మహిళల రక్షణకు భరోసా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు భరోసా కేంద్రం

May 31 2025 1:14 AM | Updated on May 31 2025 1:14 AM

మహిళల

మహిళల రక్షణకు భరోసా కేంద్రం

జగిత్యాల: మహిళల రక్షణకు భరోసాకేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని డీఈవో రాము పేర్కొన్నారు. ఓల్డ్‌ హైస్కూల్‌లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భరోసా సెంటర్‌ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల కోసం భరోసా బృందం పనిచేస్తుందని, బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేస్తే ఫోక్సో చట్టం ప్రకారం కేసు చేయడం జరుగుతుందని, మహిళలు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే ఫోన్‌ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. భరోసా సెంటర్‌ సభ్యులు సుజాత, సునీత పాల్గొన్నారు.

జీలుగ విత్తనాల కొరత లేదు

జగిత్యాలఅగ్రికల్చర్‌/కోరుట్ల: జిల్లాలో జీలుగ విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ అన్నారు. జిల్లాలోని కోరుట్ల మండలంలో జీలుగ విత్తనాలు లేవన్నది వాస్తవం కాదని అన్నారు. కోరుట్లకు బుధవారం 666 బస్తాల జీలుగ వచ్చిందని, గురువారం 251 బస్తాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోరుట్లలో 415 బస్తాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు ఏడీఏ రమేశ్‌, ఏవో నాగమణి కోరుట్లలో జీలుగ విక్రయించే కేంద్రాలను శుక్రవారం పరిశీలించారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

జగిత్యాల: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఎన్నికై నెల రోజులు కావస్తున్నా పాత కార్యవర్గం సంఘం భవనాన్ని అప్పగించకపోవడంతో అందరి సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమ్మడి నారాయణ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రాజేందర్‌, ట్రెజరర్‌ నారాయణ పాల్గొన్నారు.

వెంకటేశ్వరుడికి క్షీరాభిషేకం

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛవాలతో ప్రత్యేక పూజలు జరిపి, ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దరఖాస్తులకు ఆహ్వానం

జగిత్యాల: జిల్లాలోని మినీ గురుకులం ఒడ్డెలింగాపూర్‌, మల్లాపూర్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లిష్‌ మీడియంలో ఖాళీగా ఉన్న సీట్లకు గిరిజన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి వెంకన్న తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంలో 1వ తరగతిలో 60, 2వ తరగతిలో 12, 3వ తరగతిలో 1, 5వ తరగతిలో 25 సీట్లకు ప్రవేశాలున్నాయని, ఆసక్తి గల గిరిజన విద్యార్థులు జూన్‌ 6లోపు దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 96521 41962 సంప్రదించాలని సూచించారు.

మహిళల రక్షణకు భరోసా కేంద్రం
1
1/3

మహిళల రక్షణకు భరోసా కేంద్రం

మహిళల రక్షణకు భరోసా కేంద్రం
2
2/3

మహిళల రక్షణకు భరోసా కేంద్రం

మహిళల రక్షణకు భరోసా కేంద్రం
3
3/3

మహిళల రక్షణకు భరోసా కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement