్యం త్వరితగతిన తరలించాలి
మల్యాల: తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని ముత్యంపేట, మల్యాల, రామన్నపేట, నూకపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. రైతులు, కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, జాప్యం లేకుండా లారీల్లో తరలించాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఏ పీడీ రఘువరణ్, డిప్యూటీ తహసీల్దార్ నీతా, ఆర్ఐ తిరుపతి, రైతులు పాల్గొన్నారు. -
చిల్లర తిప్పలు తప్పేలా..
● ఆర్టీసీ బస్సు టికెట్ల జారీలో నగదురహిత సేవలు కథలాపూర్(వేములవాడ): ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీలో చిల్లర డబ్బుల సమస్యలకు అడ్డుకట్ట పడింది. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తేవడంతో సేవలు మరింత సులువుగా మారాయి. ఇదివరకు ఉన్న సాధారణ టిమ్ యంత్రాల స్థానంలో కొత్తగా ఈ– టిమ్ (ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూ మిషన్) యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో సెల్ఫోన్లో ఫోన్ పే ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, లేకపోతే ఏటీఎం కార్డుతో స్వైప్ చేసి నగదురహిత బస్సు టికెట్ పొందవచ్చు. ప్రస్తుతం దూరప్రాంతాలకు వెళ్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనే కొన్ని నెలల క్రితం నగదురహిత డిజిటల్ సేవలను అమల్లోకి తెచ్చారు. కొద్దిరోజుల్లోనే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ– టిమ్ యంత్రాల వినియోగం మొదలవుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులకు, కండక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్నిరకాల వ్యాపారాల్లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులుండి చేతిలో నగదు లేకున్నా సెల్ఫోన్ ఉంటే చాలు.. ఏదైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కొత్తగా ఆర్టీసీ సైతం తమ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చింది. మూడు డిపోలు.. 226 బస్సులు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా 382 గ్రామాలున్నాయి. ప్రజలకు రవాణా సౌకర్యార్థం జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 226 బస్సులున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చడంలో బస్సులు సేవలందిస్తున్నాయి. టికెట్ వెనుక రాసే పని లేకుండా.. బస్సుల్లో ఎక్కి టికెట్ తీసుకోగానే మొదట చిల్లర సమస్య ఎదురవుతోంది. చాలా మంది రూ.100, రూ. 200, రూ.500 నోట్లు ఇస్తుంటారు. చిల్లర ఇవ్వాలని కండక్టర్, లేవని ప్రయాణికులు అంటుంటారు. దీంతో టికెట్ వెనుక చెల్లించాల్సిన డబ్బులను కండక్టర్ రాసిస్తుంటారు. ప్రయాణికులు దిగే సమయంలో కండక్టర్ చెల్లిస్తుంటారు. ఒక్కోసారి మరిచిపోయి చిల్లర తీసుకోకుండానే ప్రయాణికులు దిగిపోయి నష్టపోతుంటారు. చిల్లర విషయంలో ఒక్కోసారి గొడవలు జరుగుతుంటాయి. ఈ– టిమ్ యంత్రాలతో ఇలాంటి చిల్లర సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. అటు కండక్టర్, ఇటు ప్రయాణికులకు సేవలు సులువుగా అందుతాయి. సమయం ఆదా అవుతోంది. జిల్లాలోని డిపోల వారీగా బస్సులకు మిషన్ల అవసరాలు ఇలా.. బస్సుల సంఖ్యఈ– టిమ్లుడిపో (ప్రస్తుతం వినియోగిస్తున్నవి)కావాల్సినవిజగిత్యాల 110 20 100(సుమారు) మెట్పల్లి 54 06 60కోరుట్ల 62 50 20 -
స్వగ్రామానికి శ్రీనివాస్ మృతదేహం
ధర్మపురి: దుబయిలో పాకిస్థానీ యువకుడి చేతిలో ఈనెల 11 హత్యకు గురైన మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటతడి పెట్టారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుటుంబానికి ఎన్ఆర్ఐ పాలసీ కింద రూ.5లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రూ.25లక్షలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులున్నారు. -
గల్లంతయిన బాలుడు శవమై..
మల్లాపూర్: మండలకేంద్రం శివారులోని లింగన్న చెరువులో గల్లంతయిన బాలుడు పుట్ట రాజేశ్ (13) శవమై కనిపించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశెట్టి, కవిత దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ పశువులను మేపడానికి శుక్రవారం వెళ్లాడు. లింగన్న చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఎస్సై రాజు సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. ఈక్రమంలో శనివారం ఉదయం చెరువులో శవమై పైకి తేలాడు. రాజేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ధర్మపురి: శుభకార్యం కోసం స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన దెహగం గిరీశ్ (40) కొన్నాళ్లు అమెరికా, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బోయింగ్ (విమానాలు తయారు చేసే కంపెనీ)లో భార్యతోపాటు పనిచేస్తున్నాడు. వీరికి కూతురు సంతానం. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో గురువారం భార్య, కూతురుతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. శు క్రవారం పొద్దంతా బంధువులందరితో ఆనందంగా గడిపాడు. రాత్రి సమయంలో సొంత అ న్నయ్య గణేశ్ ఇంటికి వెళ్లాడు. ఆయనతో మా ట్లాడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. గణేశ్ వెంటనే ఆయనకు సీపీఆర్ చే సి వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. అప్పటిదాకా అందరితో కలిసిమెలి సి ఉండి అంతలోనే అనంతలోకాలకు చేరడంతో బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. విప్ లక్ష్మణ్కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి తదితరులు గిరీశ్ మృతిపట్ల సానుభూతి తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చేపల వేటకు వెళ్లి బాలుడు..కొత్తపల్లి(కరీంనగర్): చేపల వే టకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాలు.. కరీంనగర్లోని రేకుర్తి 18వ డివిజన్కు చెందిన మహ్మద్ అహిల్ అజ్మన్(11), మహ్మద్ అన్సర్, ఎండీ ఆర్మన్ శనివారం ఉదయం వెంకటేశ్వరకాలనీ శ్మశానవాటిక సమీపంలోని బావిలో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహ్మద్ అహిల్ అజ్మన్ ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. ఆందోళనకు గురైన ఇరువురు కేకలు వేయడంతో పాటు స్థానికులకు తెలిపారు. అక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు కృష్ణగౌడ్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. బాలుడి కోసం బావిలో వెతగగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కలెక్టర్ కారుకు ఫైన్ గోదావరిఖని: కలెక్టర్ కారు వేగంగా వెళ్తోంది. హైవే వెంట నిర్ణీత స్పీడ్ను మించి ప్రయాణించడంతో పోలీసులు ఇటీవల ీస్పీడ్గన్ ద్వారా వేగాన్ని గుర్తించి నాలుగు ఫైన్లు వేశారు. ప్రధానంగా పెద్దపల్లి నుంచి కరీంనగర్వైపు వెళ్తుండగా, ముగ్ధుంపూర్వైవు వెళ్తుండగా మూడు ఫైన్లు విధించారు. అలాగే నుస్తులాపూర్ వద్ద హైస్పీడ్తో వెళ్తుండగా మరో ఫైన్ పడింది. టీఎస్ –220001 ఇన్నోవా వాహనంపై నాలుగు ఫైన్ల పేరిట రూ.4,140 ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల ఓ మీటింగ్కు వచ్చిన కలెక్టర్ కారును స్థానికులు ఈ – చాలన్లో చెక్చేయగా ఇవి బయపడ్డాయి. సప్తగిరి ఆస్పత్రి గుర్తింపు రద్దుజమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని సప్తగిరి ఆస్పత్రిలో సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల సృష్టించి డబ్బులు కాజేసిన వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రి గుర్తింపును రద్దు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో డా.చందు తెలిపారు. శనివారం ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నకిలీ బిల్లుల వ్యవహారంపై 2023లో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ బిల్లులతో డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలింది. -
శ్రీచైతన్య విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్చార్జి తిరుపతి తెలిపారు. అలుగునూర్లోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో మాట్లాడారు. విద్యార్థులు వై.భరణిశంకర్ జాతీయస్థాయిలో 88వ ర్యాంకు, బి.సురేశ్ 98, ఎ.కార్తిక్ 584, లకావత్ మాధవ్చరన్ 707, లునావత్ రామ్చరణ్ 777, పత్తెం హృషికేశ్ 796వ ర్యాంకు సాధించగా, మరో ఏడుగురు 6 వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వివరించారు. ఇంతటి విజయాన్ని అందించి, కళాశాలకు పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్ ప్రభంజనం -
విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్
ఓదెల(పెద్దపల్లి): మద్యానికి బానిసై, బెట్టింగ్లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో విద్యుత్ పంపుసెట్లు చోరీచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శనివారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యారు. బెట్టింగ్లు పెడుతున్నారు. జల్సాలకు అలవాటుడపడ్డారు. చేతిలో డబ్బు లేకపోవడంతో కరెంట్ మోటార్లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో వ్యవసాయబావుల వద్ద ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటర్లు, సర్వీసువైర్లను దొంగిలించారు. ఇందుకోసం ఆటోలో తిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. నిఘా తీవ్రతరం చేశారు. దీంతో శనివారం ఎస్సై రమేశ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 39 కరెంట్ మోటార్లు, సర్వీసు వైర్లు, ఆటోట్రాలీ లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాచాపూర్, కోనరావుపేట, రూపునారాయణపేట, కొలనూర్, శివపల్లి, మడిపల్లి గ్రామాల్లో వీటిని చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ను అరెస్టు చేసి, విద్యుత్ మోటార్లతో పాటు ఆటోట్రాలీ, సర్వీసు వైర్లు..మొత్తంగా రూ.10,67,500 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. కాగా, దొంగలను పట్టుకున్న ఎస్సై రమేశ్, ఏఎస్సై అశోక్, హెడ్కానిస్టేబుళ్లు కిషన్, ప్రవళిక, కానిస్టేబుళ్లు రాజేందర్, వెంకటేశ్, రవి, రాజు, శివశంకర్, శంకర్, రామకృష్ణ, అశోక్, సతీశ్, రజిత, దనలక్ష్మి, తేజస్వీనికి డీసీపీ, ఏసీపీ రివార్డులు అందజేశారు. 39 వ్యవసాయ పంపుసెట్లు, సర్వీసు వైర్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వెల్లడి -
గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన పురాణం సాగర్ (30) రామడుగు సమీపాన గల గాయత్రి పంపుహౌజ్ నుంచి వెళ్లే గ్రావిటి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. సాగర్కు పురాణం పద్మతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా సాగర్ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సాగర్ రామడుగు సమీపాన ఉన్న గ్రావిటి కాలువలో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశాయిపల్లిలో వృద్ధుడు.. బోయినపల్లి(చొప్పదండి): నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మండలంలోని దేశాయిపల్లికి చెందిన వృద్ధుడు సంది దుర్గారెడ్డి(80) క్రిమిసంహారక మందు తాగగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్ తెలిపిన వివరాలు. దుర్గారెడ్డి కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వా డినా తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య సంది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ కలహాలతో ఒకరు.. కోరుట్లరూరల్: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీకి చెందిన ఎలిగేటి శ్రీహరి (36) శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీహరి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లు గల్ఫ్ వెళ్లి వచ్చాడు. సాయిరాంపురలో ఇట్లు కట్టుకుని భార్య లాస్య, కుమారుడు హర్ష, కూతురు నేహతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. పిల్లలు స్కూల్కు వెళ్లగా.. భార్య ఇంటి బయట పనులు చేసుకుంటోంది. ఇంతలో శ్రీహరి బెడ్రూంలోనే ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. భార్య వచ్చి చూసి పక్కింటివారిని పిలిచి చూడగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాస్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలోని అసైన్డ్ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వే బ్రిడ్జిపై చర్యలు తీసుకోవాలనే స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు శనివారం స్పందించారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్ను అధికారులు తొలిగించారు. వే బ్రిడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ట్రాన్సకో ఏఈ సంతోష్ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్వేయర్ రాజశేఖర్ వే బ్రిడ్జిని పరిశీలించారు. అసైన్డ్భూమి అని, దీనిని లీజుకు ఇవ్వకూడదన్నారు. ఉన్నతాధికారులకు దీనిపై నివేదిస్తామని ఆర్ఐ శ్రీధర్ తెలిపారు. అనుమతిలేని వే బ్రిడ్జి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ కార్యదర్శి బద్రు తెలిపారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అడ్వాన్డ్స్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మల్లాపూర్: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహరం ప్రకటించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మల్లాపూర్ మండలం ముత్యంపేటలో, ఇబ్రహీంపట్నం మండలకేంద్రంతోపాటు వర్షకొండ, కోజన్కొ త్తూర్, ఎర్దండి గ్రామాల్లో పర్యటించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల్లో మామిడికాయలు రాలి ప్రతి మామిడి రైతుకూ తీరని ఆవేదన మిగిల్చిందన్నారు. చేతికొచ్చే దశలో వరి, నువ్వు, సజ్జలు నేలవాలాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలతోనే సరిపుచ్చడం కాకుండా రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఇబ్రహీంపట్నంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేష్, ఏవో రాజ్కుమార్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్కోరుట్ల రూరల్: ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని అయిలాపూర్, ధర్మారం, కల్లూర్, సర్పరాజ్పూర్, మోహన్రావుపేట, వెంకటాపూర్, మాదా పూర్ గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరహరి, ప్యాక్స్ చైర్మన్ ఆదిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ధాన్యంలో కోతలు పెట్టొద్దు ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. చల్గల్ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిల్లర్లు ఎలాంటి కోతలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే తేవాలన్నారు. తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. డీసీఓ మనోజ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్, నాయకులు బాల ముకుందం, సురేందర్రావు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామగ్రామాన దండు కట్టాలి
సారంగాపూర్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి దండుకట్టి బయల్దేరాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో సభకు జనం తరలింపుపై పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన దివ్యాంగుడు రమేశ్ పింఛన్ సొమ్ము రూ.రెండు వేలు అందించి కేసీఆర్ సభకు ఖర్చు చేయాలని కోరారు. కార్యక్రమంలో సారంగాపూర్, బీర్పూర్ మండలాల పార్టీ అధ్యక్షులు తేలు రాజు, మాజీ సర్పంచ్లు భూక్య సంతోష్, బల్మూరి నారాయణరావు, వెంకటేష్, బుచ్చిమల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు సాంబరి గంగాధర్, ఎండబెట్ల ప్రసాద్, జలేందర్, వొడ్నాల జగన్, సాతల్ల రమేశ్ తదితరులు ఉన్నారు. రజతోత్సవ సభకు తరలిరావాలి జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత -
‘మైకు’
మేల్కొలుపుతోంది..● గంట గంటకీ ఆధ్యాత్మిక సందేశం ● ఊరందరికీ ప్రామాణికం ● సమయం.. రోజు.. వారం.. నెల.. గంటకొట్టి చెబుతోంది ● బావుసాయిపేటలో బహుముఖ ప్రయోజనాలుతెల్లవారుజాము 5 గంటలు.. ఏమయ్యో మైకు మోగింది. లెవ్వు.. లేచి బర్రెపాలు పిండి, పాలకేంద్రంలో పోసిరాపో.. అంటూ భర్తను భార్య పురమాయిస్తుంటోంది. అగో తెల్లారుతోంది.. లేచి పొలం చుట్టూ తిరిగిరాపో అంటూ.. మరో ఇల్లాలు తన భర్తను అప్రమత్తం చేస్తుంటోంది.మైకు చెబుతోంది.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట జనాన్ని మైకు మేల్కొలుపుతోంది. ఆ ఊరి మైకు చెప్పే.. సమయం.. రోజు, వారం, నెల ఆ గ్రామస్తులకు ప్రామాణికమయ్యాయి. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. వ్యవసాయం ప్రధానవృత్తి. కోళ్లు, పాడిపరిశ్రమలు ఉన్నాయి. ఊరంతా ఆ మైక్ చెప్పే సమయాన్ని పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు.సాయంత్రం 5 గంటలు.. మూలవాగు ఒడ్డున గల రవి పొలంలో ముదురుకలుపు తీసేందుకు పది మంది మహిళలు కై కిలి వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి కలుపుతీత పని కొనసాగుతోంది. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు కూలీలు భోజనం చేశారు. మళ్లీ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఊరిలోని మైకు గంటలు మోగాయి. భగద్గీత శ్లోకం వినిపించింది. ఈ రోజు ఆదివారం, ఏప్రిల్ నెల.. 2025.. ఇప్పుడు సమయం ఐదు గంటలు అంటూ.. మైకులో సందేశం వినిపించింది. అంతే అప్పటి వరకు పొలంలో ముదురుకలుపు తీసిన కూలీలు వెంటనే ఒడ్డుపైకి చేరారు. టైమైంది మేం పోతున్నామంటూ ఇంటిబాట పట్టారు. -
‘భూభారతి’తో భూ సమస్యలకు పరిష్కారం
వెల్గటూర్/మేడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం వెల్గటూర్ మండల కేంద్రంలోని రైతువేదిక, మేడిపల్లిలోని బీమన్నగుడి ప్రాంతంలో అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. సాదాబైనామాల రెగ్యులరైజేషన్కు అవకాశం ఉందన్నారు. సరిహద్దు వివాదాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు నివారణకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా విచారణ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు గ్రామకంఠం, ఆబాది భూములకు ప్రత్యేక పాస్బుక్లు ఇవ్వనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శేఖర్, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సహకార సంఘాల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రైతు భూములకు పూర్తి భరోసా.. రైతుల భూములకు భూభారతి చట్టం భరోసా క ల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. జూన్ రెండో తేదీ నుంచి ఆన్లైన్లో పోర్టల్ అందుబాటులోకి వ స్తుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న భూభా రతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ ఉంటుందన్నారు. పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. పంట నష్టం వివరాలు నమోదు చేయాలి ఇబ్రహీంపట్నం: వడగళ్లవాన, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను న మోదు చేయాలని కలెక్టర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టం వివరాలను వారంలోగా సిద్ధం చేసి పంపాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జి ల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేశ్, ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తవ్వారు.. వదిలేశారు
జగిత్యాల: జిల్లా కేంద్రమైన జగిత్యాలలో సుమారు లక్షకుపైగా జనాభా ఉంటుంది. ప్రతి కాలనీల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. ప్రతి వార్డులో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసిన తర్వాత రెండు నెలలు, అనంతరం తవ్వి వదిలేసి మరో రెండు నెలలకు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలకు సంకటంగా మారింది. సీసీరోడ్డు నిర్మాణంలో రెండుమూడు రోజుల్లో పూర్తి చేయవచ్చు. కానీ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదట హడావుడి పనులు మొదలుపెడుతూ పొక్లెయిన్ సహాయంతో రోడ్డంతా తవ్వి దాంట్లో కొద్దిపాటి కంకర పోసి వదిలేస్తున్నారు. నెలల తరబడి ఆపుతున్నారు. దీంతో వాహనాలు వెళ్లాలన్నా, మహిళలు నడవాలన్నా, విద్యార్థులు స్కూల్కు వెళ్లాలన్నా ఆ రో డ్డులో ఇబ్బందికరంగా మారింది. నిబంధనల ప్రకా రం రోడ్డు మొదలుపెట్టిన తర్వాత వెనువెంటనే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ‘సారూ.. పనులు మొదలుపెట్టడం లేదు. ఇబ్బందులు అవుతున్నాయి. ఎటూ వె ళ్లలేని పరిస్థితి ఉంది..’ అని కాలనీ చెందిన ప్రజలు సంబంధిత ఏ ఈ, డీఈ, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇది కాంట్రాక్టర్కు కూడా అలుసుగా మారింది. పనులు అగ్రిమెంట్ అయిన తర్వాత 3 నుంచి ఆర్నెళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్డు మొదలుపెట్టి వారాలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మొదలు పెట్టిన రో డ్లను పూర్తి చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆయా కా లనీవాసులు కోరుతున్నారు. రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం పట్టింపులేని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రజలునాణ్యత కరువే ఇది జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో సీసీరోడ్డు నిర్మాణం కోసం దాదాపు రెండు నెలల క్రితం తవ్వారు. కాంట్రాక్టర్ మరిచిపోయాడు. దీంతో ఆ కాలనీలోని ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి వాహనాలు తీసుకెళ్దామన్నా.. ఆ రోడ్డు వెంట తాగునీరు తీసుకుని మహిళలు వెళ్లాలన్నా.. స్కూళ్లకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. సీసీ రోడ్డు మొదలుపెట్టకముందు దానిపై పొక్లెయిన్తో లేయర్ తీసిన అనంతరం కంకర పోయాల్సి ఉంటుంది. కానీ కొంత మంది కాంట్రాక్టర్లు ఏకంగా చెత్తాచెదారం పోసి నింపుతున్నారు. కనీసం అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో ఫిర్యాదు చేస్తే మళ్లీ దానిని తీసివేయడం, చిన్నపాటి కంకరపోస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్లు, అధికారులు నాణ్యతతో నిర్మించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈత సరదా.. విషాదం కానీయొద్దు
జగిత్యాలక్రైం: వేసవిలో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్తున్నారని, చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయే అవకాశం ఉందని, ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా చూడాలన్నారు. పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. మామిడి చెట్లకు పెళ్లి కథలాపూర్: మండలంలోని గంభీర్పూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శనివారం పెళ్లి జరిపించారు. సంఘం తరఫున ఎనిమిది ఎకరాల్లో తోట పెంచుతున్నారు. చెట్లకు పెళ్లి చేస్తే కాయలు అధికంగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడి చెట్లకు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి జరిపించారు. కులసంఘం సభ్యులకు భోజనాలు పెట్టారు. రన్ ఫర్ జీసస్జగిత్యాలటౌన్: మానవాళి రక్షణకే ఏసుక్రీస్తు జన్మించారని జగిత్యాల బల్దియా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి అన్నారు. ఈస్టర్ సందర్భంగా శనివారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ఫర్ జీసస్ శాంతిర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అందరనీ సమానంగా, ప్రేమతో చూడాలని చెప్పిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని అన్నారు. ఫాస్టర్ రెవా జీవరత్నం మాట్లాడుతూ మానవాళి పాప విమోచనకు క్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజున గుడ్ఫ్రైడేగా.. సమాధి నుంచి లేచిన రోజును ఈస్టర్గా జరుపుకుంటామని తెలిపారు. ర్యాలీలో ఆలయ కమిటీ బాధ్యులు సునంద్రావు, సిల్వన్ బెన్నీ, జాన్వెస్లీ, విగ్నేష్, చర్చి పాస్టర్స్ ముద్దమల్ల ప్రభాకర్, క్రైస్తవులు పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలుగొల్లపల్లి: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్రావు అన్నారు. మండలంలోని రాఘవపట్నంలో పశువులకు టీకాలు వేశారు. మే 15 వరకు పశువులకు టీకాలు వేస్తామని, రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు వెంగలదాసు మల్లేశం, కాసారపు అరవింద్గౌడ్, పశువైద్యాధికారి రవీందర్, లైవ్స్టాక్ అసిస్టెంట్ సంధ్య, సిబ్బంది నర్సయ్య, రవీందర్, శ్రీకాంత్, నిశాంత్, రమేశ్ పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్జగిత్యాల: జిల్లా నుంచి హజ్ యాత్రకు 39 మంది ఎంపికయ్యారని, వీరికి ఈనెల 24న మాతా శిశు సంక్షేమ కేంద్రంలో వ్యాక్సినేషన్ చేస్తామని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శనివారం ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. యాత్రికులకు వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాలు, మెడికల్ సర్టిఫికెట్లు ఇస్తామని మైనార్టీ వెల్ఫేర్ అధికారి తస్లీంపాషా, షకీల్ సూచించారు.