సంక్షేమాధికారులకు పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమాధికారులకు పోస్టింగ్‌

May 2 2025 1:14 AM | Updated on May 2 2025 1:14 AM

సంక్షేమాధికారులకు పోస్టింగ్‌

సంక్షేమాధికారులకు పోస్టింగ్‌

ఎస్సీ వసతిగృహాల్లో నియామకం

కాళేశ్వరం జోన్‌లో 19మంది రిపోర్టు

మంచిర్యాలఅర్బన్‌: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్‌ 24నుంచి 29వరకు కంప్యూటర్‌ ఆధారిత(సీఆర్‌బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్‌ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్‌ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్‌సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. పెద్దపల్లికి ఐదుగురిని కేటాయించారు. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ(గర్ల్స్‌) పెద్దపల్లి, ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్‌ హాస్టల్‌ మంథని, ప్రశాంత్‌, ఎస్సీ ఐడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్‌ హాస్టల్‌ మంథని, డి.తిరుపతి, ఎస్సీడబ్ల్యూహెచ్‌సీ బాయ్స్‌ హాస్టల్‌ మంథని, సాధుల రమేశ్‌, ఎస్సీ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌ మంథనికి కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement