ధాన్యం వెంటనే తరలించండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం వెంటనే తరలించండి

May 31 2025 1:14 AM | Updated on May 31 2025 1:14 AM

ధాన్యం వెంటనే తరలించండి

ధాన్యం వెంటనే తరలించండి

సారంగాపూర్‌: వర్షాలు పడుతున్నందున తూకం వేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బీర్‌పూర్‌ మండలం కందెనకుంట, చర్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు లారీల్లో తరలించాలని, లారీలు ఎప్పటికప్పుడు కేంద్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌, ఇతర అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రెండు రోజుల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్‌ హమీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో మదుసూధన్‌, తహసీల్దార్‌ సుజాత ఉన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement